India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒలింపిక్స్-24 బ్రాంజ్ మెడలిస్ట్ <<13758670>>స్వప్నిల్ కుసాలె<<>>కు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానాలపై తండ్రి సురేశ్ అసంతృప్తి వెలిబుచ్చారు. ఆయన ₹5Cr రివార్డ్, పుణే స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర్లో ఫ్లాట్, షూటింగ్ ఎరీనాకు స్వప్నిల్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. MH కంటే చిన్నదైన హరియాణా అథ్లెట్లకు భారీ నజరానాలు ఇస్తోందన్నారు. కాగా స్వప్నిల్కు MH ప్రభుత్వం తమ గైడ్లైన్స్ ప్రకారం ₹2Cr రివార్డ్ ప్రకటించింది.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సీట్ల ఆధిక్యంలో వెనుకబడిన కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం ముందుంది. ఈసీ వెబ్సైట్ ప్రకారం మ.12.15 గంటల సమయానికి కాంగ్రెస్ 40.25 శాతం, బీజేపీ 39.29 శాతం ఓట్లను సాధించాయి. అయితే బీజేపీ 49 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమైంది.

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ పనిచేయట్లేదని చాలా మంది ట్విటర్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇన్స్టా ఓపెన్ చేయగానే ‘something went wrong’ అని చూపిస్తుందని ఫొటోలు పంచుకుంటున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్ డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే, దీనిని కొద్ది సమయంలోనే ఫిక్స్ చేశారని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. మీకూ ఇలా జరిగిందా?

భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ హరియాణా ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కాగా ఆమె 5,103 ఓట్లు లీడింగ్లో ఉన్నారు. ఆమె తర్వాత INC అభ్యర్థి రామ్ నివాస్ రారా, BJP అభ్యర్థి కమల్ గుప్తా ఉన్నారు. సావిత్రి ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు ఛైర్పర్సన్గా ఉన్నారు.

AP: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, అమరావతి ఔటర్ రింగు రోడ్డు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరికొందరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబు ఇవాళ భేటీ కానున్నారు.

ఓట్ల లెక్కింపు తాజా వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్పై బీజేపీ ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తోందా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. ‘లోక్సభ ఎలక్షన్స్ తరహాలోనే అప్ టు డేట్ ట్రెండ్స్ను ECI వెబ్సైట్లో ఆలస్యంగా అప్డేట్ చేయడాన్ని గమనిస్తున్నాం. ఔట్ డేటెడ్, మిస్ లీడింగ్ ట్రెండ్స్ను షేర్ చేసేలా ECపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా’ అని ట్వీట్ చేశారు.

హరియాణా ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రదర్శన దారుణంగా ఉంది. 90కి గాను 88 స్థానాల్లో పోటీచేయగా అన్నింట్లోనూ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో తొలి 2 స్థానాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతోంటే 4, 5, 6 ప్లేసుల్లో ఆప్ ఉంటోంది. EC ప్రకారం జస్ట్ 1.69% ఓట్షేర్ సంపాదించింది. అంటే లక్ష ఓట్లన్నమాట. JJP 0.92, BSP 1.62%తో పోలిస్తే కాస్త బెటరే.

హరియాణాలో ఫలితాలు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. BJP, కాంగ్రెస్ కూటముల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. మొదట్లో లీడింగ్తో సంబరాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ కాసేపటికి కమల దూకుడు ట్రెండ్తో కంగుతింది. మరోవైపు క్యాండిడేట్ల కంటే బెట్టింగ్ రాయుళ్లకు డబుల్ టెన్షన్ ఉంది. ఒక్కో రౌండ్లో ఒక్కోలా రిజల్ట్ వస్తుండటంతో వారిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తమ అంచనా నిజం అయిందనే ఆనందం ఎవరికీ ఎక్కువ సేపు ఉండట్లేదు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందని పోల్స్ చెప్పగా హ్యాట్రిక్ కొట్టేలా BJP ఆధిక్యంలో దూసుకెళుతోంది. ప్రస్తుతం బీజేపీ 50 స్థానాల్లో, కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, BJP ఖాతా తెరిచాయి. 51 స్థానాల్లో లీడ్లో ఉన్న కాంగ్రెస్ కూటమి 2 సీట్లు గెలిచింది. మొత్తంగా 53 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. అటు BJP 25 సీట్లలో లీడింగ్లో ఉండగా ఒక చోట గెలిచింది. మొత్తంగా 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. PDP 3 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఒక్క సీటు కూడా గెలవలేదు.
Sorry, no posts matched your criteria.