India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మారేడుపల్లిలో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 11.2℃గా నమోదైంది. అటు బహదూర్పుర, బండ్లగూడ, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్నగర్, హిమాయత్నగర్ 13.2, తిరుమలగిరి 13.6, గోల్కొండ, ముషీరాబాద్ 14.4, షేక్పేట్ 15.2, అమీర్పేట్, ఖైరతాబాద్ 15.6, సికింద్రాబాద్లో 16℃గా నమోదైంది.

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఓవర్లోడ్ వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 వాహనాలు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనచేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉప రవాణాశాఖాధికారి సదానందం ఆదేశాలపై చర్యలు కొనసాగిస్తున్నారు.

ఖమ్మం DCC అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. భట్టి, పొంగులేటి వర్గాల నేతలు పీఠంపై కన్నేశారు. పార్టీ నిబంధనల కారణంగా కొత్తగా చేరిన వారికి అవకాశం లేకపోవచ్చు. 56 దరఖాస్తుల్లో నూతి సత్యనారాయణ గౌడ్, వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మద్ది శ్రీనివాస రెడ్డి, మానుకొండ రాధాకిషోర్ తుది జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవి ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.

iBOMMA రవి అరెస్ట్పై నేడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ పోలీసులు బ్లాక్ చేశారు. ‘ఐబొమ్మ’ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్లు ప్రమోట్ చేసి రవి రూ.కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.

మేడ్చల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ట్రెయినింగ్ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో బ్యాచ్లో 30 మందిని ఎంపికచేసి 45 రోజులపాటు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. దీంతో యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించే అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. శామీర్పేట పాత GP భవనంలో NCP కేంద్రం ఏర్పాటు చేయగా, దీనికి రూ.60లక్షలు విడుదల చేశారు. మరిన్ని వివరాలకు కేంద్రాన్ని సంప్రదించండి.

నల్గొండ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి చల్లని గాలులు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఈ చలి ప్రభావం అధికంగా ఉంది. అనేక చోట్ల చలి నుంచి ఉపశమనం పొందడానికి గ్రామాలలో ఎక్కువ శాతం మంటలు వేసుకుంటున్నారు.

పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగి మిల్లుల యజమానులు కలెక్టర్కు తెలిపారు.

మునుగోడు(M) పలివెల జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు గేర నరసింహను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి హనుమాన్ మాల వేసుకుని పాఠశాలకు రాగా సదరు ఉపాధ్యాయుడు అసభ్యంగా మాట్లాడడంతో పాటు మాలతీసి పాఠశాలకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

ఇంజెక్షన్ వికటించి అస్వస్థతకు గురైన 17 మంది చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొంతమంది ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు పై అధికారులకు సమాచారం ఇచ్చి.. వారి సలహాల మేరకు వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆదివారం ఆరుగురు చిన్నారులు డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ తెలిపారు. 11 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.