Adilabad

News August 9, 2024

మామడ: కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

image

మామడ మండలం మొండిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని దంజి నాయక్ తండాలో కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాలు.. రాథోడ్ సుజాతకు 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గురువారం రాత్రి భార్యాభర్తలకు గొడవ జరిగింది. భర్త దేశ్పాల్ భార్య సుజాతను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

News August 9, 2024

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✧ADB: నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
✧ఖానాపూర్: ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమిద్దాం.
✧జన్నారం: భక్తి శ్రద్దల మధ్య నాగపంచమి.
✧ADB: అన్నా. వదినపై దాడి.. కేసు నమోదు.
✧ADB: ఆర్టీసీ బస్సు అద్దెకి తీసుకున్న వారు10 శాతం రాయితీ.

News August 9, 2024

చెన్నూర్: ఏసీబీ వలకు చిక్కిన ఇరిగేషన్ అధికారి

image

మంచిర్యాల జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో పడింది. చెన్నూర్‌లో ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జాడి చేతన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మిషన్ కాకతీయ పనులకు సంబంధించి బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద రూ.5 వేలు రివార్డుగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏవోను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకొని కరీంనగర్ లోని ఏసీబీ కోర్టుకు తరలించారు.

News August 9, 2024

ASF: నిఖితను అభినందించిన జిల్లా ఎస్పీ

image

ఒకే సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కూతురు నిఖితను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. కృషి, పట్టుదల, అంకితభావం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యమని, ఒక సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News August 9, 2024

ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన మహిళ సుగుణ: సీతక్క

image

ఆదివాసి హక్కుల కోసం పోరాడిన మహిళ ఆత్రం సుగుణ అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్రం సుగుణను మంత్రి సీతక్క మెమొంటో ఇచ్చి సన్మానించారు. ఆదివాసుల హక్కుల కోసం అనేక సందర్భాలలో సుగుణ పోరాటాలు నిర్వహించాలన్నారు. అంతకుముందు సుగుణ ఆదివాసి దినోత్సవంలో పాల్గొని మన్యం వీరుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

News August 9, 2024

తాండూర్: సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

image

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌లో చోటుచేసుకుంది. బాధితులు మాట్లాడుతూ.. ఇంట్లో దాచుకున్న రూ.లక్ష నగదుతో సహా బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న MPDO శ్రీనివాస్, ఆర్ఐ అంజన్ కుమార్ ఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

News August 9, 2024

ADB: 645 పాఠశాలల్లో మౌలిక వసతుల పూర్తి

image

ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులు 645 పాఠశాలల్లో పూర్తయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.23.24 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు రూ.8 కోట్లు విడుదల చేసింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీరు, విద్యుదీకరణ, నూతన తరగతి గదుల నిర్మాణం, డైనింగ్ హాల్ నిర్మాణం వంటి పనులు చేశారు.

News August 9, 2024

ఆర్టీసీ బస్సు అద్దెకు తీసుకున్న వారికి 10 శాతం రాయితీ

image

శ్రావణమాసంలో పెళ్లి ముహూర్తాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన తెలిపారు. డిపాజిట్ లేకుండా ప్రయాణించే కాలానికి, దూరానికి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని పేర్కొన్నారు. నేటి నుంచి సెప్టెంబర్ మూడో తేదీ వరకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకునే బస్సులకు 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుందన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 9, 2024

ADB: అన్న, వదినపై దాడి.. కేసు నమోదు

image

అన్న, వదినపై దాడి చేసిన కేసు మావల పోలీసు స్టేషన్లో గురువారం నమోదైంది. ఏఎస్ఐ మహ్మద్ యూనుస్ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ న్యూహౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన రాథోడ్ చరణ్, అతడి అన్న రాథోడ్ కిషన్ ఇంటికి బుధవారం రాత్రి వెళ్లి ఇంట్లో ఉన్న రాథోడ్ కిషన్, అతడి భార్య చంద్రకళపై గొడ్డలితో దాడి చేసే యత్నం చేశాడు. వారు ఇంట్లో నుంచి పారిపోయారు. బాధితురాలు చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News August 9, 2024

ADB: జిల్లాలో నూతనంగా ఐదు గ్రామ పంచాయతీలు 

image

ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా అయిదు పంచాయతీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. తలమడుగు మండలంలో పూనాగూడ, బజారత్నూర్ మండలంలో యేసాపూర్, తాంసి మండలంలో అత్నంగూడ, ఇచ్చోడ మండలంలో ఎల్లమ్మ గూడ, ఉట్నూరు మండలంలో వడగల్పూర్–కే గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 468 పంచాయతీలుండగా తాజాగా వాటి సంఖ్య 473కు చేరుకుంది.