India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పరస్పరంగా దాడులు చేసుకున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై గౌతమ్ తెలిపారు. KRK కాలనీకి చెందిన సాజిద్ మరో మహిళ వద్ద ఉంటున్నాడన్న కోపంతో భార్య సల్మా అక్కడకు వెళ్లి గొడవ చేసింది. దీంతో సాజిద్ తన భార్యను నచ్చజెప్పి ఇంటికి తీసుకురాగా సల్మా బంధువులు సాజిద్పై దాడి చేశారు. దీంతో సాజిద్ రెండో భార్యగా అనుమానిస్తున్న ఆఫ్రిన్ బంధువులు వారిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన వారిపై కేసు చేశారు.
ట్రాఫిక్ సిబ్బందితో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో ఎత్తకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విధులు నిర్వర్తించే క్రమంలో బాడీ ఆన్ కెమెరాలను ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత ఎండాకాలం దృష్ట్యా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇంద్రవెల్లి మండలం ధనోరా(B) గ్రామం పిప్పిరి ఎక్స్ రోడ్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్లు ఢీకొని ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా అంబులెన్స్లో అదిలాబాద్ రిమ్స్కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు.
నూతన DEO ఏ.శ్రీనివాస్రెడ్డిని పండోక్న మహాభారత్ కథా రచయిత తొడసం కైలాస్ కలిసి తాను రచించిన పుస్తకాన్ని బహూకరించారు. DEO మాట్లాడుతూ.. కైలాస్ గోండి భాషలో రచించడం అభినందనీయమని అన్నారు. మారుమూల గిరిజన పల్లెల్లో డ్రాపౌట్ పిల్లలను గత పదేళ్లుగా వారి చదువు కొనసాగేటట్లు ఓపెన్ స్కూల్లో జాయిన్ చేసినందుకు కైలాస్ను అభినందించారు. MEO సోమయ్య, AMO శ్రీకాంత్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో చోటుచేసుకుంది. ఏరియాలో ఎస్ఆర్పీ 3 గని మేనేజర్ వద్ద కాంట్రాక్టు వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్న కోటేశ్ విధి నిర్వహణలో వాహనం నడుపుతుండగా గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఇంద్రవెల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాల్పూర్ వాసులు సాహెబ్ రావ్, ఎల్లవ్వ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. 4నెలల క్రితం సాహెబ్ రావ్ చిన్నమ్మ కోడుకు దశరథ్ వారి ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. సాహెబ్ పనినిమిత్తం వేరే ఊరికి వెళ్లడంతో ఎల్లవ్వ, దశరథ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త మందలించడంతో అతడిని చంపేందుకు యత్నించారు.
ఆదిలాబాద్ జిల్లాకు ట్రైనీ కలెక్టర్గా 2024 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి సలోని చాబ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లు సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శాంతినగర్లో CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారని ADB ఒకటో పట్టణ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.2,620 నగదు, ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు ట్రైనీ కలెక్టర్గా 2024 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సలోని చాబ్రాను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.శాంతికుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం ఈ జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లుగా సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.