India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ ఆనాలిసిస్ వింగ్ నోటీసులు పంపినట్లు వస్తోన్న మెయిల్స్పై PIB FACTCHECK స్పందించింది. ఈ మెయిల్ను IB పంపలేదని, వీటిని నమ్మొద్దని ఫ్యాక్ట్చెక్ వెల్లడించింది. ‘మీరు ఐపీ అడ్రెస్ నిబంధనలు అతిక్రమించింది. వారం రోజుల్లో ఆఫీస్కు వచ్చి హాజరుకావాలి’ అని ఆ మెయిల్లో ఉంది. ఆఫీస్కు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

AP: రాష్ట్రంలోని వాలంటీర్ల జీవితాలు మారుస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తా. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి భవిష్యత్ను తీర్చిదిద్దుతా. ఐటీని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తా. 100 రోజుల్లోనే జే బ్రాండ్ మద్యాన్ని అరికడతా. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టే బాధ్యత నాది’ అని ఆయన పేర్కొన్నారు.

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్లో అధునాతన పరికరాలు కొని వాటిని హైదరాబాద్కు రప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తన పలుకుబడిని ఉపయోగించి సైబర్ నిపుణుడు రవిపాల్తో కలిసి ఈ పరికరాలు తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. త్వరలో ఆ ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశముంది.

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తిహార్ జైలుకు తరలించారు. 10 రోజుల కస్టడీ ముగియడంతో ఇవాళ ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది.

ఎన్నికలు వస్తే ఐదేళ్లు పట్టించుకోని నేతలు సైతం చకాచకా ఓటర్లు అడిగినవి చేసి పెట్టేందుకు సిద్ధమైపోతారు. ఓటు విలువ అలాంటిది మరి. ఇది గ్రహించిన నోయిడా ప్రజలు తమ అపార్ట్మెంట్ల ముందు ‘నో రిజిస్ట్రీ, నో వోట్’ అని బోర్డులు తగిలిస్తున్నారు. తమ కష్టార్జితంతో కొన్న ఇళ్లకు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో తమ డిమాండ్ను ఇలా తెలియజేస్తున్నారు. వీరిలో కొందరు 10ఏళ్లుగా పట్టా కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం.

పాకిస్థాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు చైనీయులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగింది. చైనాకు చెందిన కొంతమంది ఇంజినీర్లు ఇస్లామాబాద్ నుంచి దాసుకు తమ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వీరి వాహనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన మరో వాహనం ఢీకొట్టింది. దీంతో భారీ విస్ఫోటనం జరిగి ఆరుగురు చైనీయులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఫేజ్-XII) 2,049 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ఈ నెల 18తోనే అప్లికేషన్ గడువు ముగిసినా 26వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పోస్టులను బట్టి ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మే 6-8 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: https://ssc.gov.in/

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా తీవ్రమైనది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్కు అప్పటి ముఖ్యమంత్రే బాధ్యులు. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారు’ అని ఆయన ఆరోపించారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన లోక్సభ స్థానాల భర్తీపై అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. సీఎం ఒక్కరే హస్తిన పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలోని మొత్తం 17 MP స్థానాలకు గానూ తొమ్మిదింటికి అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ విడుదల చేసే ఏడో జాబితాలో మిగతా పేర్లను ప్రకటించనున్నారు.

TG: మ్యాట్రిమోని సైట్లు, సోషల్ మీడియా యాప్స్లలో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొఫైల్ చూసి నమ్మి మోసపొవద్దని సూచిస్తున్నారు. ‘ఇలాంటి వేదికల్లో పరిచయమైన వారి గురించి మీ బంధువులు, స్నేహితుల సహకారంతో ఆరా తీయండి. ఆన్లైన్ పరిచయం ఏదైనా అనుమానించండి. నమ్మి మోసపోవటం కంటే ఆరా తీయటం, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంతో మంచిది’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.