India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేదీ: మార్చి 24, ఆదివారం
శుద్ధ చతుర్దశి: ఉదయం 09:55 గంటలకు
పుబ్బ: ఉదయం 07:33 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:38-05:27 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 03:41-17:29 గంటల వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు
* జీవో 317 సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తాం: CM రేవంత్
* ఏపీలో NDAకు 160కి పైగా సీట్లు వస్తాయి: CBN
* సినీ నటులకు మించిన క్రేజ్ CM జగన్ సొంతం: రోజా
* రెండు అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన
* కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణకు ఢిల్లీ HC నిరాకరణ
* IPL: ఢిల్లీపై పంజాబ్, SRHపై KKR విజయం
* మాస్కోలో ఉగ్రదాడి.. 150 మంది మృతి
సన్ రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 20ఓవర్లలో 208 రన్స్ చేయగా.. చేధనకు దిగిన హైదరాబాద్ చివరి వరకు పోరాడి 204 రన్స్ చేసింది. క్లాసెన్ (25 బంతుల్లో 61) అద్భుత పోరాటం వృథా అయింది. చివరి ఓవర్లో క్లాసెన్, షాబాజ్ ఔట్ కావడంతో KKR 4 రన్స్ తేడాతో గెలిచింది. రస్సెల్ బ్యాటింగ్లో 64 రన్స్, బౌలింగ్లో 2వికెట్లతో రాణించారు.
నటి సమంత రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ సరదాగా ఉంటారు. తాజాగా ఓ అభిమాని ఆమెకు గులాబీ పువ్వు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేశారు. ఆ ప్రపోజల్ని సామ్ నవ్వుతూ యాక్సెప్ట్ చేశారట. ఈ విషయాన్ని సదరు అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మొత్తానికి నా క్రష్కు లవ్ ప్రపోజ్ చేశాను. ఆమె ‘YES’ చెప్పారు. జీవితంలో మర్చిపోలేని రోజు ఇది’ అని ట్వీట్ చేశారు. సామ్ అందరితో సరదాగా ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. 46 మంది కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో తెలంగాణ నుంచి ఎలాంటి పేరు లేదు. అస్సాం, అండమాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులను ప్రకటించింది.
మాస్కోలో జరిగిన మారణకాండను ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్ తాలిబన్లు, హమాస్ ప్రతినిధులు ప్రకటించారు. మృతి చెందిన పౌరులకు సంతాపం, రష్యా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు హమాస్ తెలిపింది. మాస్కోలో సంగీత కచేరి జరుగుతుండగా తుపాకులతో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 150 మంది మరణించారు. UNO భద్రతా మండలితో పాటు పలు దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
వియత్నాంలో డాక్టర్లే ఆశ్చర్యపోయే కేసు ఎదురైంది. ఓ రోగి(34) తీవ్రమైన కడుపు తిమ్మిర్ల సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. అతడికి అల్ట్రాసౌండ్, ఎక్స్రే తీశారు. ఆ రిపోర్టుల్లో సదరు రోగి మలద్వారంలో 30సెంటీమీటర్ల లైవ్ ఈల్(బతికున్న చేప) చిక్కుకున్నట్లు తేలింది. దాని ఫలితంగా రోగికి తిమ్మిర్ల సమస్య వచ్చిందని వైద్యులు తేల్చారు. వెంటనే సర్జరీ చేశారు. ఆ జీవి పాయువు ద్వారా లోపలికి ప్రవేశించి ఉండొచ్చని అన్నారు.
TG: ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించకుండా తమకు అందుబాటులో ఉంచాలని గ్రామీణ ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సర్కారు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇసుకను స్థానికంగా అందుబాటులో ఉంచాలని, ఇళ్ల నిర్మాణ పథకాలకు ఉచితంగా సరఫరా వంటి నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. తెలంగాణ ఇసుక మైనింగ్ నిబంధనలు-2015 కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.