India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జియో ఫ్రీ రీఛార్జ్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ‘జియో ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉచితంగా రూ.555 రీఛార్జ్ పొందండి’ అని మెసేజ్లు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి ఉచిత ఆఫర్లను నమ్మి, వారు పంపిన లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు చోరీ అవుతాయన్నారు. వాట్సాప్లలో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను నమ్మవద్దని సూచించారు.

తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ‘ఆప్’ సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్’ అనే క్యాప్షన్తో కూడిన సీఎం ఫొటోను డీపీలుగా పెట్టుకోవాలని సూచించింది. మోదీని ఎదుర్కోగల ఏకైక నేత అరవింద్ కేజ్రీవాల్ అని, ఎన్నికల వేళ ఆధారాలు లేకున్నా అరెస్టు చేశారని మండిపడింది.

ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం(CAA) ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ CM పినరయి విజయన్ మండిపడ్డారు. ‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు’ అని ఫైర్ అయ్యారు.

TS: పదో తరగతి విద్యార్థులకు నేడు, ఎల్లుండి గంటన్నర పాటే పరీక్షలు ఉండనున్నాయి. సైన్స్లో భాగంగా నేడు ఫిజిక్స్ (పేపర్-1), గురువారం బయాలజీ (పేపర్-2) నిర్వహించనున్నారు. ఉ.9.30 నుంచి మ.11 వరకే ఎగ్జామ్స్ ఉండనున్నాయి. చివరి 15 నిమిషాల ముందు అంటే ఉ.10.45 గంటలకు ఆబ్జెక్టివ్ (పార్ట్-B) పేపర్ ఇస్తారు. ఫలితాలు మాత్రం ఫిజిక్స్, బయాలజీ కలిపి ప్రకటిస్తారు. ఇక 30న సోషల్ స్టడీస్తో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి.

AP: సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 10.56గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ఆరంభిస్తారు. ఇచ్ఛాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు.

TS: భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. రెండు మూడు బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరుతడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హోలీ జరుపుకొనేవారందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హోలీ వేడుకలను చేసుకుంటారు. వసంత రుతువు ఆగమనాన్ని వివిధ రంగులతో గుర్తుచేసుకుంటారు. వారందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు’ అని ట్విటర్లో పోస్ట్ చేశారు.

ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేక రుతురాజ్ సేనపై గుజరాత్ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మరణం తర్వాత దేశంలో పుతిన్ ప్రత్యర్థులందరూ వణికిపోతున్నారని అక్కడి ‘ఫ్రీ రష్యా ఫౌండేషన్’ సలహాదారు ఇవ్జీనియా కారా-ముర్జా వెల్లడించారు. అధ్యక్షుడి తీరును తన భర్త వ్లాదిమిర్ సహా పలువురు ఎండగట్టారని, దీంతో కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించిందని తెలిపారు. గతంలో తన భర్తను చంపేందుకు చూసినవారే ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టులో ఆమెను ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4రోజులపాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.