Adilabad

News March 18, 2025

ADB: ఆరుగురు మహిళలు అరెస్ట్: CI

image

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. కాగా ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతోపాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.

News March 18, 2025

ADB: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై కలెక్టర్ సమీక్ష

image

సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయుటకు సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వేసవి వడగాల్పులు నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలంలో వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

News March 17, 2025

ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

image

సహజంగా ఏ రైతైనా పంట కాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలి కాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.

News March 17, 2025

ఆదిలాబాద్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి K.ప్రభాకర్ రావు, అదనపు డిస్ట్రిక్ట్ సెక్షన్స్ జడ్జి డాక్టర్ పి.శివరాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై చర్చించారు. రానున్న లోక్ అదాలత్ లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.

News March 17, 2025

ఆదిలాబాద్: నేడు, రేపు వడగాలులు

image

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.

News March 17, 2025

ADB: అగ్నివీర్ రిక్రూట్మెంట్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

image

‘అగ్నిపథ్’ స్కీం క్రింద అగ్నివీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ www.joinindianarmy.nic.in అధికారిక వెబ్ సైట్లో ప్రారంభమైందని ఆదిలాబాద్ డీఐఈఓ జాదవ్ గణేశ్ తెలిపారు. అగ్నివీర్‌లోని వివిధ కేటగిరీల కింద నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 17, 2025

ఆదిలాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతి వివరాల ప్రకారం.. ఇచ్చోడలోని శివాజీ చౌక్ వద్ద గల పాన్ షాప్ వద్ద సయ్యద్ రావుఫ్ (38) మృతి చెంది పడిఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి బావ మరిది ఆసిఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 17, 2025

ADB: అగ్ని వీర్ రిక్రూట్మెంట్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

image

‘అగ్నిపథ్’ స్కీం క్రింద అగ్ని వీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ www.joinindianarmy.nic.in అధికారిక వెబ్ సైట్లో ప్రారంభమైందని ఆదిలాబాద్ డీఐఈఓ జాదవ్ గణేశ్ తెలిపారు. అగ్నివీర్‌లోని వివిధ కేటగిరీల కింద నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 17, 2025

ఆదిలాబాద్: నేడు, రేపు వడగాలులు

image

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.

News March 16, 2025

ADB: పురుగుమందు తాగి ఒకరు.. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్

image

ADB, NRML జిల్లాల్లో ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంద్రవెల్లి మండలం బుర్సాన్‌పటర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్(57) మద్యం మత్తులో చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. బజార్హత్నూర్ మండలం రాంగనగర్‌కు చెందిన గంగారం(54) మద్యానికి బానిసయ్యారు. శనివారం తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కడెం మండలం మొర్రిగూడెంనకు చెందిన సత్తెన్న ఒంటరిజీవితం భరించలేక ఉరేసుకున్నాడు.

error: Content is protected !!