India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి హద్దు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ Xలో విమర్శించారు. పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలోని ఓ గుడిలో పూజారులపై వైసీపీ నేత దాడి చేశారని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ CM కేజ్రీవాల్ ED కస్టడీలో ఉన్నారు. తాజాగా అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. మొహల్లా క్లినిక్లలో టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించినట్లు చెప్పాయి. అంతకుముందు నీటి సమస్య నివారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేజ్రీవాల్ ఆదేశాలు బయటకు ఎలా వెళ్తున్నాయని తెలుసుకునేందుకు ఈడీ చర్యలు చేపట్టింది.

టీడీపీ పెండింగ్లో ఉంచిన స్థానాల్లో IVRS సర్వేలు చేపడుతోంది. విజయనగరం MP సీటు కోసం ముగ్గురి పేర్లు తెరపైకి తెచ్చారు. విజయనగరం అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ మీసాల గీత, ఎచ్చెర్ల సీటు ఆశిస్తున్న అప్పలనాయుడుతో పాటు కంది చంద్రశేఖర్ పేరుతో సర్వే చేస్తున్నారు. ఇటు కడప MP సీటు కోసం శ్రీనివాసులు రెడ్డి, భూపేశ్ రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. ఒంగోలు, అనంతపురం ఎంపీ సీట్లూ పెండింగ్లో ఉన్నాయి.

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జూన్లో ప్రారంభిస్తామని లోకేశ్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రజనీ సినిమా తర్వాత ‘ఖైదీ-2’ సినిమాను మొదలు పెడతానని పేర్కొన్నారు.

గుండె జబ్బుల నుంచి రక్షణ కోసం మూలికలతో HYD కంపెనీ లీ హెల్త్ డొమైన్ ‘లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్’ అనే క్యాప్సూల్ను తయారుచేసింది. వెల్లుల్లి సారం, పసుపు నుంచి తీసిన కుర్కుమిన్, ఫైటోస్టెరాల్, లైకోపిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన ఫైపెరిన్ తదితరాలతో దీన్ని రూపొందించింది. ఈ క్యాప్సూల్ కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ను సమతుల్యం చేసి ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుందని కంపెనీ తెలిపింది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్తో అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు విచారణలో తేలింది. వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి.. విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు వసూలు చేసిన పోలీసుల లిస్ట్ను ఏసీబీ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో వీరిని విచారించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలవగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించింది. తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్ల ఓటీటీ రిలీజ్పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. హాట్స్టార్లో ఏప్రిల్ 5వ తేదీ నుంచి మూడు భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాగా, జియో సినిమాలో హిందీ, జీ5లో తెలుగు వెర్షన్ను చూడొచ్చు.

TG: రాష్ట్రంలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ రేవంత్ ప్రభుత్వం చేసిన వినతికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం రైతులకు అనుకూలంగా లేదని BRS ప్రభుత్వం వ్యతిరేకించగా, కాంగ్రెస్ సర్కారు అమలు చేయడానికి సిద్ధమైంది. ఆహార ధాన్యాల పంటలకు 2%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తే.. ఏదైనా నష్టం వచ్చినప్పుడు పరిహారం అందనుంది.

AP: నరసాపురం MP రఘురామ కృష్ణరాజు BJP నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా నరసాపురం టికెట్ను శ్రీనివాస వర్మకు BJP కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని TDP నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం MP సీటు ఆలోచించగా అక్కడి నాయకులు అంగీకరించలేదట. దీంతో ప.గో జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ సీట్లో ఎవరినైనా పోటీకి ఆపి రఘురామను బరిలో నిలిపే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం.

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78371 మంది భక్తులు దర్శించుకోగా 25156 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు లభించింది.
Sorry, no posts matched your criteria.