Adilabad

News July 29, 2024

ఆదిలాబాద్: సర్పంచ్ ఎన్నికలకు సమరం..!

image

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరి 31తో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జీపీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేపట్టింది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా వాటి పరిధిలో 3,830 వార్డులున్నాయి. వీటికి 2018లో ఎన్నికలు జరిగాయి.

News July 29, 2024

నేరడిగొండలో బోడకాకర కిలో రూ. 400

image

వర్షాకాలం సీజన్‌లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు కొండెక్కాయి. వానా కాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని డాక్టర్‌లు చెబుతుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. నేరడిగొండ మండల కేంద్రంలో కిలో రూ.400 పలుకుతోంది. కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో రేటు ఎక్కువైనా జనం వీటిని కొంటున్నారు.

News July 29, 2024

కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

image

కడెం ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి సుమారు 8,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం 695 అడుగులకు నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 699 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాలువలకు 379, మిషన్ భగీరథ 9, దిగువకు 8178 మొత్తం కలిపి 8634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.

News July 29, 2024

ఢిల్లీలో మంచిర్యాల జిల్లా యువతి మృతి

image

ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా మంచిర్యాల జిల్లాకు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఆమె తండ్రి శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

News July 28, 2024

మంచిర్యాల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

image

చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మంచిర్యాల జిల్లా భీమారంలో చోటుచేసుకుంది. మండలంలోని దాంపూర్ గ్రామ పంచాయతీ గోత్రాల వాడకు చెందినమధుకర్ (55) మండలంలోని కాజీపల్లి చెరువు వద్దకు చేపల వేటకోసం వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా చెరువులో శవమై కనిపించాడు. కాగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 28, 2024

కేటీఆర్ పర్యటనపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ విమర్శలు

image

కేటీఆర్ ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించడంపై చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేసేందుకు వచ్చినట్లు ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.

News July 28, 2024

MNCL: అనుమానాస్పదస్థితిలో మహిళ దుర్మరణం

image

మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పదస్థితిలో ఒక మహిళ దుర్మరణం పాలైనట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మృతురాలు గోదావరి నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ముఖం గుర్తుపట్టకుండా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మ అనే మహిళ ఈనెల 25 నుంచి కనిపించకుండా పోయింది. మృతురాలు పద్మ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

News July 28, 2024

మంచిర్యాలలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

image

శుక్రవారం మంచిర్యాల ఏసీసీ వద్ద రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్దెరాగడికి చెందిన రాజు(30) శుక్రవారం రాత్రి ఏసీసీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో నస్పూర్‌కు చెందిన వినయ్‌కుమార్(27) బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. వినయ్‌కుమార్ శనివారం HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.

News July 28, 2024

ADB: సివిల్స్ ప్రిలిమినరీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల కొరకు ఉచిత శిక్షణ కోచింగ్ ను టీజీఎస్సీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి సునీత కుమారి తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్ సైట్ http://tsstudycircle.co.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 27, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి ముఖ్య వార్తలు

image

◾బోథ్: ఉదృతంగా ప్రవహిస్తున్న పొచ్చర జలపాతం◾ ఇంద్రవెల్లి: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య◾ ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుకు ప్రభుత్వం సహకరించాలి: పాయల్◾ఆదిలాబాద్: పాలిటెక్నిక్ లో చేరేందుకు మరొక అవకాశం◾ తలసరి ఆదాయంలో వెనుకబడిన ఆసిఫాబాద్◾ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలి: జాజుల◾ ADB వైద్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ బదిలీలు◾ కడెం ప్రాజెక్ట్ ఒక గేట్ ఎత్తివేత