India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ఏలో ముంబై, కోల్కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్ బీలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ ఉన్నాయి. ఒకే గ్రూపులో ఉన్న జట్లు అదే గ్రూపులో ఉన్న మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. మిగతా గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచుల్లో తలపడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతాయి.
కేంద్రం గ్రాంట్ల విడుదలలో కర్ణాటకకు అన్యాయం చేసిందని ఆ రాష్ట్ర CM సిద్ద రామయ్య చేసిన ఆరోపణలను ఆర్థికమంత్రి నిర్మల కొట్టిపారేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులో కర్ణాటకకు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలనే అంశాలు లేవని అన్నారు. తమకు రావాల్సిన రూ.5,495కోట్ల ప్రత్యేక గ్రాంట్ను విడుదల చేయలేదనే వాదన పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. ఈ గ్రాంట్ల విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని CM నిన్న అన్నారు.
TG: తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అందెశ్రీ దంపతులను సత్కరించారు. మరోవైపు పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీతలు అందె భాస్కర్(డప్పు వాయిద్యం), పెరణి రాజ్ కుమార్(పేరిణి నృత్యం) సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీరిని సత్కరించి అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో EVMల వినియోగంపై MNM అధినేత, నటుడు కమల్హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘EVMను నిందించలేం. ప్రమాదం జరిగితే డ్రైవర్దే తప్పు కానీ.. కారుది కాదు. రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి మనం ఈ EVMలను టెస్ట్ చేయాలి. నేను ఎవరినీ ఎగతాళి చేయడం లేదు’ అని అన్నారు. కాగా ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచును స్పైడర్ క్యామ్ నిలిపివేసింది. గ్రౌండ్ మధ్యలో పైనుంచి విజువల్స్ తీసే కెమెరా వైర్ తెగిపోయింది. ఆ వైర్ గ్రౌండ్లో పడిపోవడంతో తొలి ఓవర్ 2వ బంతి వద్ద మ్యాచ్ ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత గ్రౌండ్ సిబ్బంది మ్యాచ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు.
TG: హోలీ సందర్భంగా హైదరాబాద్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని సూచించారు.
AP: 6,100 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలపై ఇంకా క్లారిటీ రాలేదు. మార్చి 30 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షల నిర్వహణపై ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ.. పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్టికెట్ల డౌన్లోడ్, టెట్ ఫలితాల వెల్లడిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
లక్నోతో మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
RR: జైస్వాల్, బట్లర్, శాంసన్(C), పరాగ్, హెట్మేర్, జురేల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్, సందీప్, చాహల్.
LSG: KL.రాహుల్(C), డికాక్, పడిక్కల్, బదోని, స్టోయినిస్, పూరన్, కృనాల్ పాండ్యా, బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్.
AP: చంద్రశేఖర్ అనే జనసైనికుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్సకు సాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ అభిమాని Xలో ట్వీట్ చేశారు. దీనికి సీఎం జగన్ స్పెషల్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ‘బాధితుడికి వైజాగ్ KGHలో చికిత్స అందిస్తున్నాం. మా టీమ్ ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడింది. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు CMRF కింద చెల్లిస్తాం’ అని పేర్కొన్నారు.
వీరప్పన్ను తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు కలిశానని అతని కూతురు విద్యారాణి తెలిపారు. ఆయనను కలవడం అదే తొలి, చివరిసారి అని చెప్పారు. మెడిసిన్ చదివి ప్రజలకు సేవ చేయాలని ఆయన తనకు చెప్పారని, ఆ మాటలు ఇంకా తనకు గుర్తున్నాయని పేర్కొన్నారు. తన తండ్రి చెప్పిన మాటలే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. న్యాయవాది అయిన ఆమె కృష్ణగిరిలో ఒక స్కూల్ను కూడా నడుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.