India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.86 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 12,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,030 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 6 పరీక్షా కేంద్రాలను, ACGE 4, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 25 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో గిరిరాజ్ తెలిపారు. 3వ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు..

ఏంది భయ్యా.. ఇంకా ఆ AC రూముల్లో వెయిట్లెత్తుతున్నారా? అది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు సిటీ కుర్రాళ్ల ట్రెండే వేరు. జిం ఫీజులు కట్టడం మానేసి.. పబ్లిక్ పార్కుల్లో ఇనుప రాడ్లు పట్టుకొని విన్యాసాలు చేస్తున్నారు. దీని పేరే ‘కాలిస్థెనిక్స్’. మజిల్స్ పెంచడం కాదు.. బాడీని గాల్లో తేల్చడమే అసలైన కిక్కంటున్నారు. KBR పార్క్ నుంచి గచ్చిబౌలి దాకా ఎక్కడ చూసినా ఈ బాడీ వెయిట్ బాపతే. ఈ సమ్మర్కి ఇదే అసలైన వైబ్ మరి.

రేవంత్ని CM చేసింది తానేనని, రెడ్డి సామాజికవర్గంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు అతనే అని అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. తామిద్దరం అన్నదమ్ములం అని పేర్కొన్న మల్లారెడ్డి తన సినీ ఆశక్తులను కూడా పంచుకొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీశ్ శంకర్ అడిగినా ఒప్పుకోలేదు. సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది’ అని మల్లన్న మనసులో మాట చెప్పుకొచ్చారు.

మెదక్ జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా సన్నాహాలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకం, రవాణా ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలన్నారు.

మెదక్ జిల్లా పోలీస్ శాఖ ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వ్యక్తిగతంగా సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్హెచ్ఓలతో నేరుగా ఫోన్లో మాట్లాడి వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మొత్తం 11,236 మంది విద్యార్థులకు గాను 11,216 మంది హాజరు కాగా హాజరు శాతం 99.82%గా నమోదైనట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, నిఘా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో గృహ వినియోగ LPG గ్యాస్ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్యాస్ దుర్వినియోగం ప్రమాదాలకు దారి తీస్తుందని సూచించారు. అనుమానాస్పద వినియోగంపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టరేట్లో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను సీరియస్ గా తీసుకోవాలన్నారు.

ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆర్.డబ్ల్యూ,ఎస్, పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎం.పీ.ఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అవసరమైన చోట చిన్న చిన్న మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు.

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 233 అర్జీలను స్వీకరించారు. సమస్యలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.