Adilabad

News August 8, 2024

జన్నారం: అడవిపంది దాడిలో మహిళకు గాయాలు

image

జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన ముంజం లక్ష్మికి అడవి పంది దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం గ్రామ సమీపాన తన పంట చేనులో పనిచేస్తుండగా అడవి పంది దాడి చేసింది. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి కాలికి చికిత్సను చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అటవీ అధికారులకు తమకు సహాయం అందించాలని కోరారు.

News August 8, 2024

MNCL: ఏడు నెలల్లో ఆరుగురు కార్మికులు మృతి

image

వరుస ప్రమాదాలు సింగరేణి కార్మికులను కలవరపెడుతున్నాయి. గనుల్లో పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకుంటున్నామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఉద్యోగులు చనిపోవటం, తీవ్రగాయాలపాలవడం ఆందోళన కలిగిస్తోంది. సింగరేణి వ్యాప్తంగా ఈ ఏడాది జులై 31 వరకు 39 ప్రమాదాలు నమోదుకాగా 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆరుగురు మృతి చెందారు.

News August 8, 2024

ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉండకూడదు: డిప్యూటీ సీఎం భట్టి

image

ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 400 కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పర్యటనలో మాట్లాడుతూ.. గుండెల నిండా ప్రేమను పంచేటువంటి ప్రజలున్న ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉండటానికి వీలులేదని అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాను మా గుండెల్లో పెట్టి చూసుకుంటామని తెలిపారు.

News August 7, 2024

పిప్పిరి గ్రామానికి వరాలు కురిపించిన డిప్యూటీ సీఎం

image

పాదయాత్ర ప్రారంభానికి తొలి అడుగు నేలైన బజారత్నుర్ పిప్పిరి గ్రామాన్ని దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పర్యటనలో వరాల జల్లులు కురిపించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 45 కోట్లు, పిప్పిరిలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించారు. బుగ్గారం, తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

News August 7, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి CRIME REPORT

image

★ దహేగం: 14క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
★మంచిర్యాల: ఆటో దొంగల అరెస్ట్
★ ఆదిలాబాద్: అనారోగ్యంతో జూనియర్ అసిస్టెంట్ మృతి
★ కాగజ్ నగర్: ప్రమాదవశాత్తు కూలిన ఇంటిషెడ్డు
★ కెరమెరి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత
★ తిర్యాని: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
★ బెల్లంపల్లి: విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరికి గాయాలు
★ కుబీర్: బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
★ నెన్నెల: మామిడి చెట్ల నరికివేతపై ఫిర్యాదు

News August 7, 2024

ఆదిలాబాద్ : ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ADB మండలంలోని మూడు భవిత కేంద్రాల్లో ఆయా పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ MEO సోమయ్య పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. నెలకు గౌరవ వేతనం రూ.3,250 ఉంటుందని, ఆదిలాబాద్ డైట్ కళాశాల, మావల, అంకోలిలోని కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ఆసక్తిగలవారు కార్యాలయంలో 9లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 7, 2024

ఆదిలాబాద్: ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం: డిప్యూటీ సీఎం

image

ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అందమైన జిల్లా అని, జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. గతంలో పిప్పిరి గ్రామం నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను ఎన్నో చూశానన్నారు.

News August 7, 2024

తీర్యాని: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

తీర్యాని మండలంలోని గుండాల జలపాతంలో గల్లంతైన యువకుడు రిషి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సోమవారం గుండాల జలపాతంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన రిషి ఆదిత్య గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహం లభ్యం కాకపోవడంతో, బుధవారం గాలింపు చర్యలు కొనసాగించారు. ఎట్టకేలకు బుధవారం మృతదేహాన్ని కనుగొన్నారు.

News August 7, 2024

బజార్‌హత్నూర్: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

image

బజార్‌హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఎ పీఓ ఖుష్బూ గుప్తా అధికారులు నేతలు పాల్గొన్నారు.

News August 7, 2024

నిర్మల్: ప్రజలతో మమేకమై పోలీసుల పని చేయాలి: డీఎస్పీ

image

ప్రజలతో మమేకమై పోలీసులు పనిచేయాలని నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఖానాపూర్‌లోని సీఐ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ మండలాల ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేసిన అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావు, ఎస్ఐలు ఉన్నారు.