India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేసుల రాజీతో కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. రాజగోపాల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించారు. మొత్తం 4,635 కేసులను పరిష్కరించారు. వీటిలో క్రిమినల్ కేసులు 596, ఈ పెట్టి కేసులు 2, 350, చెక్ బౌన్స్ 53, ఇతర కేసులు 1,636 ఉన్నాయి. పరిష్కారం చేసుకున్న కక్షిదారులకు పూల మొక్కలు, అవార్డులు బహూకరించారు.

కులాంతర వివాహానికి సహకరించాడని హత్య చేసిన ఘటన షాద్నగర్లో జరిగింది. బాధితుల ప్రకారం.. ఎల్లంపల్లివాసి చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన యువతిని 10రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ వివాహానికి అన్న రాజశేఖర్ సహకరించాడని భావించి యువతి బంధువులు 12న రాజశేఖర్ను మాట్లాడదామని పిలిచి కొట్టి హతమార్చారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.

భాగ్యనగరం అంటే చార్మినార్, గోల్కొండ మాత్రమే కాదు. చరిత్ర సుగంధం వెదజల్లే అనేక అపూర్వ కట్టడాలకు ఆవాసమిది. సంస్కృతి, కళ, నిర్మాణ కౌశలాల సమ్మేళనం. శతాబ్దాల నాటి వారసత్వ సంపద నగరంలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెనుక కథలను వెలికితీసే ప్రయత్నమే ఇది. రోజూ ఓ చారిత్రక కట్టడం, ప్రముఖుల విశేషాలతో ‘హైదరాబాద్ అందాలు’ రానుంది. వారాంతాల్లో ఈ అందాలపై ఓ లుక్ వేయండి.<<18301143>> ఫలక్నుమా<<>>ప్యాలెస్ గురించి తెలుసుకుందాం.

తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే రూ.27,100 మాయమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. ఓ వ్యక్తికి 12న వాట్సాప్కు వచ్చిన యోనో యాప్ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేశాడు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.27,108 నుంచి, 27,100 డెబిట్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వ్యక్తి 1930 కాల్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు.

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఖమ్మం అధ్యయన కేంద్రంలో నేటి నుంచి వివిధ కోర్సుల తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. నేటి నుంచి మార్చి 1 వరకు పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు జరుగుతాయని, యూజీ సెమిస్టర్ 1, 3, 5 తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, వీణవంక, జమ్మికుంట, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <

డిసెంబర్ 8- 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై ఫ్యూచర్ సిటీ, ముచ్చర్లలో భారీ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. 2035నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంమని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంపై దృష్టి పెట్టామని, 70 థీమాటిక్ స్టాల్స్ తెలంగాణ అభివృద్ధి ప్రతిరూపమన్నారు.

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో అందించే పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నిర్వాహకుల నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 వరకు https://wdsc.telangana.gov.in సమర్పించాలని సూచించారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.
Sorry, no posts matched your criteria.