India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు మరో షాక్ తగిలింది. ఆయన వదిన, జమా ఎమ్మెల్యే సీతా సోరెన్ బీజేపీలో చేరారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేశారు. 14 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా తనకు తగిన గౌరవం దక్కడం లేదని సీత ఆరోపించారు. ఆమె పార్టీని వీడటం దురదృష్టకరమని జేఎంఎం నేతలు చెప్పారు.
మలయాళం సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టింది. రూ.200 కోట్ల క్లబ్లో చేరిన తొలి మాలీవుడ్ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్రకెక్కింది. అనుక్షణం ఉత్కంఠ కలిగించే ఈ సినిమాను మైత్రీ మూవీస్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
TG: రాష్ట్ర నూతన గవర్నర్గా రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు రాజ్భవన్లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీంతో ఇవాళ రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళిసై రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 736.38 పాయింట్లు నష్టపోయి 72,012కి పడిపోయింది. నిఫ్టీ 238.20 పాయింట్లు కోల్పోయి 21,817 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో దాదాపు 1202 షేర్లు పెరగ్గా.. 2,458 షేర్లు పతనమయ్యాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఈ వారంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
AP: కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య మరో లేఖ విడుదల చేశారు. టీడీపీ-జనసేన- బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టోలో కాపులకు మేలు చేసే హామీలు ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 10 హామీలతో కూడిన బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగినదే అని అన్నారు. అలాగే జనాభాలో 20 శాతం ఉన్న కాపులకు కూడా బీసీలకు చెప్పిన విధంగానే హామీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ స్పిన్నర్ ఇమాద్ వసీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్. అతణ్ని ప్రశంసిస్తే పాక్ అభిమానులు బాధపడుతున్నారు. అయినా నిజం ఏంటంటే విరాట్ కోహ్లీ.. బాబర్ ఆజమ్ కంటే గొప్ప ఆటగాడు’ అని వసీమ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కెటామైన్ అనే డ్రగ్ను తీసుకుంటున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ దానిని సమర్థించుకున్నారు. ‘కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటా. దాని నుంచి బయటపడేందుకు డాక్టర్ సూచన మేరకు కొంత మోతాదులో కెటామైన్ తీసుకుంటున్నా. ఇది సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు ఉపయోగపడుతోంది’ అని తెలిపారు. కాగా మత్తుమందులా పనిచేసే ఈ కెటామైన్ను అతిగా వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హిజ్రాల ఆగడాలు పెరిగిపోయాయని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. పెళ్లిళ్లు, షాప్ ఓపెనింగ్స్, ఇతర వేడుకలకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే డ్రెస్సులు తీసేసి వీరంగం సృష్టిస్తున్నారని వాపోతున్నారు. వీరి వెనుక పెద్ద మాఫియా ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని, హిజ్రాలను ఎలాగైనా కంట్రోల్ చేయాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. రైతు సంఘం నేత మాణిక్ రావు కదం ఆ పార్టీని వీడి అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరారు. మరోవైపు NCP ఆయనకు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అవయవాలు దొరక్క ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంపై ఎంత అవగాహన కల్పించినా ప్రజలు ముందుకు రావడం లేదు. అయితే, తాజాగా తెలంగాణకు చెందిన ప్రభాస్ అనే 19 ఏళ్ల యువకుడు తాను చనిపోతూ ఇతరులకు ప్రాణదానం చేశారు. ప్రభాస్ చనిపోవడంతో అతడి 2 కిడ్నీలు, లివర్ను కుటుంబీకులు దానం చేసి మరో ముగ్గురిని కాపాడారు. ఈ విషయాన్ని ‘జీవన్దాన్ తెలంగాణ’ ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.