India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్తో తన తల్లికి ఉన్న సంబంధం వల్ల 7వ తరగతిలోనే వేధింపులకు గురైనట్టు నేనా గుప్తా కుమార్తె మసాబా గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి గర్భం దాల్చినప్పుడు తనది అక్రమ సంతానంగా భావిస్తూ నేనా గుప్తా తల్లిదండ్రులు ఎవరూ చూట్టూ లేరని, తన తండ్రి రిచర్డ్స్ కూడా లేరన్నారు. తాను శారీరకంగా ఎలా ఉన్నది, లేదా ఎందుకలా ఉన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదన్నారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షం కురవనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన గిఫ్టులను వేలం వేయనున్నట్లు కేంద్రం తెలిపింది. వివిధ సందర్భాల్లో దేశ, విదేశాల అతిథులు ఇచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆక్షన్లో ఉంచనున్నట్లు పేర్కొంది. మొత్తం 600 వస్తువులు వేలం వేస్తారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. రేపటి నుంచి వచ్చే నెల 2 వరకు ఈ వేలాన్ని కొనసాగిస్తారు. సేకరించిన నిధులను జాతీయ గంగా నిధికి అందిస్తారు.
TG: సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడంపై KTR మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో విగ్రహాన్ని గాంధీభవన్కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్ తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నట్లు చెప్పారు.
త్వరలో USAలో జరగబోయే కన్సర్ట్స్లో తాను ప్రదర్శన ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రదర్శనలు ఇస్తున్నారనే ప్రకటనలను, ఈవెంట్లకు సంబంధించిన ఈమెయిల్స్ను నమ్మవద్దని కోరుతూ ఆయన టీం ప్రకటన విడుదల చేసింది. సల్మాన్ ఖాన్ పేరును మోసపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
TG: రాష్ట్రంలో హైదరాబాద్లోని బాలాపూర్ వినాయక లడ్డూ వేలానికి చాలా ప్రత్యేకత ఉంది. 1994లో తొలిసారి జరిగిన వేలంలో రూ.450తో మొదలైన దీని ప్రస్థానం గత ఏడాది రూ.27 లక్షలకు చేరింది. దీంతో రేపు ఉదయం 9.30 గంటలకు జరిగే వేలంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సారి వేలంలో కొత్త రికార్డు క్రియేట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు చోట్ల లడ్డూలు రూ.29 లక్షలు, రూ.27 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న తను ప్రియుడు వినీత్తో ఆమె ఏడడుగులు వేశారు. పెళ్లి ఫొటోలు, వేడుకలో సాయి పల్లవి సందడి చేసిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన పలు ఎమోషనల్ ఫొటోలను పూజా కన్నన్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తాళి కట్టే సమయంలో పూజాతో పాటు సాయిపల్లవి కంట తడి పెట్టారు.
పని వేళల్లో భోజన విరామం, కాఫీ బ్రేక్లో సెక్స్లో పాల్గొని దేశ జనాభా రేటు క్షీణతను పరిష్కరించాలని రష్యా ప్రజలకు దేశాధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. రష్యా సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ఒక మహిళకు దాదాపు 1.5 మంది పిల్లలుగా ఉంది. స్థిరమైన జనాభాకు అవసరమైన 2.1 రేటు కంటే తక్కువగా ఉంది. ఉక్రెయిన్తో యుద్ధం వల్ల 10 లక్షలకుపైగా యువకులు దేశాన్ని వీడారు. దీంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
వన్డే క్రికెట్లో 90ల్లో ఎక్కువగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఔటయ్యారు. 17 సార్లు ఆయన 90ల్లో ఔటై త్రుటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. సచిన్ తర్వాత అరవింద డిసిల్వా (7), గ్రాంట్ ఫ్లవర్ (7), నాథన్ అస్టల్ (7), ఆడమ్ గిల్క్రిస్ట్ (6), సనత్ జయసూర్య (6), సౌరవ్ గంగూలీ (6), విలియమ్సన్ (6), శిఖర్ ధవన్ (6), విరాట్ కోహ్లీ (5), వీరేంద్ర సెహ్వాగ్ (5), రోహిత్ శర్మ 4 సార్లు 90ల్లో పెవిలియన్ చేరారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదైన నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఫిర్యాదు అందినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని వేధింపుల పరిష్కార ప్యానెల్కు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. బాధిత పార్టీల ప్రైవసీని రక్షించాలని మీడియాను అభ్యర్థించింది. దీనిపై POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.