India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గణేశుడి నిమజ్జనం పవిత్రంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడికి ఉద్వాసన పలికే ముందు పూజ చేసి, గుంజీలు తీయాలి. పత్రి ఆకులతో చేసిన కంకణాలు చేతికి కట్టుకోవాలి. హారతి ఇచ్చి విగ్రహాన్ని జరపాలి. చెరువు దగ్గరకు చేరుకున్నాక అగరబత్తులు వెలిగించి, పువ్వులు పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి మరోసారి హారతి ఇవ్వాలి. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి ‘వచ్చే ఏడు మళ్లీ రావయ్యా’ అని మొక్కాలి.
AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘యోగాంధ్ర టేబుల్ బుక్’ను PM ఆవిష్కరించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని టైట్ షెడ్యూల్ మధ్య ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత కేంద్ర మంత్రులను లోకేశ్ కలవనున్నారు.
శాంతిదూతగా తనని తాను ప్రదర్శించుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. మొన్నటి వరకు 7 యుద్ధాలు ఆపానని.. ఇప్పుడు 3 యుద్ధాలే ఆపినట్లు చెప్పారు. ‘ఒకటి 31 ఏళ్లుగా కొనసాగుతొంది, అందులో కోటిమంది చనిపోయారు. ఇంకొకటి 34 ఏళ్లు, మరొకటి 37 ఏళ్లుగా కొనసాగుతున్నవి’ అని టెక్ సంస్థల CEOలకు ఇచ్చిన విందులో పేర్కొన్నారు. అయితే ఏ దేశాల మధ్య అనే విషయాన్ని ప్రస్తావించలేదు.
AP: ప్రజలకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ‘న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. అందుకు ప్రత్యేకమైన మెళకువలు అవసరం’ అని తెలిపారు. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతోందని, అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘ఘాటీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఓ అమ్మాయి లెజెండ్గా ఎలా మారిందనేదే కథ. అనుష్క, చైతన్యరావు (విలన్) నటన, సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి. విక్రమ్ ప్రభు పరిధి మేరకు నటించారు. మూవీ గ్రాండ్గా ఉన్నప్పటికీ ఔట్డేటెడ్ స్టోరీ, ఎమోషన్స్ లేకపోవడం, సంగీతం, కథ చెప్పే విధానం సరిగ్గా లేకపోవడం మైనస్.
Way2News రేటింగ్: 2.25/5
* భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 440 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. www.bemlindia.in
* బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) కాంట్రాక్టు ప్రాతిపదికన 5 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు. బీఈ/బీటెక్ పాసైన వారు అర్హులు. https://www.bis.gov.in/
* IOCL లో 475 అప్రెంటిస్ పోస్టులు. టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ అర్హత. https://iocl.com/
ప్రస్తుతం ఉన్నత పదవుల్లో, ఉద్యోగాల్లో ఉన్న ఎంతోమంది ఎప్పుడో ఓసారి టీచర్ల చేతిలో దెబ్బలు తినే ఉంటారు. క్రమశిక్షణ కోసమే వారలా దండిస్తూ సరైన మార్గంలో నడిపించారు. దండించిన గురువుల దెబ్బలు మనల్ని గాడిలో పెడితే, అభిమాన ఉపాధ్యాయుల ప్రోత్సాహం జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధింపజేసింది. ఇవన్నీ ఇప్పుడు మధుర జ్ఞాపకాల్లా మారిపోయాయి. ఇప్పటి పిల్లలకు ఇవి తెలియవు. మీరు చదివిన స్కూల్, ఫేవరెట్ టీచర్ ఎవరు? COMMENT
భారతీయులకు సమోసా ఓ ఎమోషన్. మధ్యప్రాచ్యానికి చెందిన ఈ స్నాక్ వ్యాపారులు, యాత్రికుల ద్వారా 13వ శతాబ్దంలో ఇండియాలోకి ప్రవేశించింది. మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో ఇది ఒక విలాసవంతమైన వంటకంగా ఉండేది. తొలుత సమోసాలో మాంసం ఉండేదట. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దీనిలో బంగాళాదుంపను పెట్టారు. ఈ మార్పుతో ఇది ప్రజలకు మరింత చేరువైంది. తక్కువ నూనెతో, ఎయిర్-ఫ్రైయర్తో చేసిన సమోసాలు తినడం మేలు. *వరల్డ్ సమోసా డే*
TG: కవిత <<17599702>>ఆరోపణలపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు పరోక్షంగా స్పందించారు. BRSకు సుప్రీం కేసీఆరే అని, ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే KCR తమకు నేర్పించారని తెలిపారు. ‘కాళేశ్వరం’ అవినీతికి హరీశ్ రావు కారణమంటూ ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
US రక్షణశాఖ (పెంటగాన్)ను ఇక నుంచి యుద్ధశాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ వార్)గా పిలవాలని ట్రంప్ ఆదేశించారు. ‘డిఫెన్స్ సెక్రటరీ’ని ‘వార్ సెక్రటరీ’గా పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. నిజానికి ఆ దేశ రక్షణశాఖ 1789-1947 మధ్య డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ఉండేది. ఆ తర్వాత రక్షణ శాఖగా మార్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత పేరు పెట్టారు. ప్రత్యర్థులకు తమ యుద్ధ సన్నద్ధతను తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.