India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

RTC బస్సులో చిలుకలకు టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే బస్సుల్లో కోళ్లు, మేకలు వంటి జంతువులకు అనుమతి లేదని RTC MD సజ్జనార్ తెలిపారు. రైళ్లలో మాత్రం పెంపుడు జంతువులను తీసుకెళ్లవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ AC టికెట్ బుక్ చేసుకోవాలి. ట్రైన్ ఎక్కే స్టేషన్ CROకు దరఖాస్తు ఇవ్వాలి. పెట్స్కు టీకాలు వేయించిన సర్టిఫికెట్, వాటి హెల్త్పై డాక్టర్ సర్టిఫికెట్ అవసరం.

ముంబై ఇండియన్స్ జట్టులో అనిశ్చితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జట్టు 2 వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ ఓ వైపు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ మరోవైపు ఉన్నట్లు టాక్. కానీ హార్దిక్ వర్గానికి ఫ్రాంచైజీ యాజమాన్యం మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఓటములతో డీలా పడ్డ ముంబై జట్టులో ఇలాంటి వాతావరణం కనిపించడం ఫ్యాన్స్ను కలవరపరుస్తోంది.

ఢిల్లీతో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 185/5 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన RR 36 రన్స్కే 3 వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ ఆ జట్టును ఆదుకున్నారు. 45 బంతుల్లో 84 రన్స్తో నాటౌట్గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. 20వ ఓవర్లో పరాగ్ ఏకంగా 25(4,4,6,4,6,1) రన్స్ రాబట్టారు. అశ్విన్ 29, జురెల్ 20 రన్స్ చేశారు.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో కలిసి హవాలా వ్యాపారులను బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రేపు ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ప్రణీత్ అరెస్ట్ కాగానే రాధాకిషన్ అమెరికా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేయడంతో ఆయన్ను హైదరాబాద్ తిరిగి పంపారు.

బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడిని NIA అరెస్ట్ చేసింది. ముజమిల్ షరీఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి నగదు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. మరో ఇద్దరు నిందితులు సాజిబ్, అబ్దుల్ కోసం NIA తీవ్రంగా గాలిస్తోంది. కాగా మార్చి 1న రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు గాయపడ్డారు.

AP: సీఎం జగన్ రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘రాయలసీమ కోసం వైసీపీ చేసిందేమీ లేదు. 142 ప్రాజెక్టులను రద్దు చేశారు. టీడీపీ హయాంలో రాయలసీమలో సాగు నీటి కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ జగన్ మాత్రం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని కాపాడడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి’ అని ఆయన పేర్కొన్నారు.

బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస పటా సెకా 200 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఏడడుగులు, కండలు తిరిగిన దేహంతో ఆజానుబాహుడిగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో బానిసల యజమానులు అతడిని బానిసగా మార్చి నల్లజాతి యువతులు, మహిళలతో సంపర్కం చేయించేవారు. అలా పలువురు యువతులు, మహిళలకు 200 మందికిపైగా పిల్లలు పుట్టారు. అతడి వల్ల జన్మించే బిడ్డలను 11 ఏళ్లకే కష్టమైన పనులకు ఉపయోగించుకునేవారు. సెకా 130 ఏళ్లు బతికినట్లు సమాచారం.

IPL-2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచులో LSGపై 11 రన్స్కే ఔటైన అతడు.. ఇవాళ ఢిల్లీ మ్యాచులోనూ 11 పరుగులకే వెనుదిరిగాడు. గత సీజన్ చివరి 3 మ్యాచుల్లోనూ బట్లర్ డకౌట్ కావడం గమనార్హం. IPLలో గత 5 మ్యాచుల్లో అతడు చేసిన స్కోర్ 22 మాత్రమే. మంచి హిట్టర్గా పేరున్న బట్లర్ ఫామ్ RR అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

తీహార్ జైలులో ఉన్న MLC కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ‘ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, దుస్తులు, బెడ్షీట్స్, బుక్స్ అనుమతించడం లేదు. పెన్ను, పేపర్లు.. కనీసం కళ్లజోడు కూడా ఇవ్వడంలేదు. జైలు అధికారులపై తగిన చర్యలు తీసుకోండి. నాకు అవసరమైన వస్తువులు సమకూర్చుకునేలా జైలు సూపరింటెండెంట్ను ఆదేశించండి’ అని కోరారు. కాగా ఆమె వినతిని ఎల్లుండి విచారిస్తామని కోర్టు తెలిపింది.

TG: బీజేపీతో కలుస్తున్నామని కేటీఆర్ అన్నందుకే తాను కాంగ్రెస్లో చేరానని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఈ మాట తనతో అనలేదని ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు. తామంతా BRS సెక్యులర్ పార్టీ అనుకున్నామని, అక్కడ నేతలకు ఆత్మగౌరవం ఉండదని దానం పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.