India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సర్పంచ్ అభ్యర్థి భర్తపై కేసు నమోదు చేసిన ఘటన నార్నూర్లో చోటుచేసుకుంది. ఎఫ్ఎస్టీ టీమ్ ఇన్ఛార్జ్ సొరాజి వివరాల ప్రకారం.. ఈనెల 10న మండల కేంద్రంలోని ముస్లిం వాడలో ఓ వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్త ఆడే సురేశ్ వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాల్లో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలో నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలను నిర్వహించిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని హెచ్చరించారు. సంబరాల పేరుతో టపాసులు కాల్చవద్దన్నారు. 936 మంది సిబ్బందితో పోలీస్ యంత్రాంగం ప్రతిష్ఠమైన బందోబస్తు చర్యలను చేపట్టిందని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ (163 బీఎన్ఎస్ఎస్) అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 100, 200 మీటర్ల వద్ద ప్రత్యేక నిబంధనలు పాటించాలని, ప్రజలు గుమిగూడరాదని సూచించారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్ పద్ధతిని తప్పక పాటించాలని ఆయన కోరారు.

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.67 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలె 9.7%, సిరికొండ 20.87%, ఇంద్రవెల్లి 6.17%, ఉట్నూర్ 10.56%, నార్నూర్ 11.99%, గాదిగూడలో 14.29% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.

జిల్లాలో తొలివిడతలో 6 మం. పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంద్రవెల్లి(29), నార్నూర్(24), ఉట్నూర్(38), సిరికొండ(18) గాదిగూడ(25), ఇచ్చోడ(33) మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 167 గ్రామాలు ఉన్నాయి. ఎలాంటి ఘటనలను జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మ. 2గంటల నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి.
> GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి

ఇప్పటివరకు 38 గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు అందరు సహకరించాలని కోరారు.

ఇప్పటివరకు 38 గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు అందరు సహకరించాలని కోరారు.

ఇప్పటివరకు 38 గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు అందరు సహకరించాలని కోరారు.

EPICలో చిన్న తప్పులు ఉన్నప్పటికీ అది చెల్లుబాటు అవుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.
★ ఇతర నియోజకవర్గంలో జారీ చేసిన EPIC కూడా చెల్లుతుంది. అయితే, ఓటరి పేరు తన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ జాబితాలో తప్పనిసరిగా ఉండాలి.
★ పోలింగ్ సమయంలో ఉపయోగించిన పత్రం చివరి నాలుగు అంకెలను బ్యాలెట్ కౌంటర్ ఫాయిల్/ఓటర్ రిజిస్టర్లో నమోదు చేయాలి.
★ EPIC చూపిన వారి విషయంలో కేవలం ‘EP’ అని మాత్రమే నమోదు చేయాలి.
Sorry, no posts matched your criteria.