India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పంచాయతీ పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది సర్పంచి అభ్యర్థులు ప్రచార జోరు పెంచుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్లు ప్రత్యర్థివైపు వెళ్లకుండా వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ బాధ్యున్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కీలకమైన కుల సంఘాల ఓట్లు దక్కించుకునేందుకు ఆ సంఘంలో చురుకుగా ఉండే వారికి బాధ్యతలు ఇస్తూ ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆదిలాబాద్లోని వ్యాపారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యత్వం పేరిట డబ్బులు ఇచ్చే అవసరం లేదని, ఇప్పటికే అమాయకుల నుండి డబ్బులు తీసుకున్న ఒక వ్యక్తి పై ఎస్పీకి ఫిర్యాదు చేశామని అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా తెలిపారు. ఎవరైనా బాధితులు డబ్బులు ఇచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న కార్యాలయానికి వచ్చి వివరాలు ఇవ్వాలన్నారు.

రానున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం రాత్రి బోథ్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఆయన ప్రజలతో మాట్లాడారు. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటుపై ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

త్రైమాసిక తనిఖీలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఆయన గోదాం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, అర్బన్ తహశీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

త్రైమాసిక తనిఖీలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఆయన గోదాం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, అర్బన్ తహశీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సున్నితమైన వాతావరణం నెలకొంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై పోలీసు చర్యలు ఉంటాయన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మూడు విడతల ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు), జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి సూక్ష్మ పరిశీలకులకు ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ పరిధిలోని అన్ని వార్డులను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో, ఆదిలాబాద్లోని న్యూ అంబేద్కర్ భవన్లో సఖి కేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలపై హింస నిర్మూలనకు సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నందున, చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, ప్రకటనలు, అభివృద్ధి హామీలు వంటి చర్యలను తక్షణమే నిరోధించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఎన్నికైన సభ్యులకు ఈ విషయం తెలియజేయాలని సూచించారు.

గ్రామపంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్లో ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల, మతపరమైన సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.