India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్ 118/5Aలో 250 ఎకరాలకు పైగా భూములను ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. అయితే ఆ భూములన్నీ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించింది.
సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలకు ఆయనో దిక్సూచిలా వ్యవహరించారని, రాజకీయాలకు అతీతంగా అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఏచూరి కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక దేశ రాజకీయాలకు ఏచూరి మృతి తీరని లోటని కేరళ సీఎం పినరయి విజయన్, ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్రా-సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి, మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బంధించారు.
హరియాణా అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉత్తర్వులు జారీ చేశారు. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 8న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘ఏలేరు వరదలకీ జగనే, బుడమేరు వరదలకీ జగనే, అచ్యుతాపురం పేలుళ్లకీ జగనే.. ఇలా అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది?’ అని ప్రశ్నించారు.
తనదైన శైలిలో సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించడంలో <<14084560>>సీతారాం ఏచూరి<<>> దిట్ట. సబ్జెక్టుపై సమగ్రమైన అవగాహనతో సభలో ఆయన విలువైన సూచనలు చేసేవారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై ఓటింగ్లో ఆయన ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం అరుదు.
AP: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. ఈ నెల 22వ తేదీ వరకు ట్రాన్స్ఫర్లు చేపట్టొచ్చని తెలిపింది. సెప్టెంబర్ 23 నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఇటు ఎక్సైజ్ శాఖలో బదిలీల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండటంతో బదిలీల గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.
దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కమ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ(54) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె, సోలాపూర్ ఎంపీ ప్రణితి షిండే(44)ను ఆయన వివాహం చేసుకుంటారని సమాచారం. దీంతో వారిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై ఇరు కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అనారోగ్యంతో <<14084560>>చనిపోయిన<<>> సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎల్లుండి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్కు తీసుకురానున్నారు. ఆయనకు చైనా, వియత్నాం, రష్యా, వెనిజుల కమ్యూనిస్టు నేతలు నివాళులర్పించనున్నారు. కాగా బోధన, పరిశోధనల కోసం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబీకులు ఢిల్లీ AIIMSకు డొనేట్ చేశారు.
AP: రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగిందని సీఎం వారికి వివరించారు. ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ప్రాథమికంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.