news

News October 14, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 14, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:17 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:55 గంటలకు
ఇష: రాత్రి 7.07 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 14, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 14, సోమవారం
ఏకాదశి: ఉదయం.6.41 గంటలకు
ద్వాదశి: రాత్రి 3.41 గంటలకు
శతభిష: రాత్రి 12.42 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.24-10.52 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.16-1.03 గంటల వరకు,
మధ్యాహ్నం 2.37-3.24 గంటల వరకు

News October 14, 2024

ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతివృత్తం

image

పురాతన మనుషుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా, ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల ఈజిప్షియన్ ఎడారుల్లో ఓ రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7,500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్‌లు దీనిని క్యాలెండర్ సర్కిల్‌గా ఉపయోగించేవారన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారు.

News October 14, 2024

ఓలాపై సెటైరికల్ ట్వీట్.. మామూలుగా లేదుగా!

image

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయ్, సర్వీస్ బాగుండట్లేదంటూ ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ దసరాకు దేశవ్యాప్తంగా సంతోషాలు పంచుతామంటూ డెలివరీకి సిద్ధంగా ఉన్న స్కూటర్ల ఫొటోలను ఓలా ట్వీట్ చేసింది. ‘దయచేసి ఢిల్లీ NCRకు డెలివరీ చేయకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణసంచాను బ్యాన్ చేసింది’ అని రిప్లై ఇచ్చాడు.

News October 14, 2024

BREAKING: భారత్ ఓటమి.. WC నుంచి ఔట్?

image

T20 WC: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (54*) చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. లాస్ట్ ఓవర్లో టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. రేపు PAKపై జరిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఇంటికి వెళ్లినట్లే.

News October 14, 2024

భూకేటాయింపులపై ఖర్గే కీలక నిర్ణయం!

image

ముడా స్కాంలో కర్ణాటక CM సిద్ధ రామయ్యపై ED కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు KT ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను తిరిగివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

News October 13, 2024

కన్నడ బిగ్‌బాస్‌కు పోలీసుల షాక్!

image

కన్నడ బిగ్‌బాస్‌లో స్వర్గం-నరకం అనే కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం నరకంలో ఉన్న కంటెస్టెంట్లకు ఆహారంగా గంజి మాత్రమే ఇచ్చేవారు. బాత్రూమ్‌కి వెళ్లాలన్నా ‘స్వర్గం’ కంటెస్టెంట్ల అనుమతి తీసుకోవాలి. దీంతో షోలోని మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి పోలీసులకు లేఖ రాశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి నిర్వాహకులకు నోటీసులిచ్చారు.

News October 13, 2024

నితీశ్ కుమార్ విజయం వెనుక తండ్రి త్యాగం

image

తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ నేడు భారత క్రికెటరయ్యారు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగమే తన ఎదుగుదలకు పెట్టుబడైంది. ‘నేను జాబ్ చేసే సంస్థ రాజస్థాన్‌కు మారింది. దాంతో నితీశ్ క్రికెట్‌కి ఇబ్బంది అని ఆ జాబ్ మానేశాను. ఆర్థికంగా బాగా కష్టపడ్డాం. అందరూ ఎన్నో మాటలు అన్నారు. నితీశ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తే చాలనుకున్నాను. కానీ ఏకంగా భారత్‌కు ఆడుతున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో మురిసిపోయారు ఆ తండ్రి.

News October 13, 2024

కాంగ్రెస్ నేతల్ని రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు?: KTR

image

తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరని KTR ప్రశ్నించారు. ‘ఇటీవల ఓ మంత్రిపై ఈడీ దాడులు జరిగాయి. రూ.100 కోట్లు దొరికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీ, ఈడీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వాల్మీకి స్కామ్‌లోని రూ.40 కోట్లను తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో వాడిందని కర్ణాటకలో ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు అరెస్టులు లేవు’ అని చురకలంటించారు.