India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ సబ్సిడీలు, పరిహారాలు అందించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో రైతుల భూమి హక్కులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోనుంది. వారిలో ఉన్న అపోహలు తొలగించనుంది.
జమిలి ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశభద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకీ ఓటు వేసే అవకాశం ఉందంటున్నాయి. స్థానిక సమస్యలు మరుగున పడటంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి, జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశముందని ఓ సర్వేలో తేలింది.
తెల్లటి పలువరస కోసం చాలామంది ఎక్కువ సేపు బ్రష్ చేసుకుంటుంటారు. మరి కొంతమంది బలంగా తోముతారు. ఇవేవీ మంచివి కావంటున్నారు వైద్య నిపుణులు. ఇలా బ్రష్ చేస్తే పంటిపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది. పళ్లు సెన్సిటివ్గా మారి జివ్వుమని లాగుతుంటాయి. అందుకే కేవలం 2, 3 నిమిషాల్లోనే బ్రషింగ్ ముగించాలని వైద్యులు చెబుతున్నారు. ఇక నిద్ర లేచాక, నిద్రపోయే ముందు బ్రష్ చేస్తే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.
AP: టెట్ అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి ఆన్లైన్లో నమూనా టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. https://cse.ap.gov.in/లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల OCT 3 నుంచి జరిగే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాసే వీలుంటుంది. ఈ నెల 22 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి TETకు 4.27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
AP: శ్రీవారి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై YCP ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో తన కుటుంబం దైవ ప్రమాణానికి సిద్ధమని, CBN సిద్ధమా? అని TTD మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన <<14135822>>పోస్టును<<>> రీట్వీట్ చేసింది. ‘చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? మేం సవాల్ చేస్తున్నాం’ అని రాసుకొచ్చింది. CM ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని సమాచారం. రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో రూ.15,000లను ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు రూ.11,475 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
శర్వానంద్-అనన్య, జై-అంజలి నటించిన ‘జర్నీ’ మూవీ మరోసారి థియేటర్లలో అలరించనుంది. ఈ నెల 21న రీరిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శరవణన్ డైరెక్షన్లో తమిళంలో ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 2011 సెప్టెంబర్లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. అదే ఏడాది డిసెంబర్లో తెలుగులో రిలీజ్ చేయగా, ఇక్కడా హిట్టయ్యింది.
AP: రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో TDP అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు స్థానానికి ఆలపాటి రాజేంద్ర, దేవినేని ఉమ, తాళ్ల వెంకటేశ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆలపాటికే సీటు ఖాయమైనట్లు సమాచారం. ఇక ఉభయగోదావరి జిల్లాల స్థానానికి కేఎస్ జవహర్, బొడ్డు వెంకట రమణ, పేరాబత్తుల రాజశేఖర్, మంతెన రామరాజు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
AP: ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉ.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు.
కొన్నేళ్లుగా అగ్రశ్రేణి జట్లను మట్టికరిపిస్తూ అఫ్గాన్ సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న SAపై తొలిసారి వన్డే మ్యాచ్లో గెలిచింది. దీంతో భారత్పై మినహా టెస్టు క్రికెట్ ఆడే అన్ని జట్లపై విజయాన్ని(టెస్ట్/ODI/T20) సొంతం చేసుకుంది. AUS, NZ, PAK, WI, SL, ZIM, ఐర్లాండ్, BANలపై T20లలో, BAN, ENG, ఐర్లాండ్, PAK, SA, SL, WI, ZIMపై ODIల్లో, బంగ్లా, ఐర్లాండ్, జింబాబ్వేపై టెస్టుల్లో గెలిచింది.
Sorry, no posts matched your criteria.