news

News November 6, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 6, బుధవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:03 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:17 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:07 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:43 గంటలకు ✒ ఇష: రాత్రి 6.57 గంటలకు ✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 6, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్
* రాహుల్ మాట ఇస్తే అది శాసనం: CM రేవంత్
* ఎల్లుండి నుంచి టెట్ దరఖాస్తు చేసుకోండి: TG విద్యాశాఖ
* రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది: కేటీఆర్
* సరస్వతి ప్లాంట్ ల్యాండ్స్ పరిశీలించిన పవన్ కళ్యాణ్
* వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది: అనిత
* హోంమంత్రి అనితను అవమానపర్చేలా పవన్ వ్యాఖ్యలు: మందకృష్ణ

News November 6, 2024

అమెరికా ఎన్నికలు.. ఆధిక్యంలో ఎవరంటే?

image

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు Real Clear Polling సైట్ తెలిపింది. పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ 219, కమలా హారిస్ 211 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, పెన్సిల్వేనియా, విస్కన్సిన్, ఆరిజోనా, మిచిగాన్, నార్త్ కరోలినా తదితర రాష్ట్రాల్లోని 108 ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.

News November 6, 2024

స్వింగ్ స్టేట్‌కు న‌కిలీ బాంబు బెదిరింపులు

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాంబు బెదిరింపులు క‌ల‌కలం రేపాయి. కీలకమైన ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఒక‌టైన జార్జియాలోని ఫుల్ట‌న్ కౌంటీలో ఐదు పోలింగ్ స్టేష‌న్ల‌కు బెదిరింపులు వచ్చాయి. అయితే, వీటిని న‌కిలీవిగా తేల్చిన‌ట్టు కౌంటీ ఎన్నిక‌ల అధికారి న‌డైన్ విలియ‌మ్స్ తెలిపారు. 5 స్టేష‌న్ల‌లో రెండింటిని అర‌గంట‌పాటు ఖాళీ చేయించిన‌ట్టు ఆయన వెల్ల‌డించారు. అనంత‌రం తిరిగి పోలింగ్ ప్రారంభించామని తెలిపారు.

News November 5, 2024

బరాక్ ఒబామాకు సిద్ద రామయ్య ఆహ్వానం

image

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాకు CM సిద్ద రామ‌య్య ప్ర‌త్యేక ఆహ్వానాన్ని పంపారు. 1924లో బెల‌గావిలో జరిగిన 39వ భార‌త జాతీయ కాంగ్రెస్ స‌ద‌స్సు అధ్య‌క్షుడిగా మ‌హాత్మా గాంధీ బాధ్య‌త‌లు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల బెలగావిలో శతాబ్ది ఉత్సవాలతోపాటు శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఒబామాను సిద్ద రామయ్య కోరారు.

News November 5, 2024

పెళ్లి కుదర్చలేదని మ్యాట్రిమోనీ సైట్‌కు రూ.60వేలు ఫైన్!

image

బెంగళూరులో దిల్మిల్ మ్యాట్రిమోనీ సైట్ ఓ వ్యక్తికి పెళ్లి కుదర్చలేకపోయినందుకు కన్జూమర్ కోర్టు ₹60వేల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని సదరు కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది. తన కొడుక్కి 45రోజుల్లో మ్యాచ్ కుదుర్చుతామని హామీ ఇవ్వడంతో ఓ కస్టమర్ ₹30వేలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా ఒక్క మ్యాచ్ కూడా కుదర్చలేదు. దీంతో తన అమౌంట్ రీఫండ్ చేయాలని అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. ఫలితంగా ఈ తీర్పు వచ్చింది.

News November 5, 2024

రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పవన్ వివరించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా చర్చించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం రేపు రాత్రి రాష్ట్రానికి తిరుగుపయనం కానున్నట్లు సమాచారం. కాగా హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.

News November 5, 2024

టెట్ దరఖాస్తులపై విద్యాశాఖ కీలక సూచన

image

TG: టెట్ దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తులు ఆలస్యమవుతుండడంపై స్పందించిన విద్యాశాఖ ఈనెల 7 నుంచి అప్లై చేసుకోవాలని సూచించింది. వాస్తవానికి నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

News November 5, 2024

45 పైసలకే రూ.10 లక్షల బీమా

image

ప్రయాణికుల భద్రతకు భారతీయ రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో IRCTC కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు చేసింది. రైలు ప్రయాణం చేసేవారికి బీమా ప్రీమియం 45 పైసలుగా నిర్ణయించింది. ఇ-టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది తప్పనిసరి చేసింది. అయితే టికెట్లు బుక్ చేసుకున్నా 5 ఏళ్ల లోపు వారిని ఈ పాలసీలోకి చేర్చలేదు. టికెట్ బుక్ చేసుకున్నాక బీమా కంపెనీ సైట్‌లో నామినీ వివరాలు సమర్పించాలి.