India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గణేష్ నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనులపై కలెక్టర్ రాజర్షిషా బుధవారం అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల రవాణాను తక్షణమే పునరుద్ధరించాలని, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టాన్ని వెంటనే అంచనా వేసి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ADB జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో గడ్డితో తయారు చేసిన ప్రకృతి గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. హరియాలీ నుంచి గడ్డి తీసుకొచ్చి ఈ రూపాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి గణపతి పక్కన ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ సందర్శకులను ఆకర్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు కాలనీ అధ్యక్షుడు పవర్, ప్రధాన కార్యదర్శి బండారి సంతోష్ తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 8న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 8వ తేదీన నిర్వహించనున్న మేళాకు హాజరుకావాలని సూచించారు.

APK ఫైల్స్ పట్ల అప్రమత్తత తప్పనిసరి అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీఏ ఈ చలాన్ పేరుతో వాట్సాప్లో ఫేక్ అప్లికేషన్ చక్కర్లు కొడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లు ఇలాంటి వాటిని వెంటనే తీసివేయాలన్నారు. నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం ఉందన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930ను సంప్రదించాలని సూచించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను యంత్రాంగం ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,49,981 మంది ఓటర్లను గుర్తించారు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది ఉన్నారు. ఇతరులు 16 మంది ఉన్నారు. జిల్లాలోని 20 మండలాలు ఉండగా వాటి పరిధిలో 473 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మహిళా ఓటర్లే అధికంగా ఉండగా ఎన్నికలో కీలకంగా వ్యవహరించనున్నారు.

ADB అబ్కారీ సర్కిల్ పరిధిలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ పాటించాలని ఎక్సైజ్ విజేందర్ పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు తాంసి, భీంపూర్, జైనథ్, మావల, ఆదిలాబాద్, అదేవిధంగా ఈనెల 5వ తేదీ సాయంత్రం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 వరకు బేల, తలమడుగు, జైనథ్, మావల, ఆదిలాబాద్లోని వైన్స్, బార్ షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సూచించారు.

జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.

ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉద్యోగులు ఈనెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440765485, 9494956454 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నీతిక పంత్, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎఎస్పీ కాజల్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదానం కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.