India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాస్థాయి యోగాసనా పోటీల్లో పతంజలి యోగా కేంద్రం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్ విభాగంలో విష్ణుప్రియ, సంధ్య, సహస్ర, జూనియర్ విభాగంలో వైష్ణవి, W.వైష్ణవి మొదటిస్థానం సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి చేతన్, సంయుక్త కార్యదర్శి సంతోష్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు.

మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. ఇతడు myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదు కావడానికి తనకు 1,21,000/- రూపాయలకు చెల్లించాలని ఆశ చూపి ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడన్నారు.

మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. ఇతడు myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదు కావడానికి తనకు 1,21,000/- రూపాయలకు చెల్లించాలని ఆశ చూపి ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడన్నారు.

ప్రజలు ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గణపతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేసి బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతకు చేరువై వారి సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

మట్కా కేసులో నిందితుడిని పోలీసులు ఎనిమిదేళ్ల అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్కు చెందిన మొహ్మద్ లతీఫ్ మట్కా నిర్వహిస్తుండగా 2018లో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అతను పరారవ్వగా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేయటానికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయగా శుక్రవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.

సమాజంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనదని, తమ వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నతంగా ఎదగాలని మాదిగ జాగృతి సంఘం జిల్లాధ్యక్షుడు ఆడేల్లు అన్నారు. ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్లో మాదిగ జాగృతి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు పదోన్నతులు పొందిన పలువురు ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. విధినిర్వహణలో నిబంధనలు పాటిస్తూ సమాజం మేలు కోసం కృషి చేయాలని సూచించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, నియమావళిని వివరించి పలు సూచనలు చేశారు. సమావేశంలో JC శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ ఉన్నారు.

ఐటీఐ కళాశాలలో చేరేందుకు రేపటితో ప్రవేశాల గడువు ముగుస్తుందని ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ATCలో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు వెల్లడించారు. ITIలో ఇంకా 11 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. డ్రెస్ మేకింగ్ ట్రేడ్లో 4, స్టెనోగ్రఫీలో 3, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడ్లో 4 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఉపాధ్యాయులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ఖుష్బూ గుప్తా తెలిపారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలకు సంబంధించి ఆయా కేటగిరీల్లో మండలానికి ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను ఎంపిక చేసి సెప్టంబర్ ర్ 2లోపు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని ఎంఈవోలకు సూచించారు.

గుడిహత్నూర్ మండలంలో కిడ్నాప్ కలకలం రేపింది. మన్నూర్కు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శివ ప్రసాద్ను 26వ తేదీన రాత్రి కొంతమంది కిడ్నాప్ చేసి ఇచ్చోడ వైపు తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్లు సెల్ లొకేషన్ ఆధారంగా అతడిని రక్షించారు. విచారణలో వ్యక్తిగత వైరం కారణంగా ఈ కిడ్నాప్ చేసినట్లు సీఐ రాజు తెలిపారు. నిందితులు సురేశ్, రవి, వెంకటి, పరేశ్వర్, నామదేవ్, గజనంద్ను రిమాండ్కు తరలించామన్నారు.
Sorry, no posts matched your criteria.