Adilabad

News November 12, 2025

ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

image

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.

News November 12, 2025

ఆదిలాబాద్: పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

image

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఉట్నూర్‌ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు తప్పనిసరి అన్నారు.

News November 12, 2025

ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

image

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.

News November 12, 2025

ఉట్నూర్: తండ్రిని చంపిన కొడుకుకి 7ఏళ్ల జైలు శిక్ష

image

ఉట్నూర్ మండలం రాజన్న గూడకు చెందిన గడ్డం భగవాన్ 2024 సెప్టెంబర్ 13న మద్యం మత్తులో తండ్రిని చంపాడు. డబ్బుల కోసం తలపై దాడిచేయడంతో చికిత్స పొందుతూ అతడి తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఉట్నూర్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అతడికి 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.

News November 12, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదని అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.

News November 12, 2025

ఆదిలాబాద్ పోస్టుల వివరాలు ఇవే.!

image

ADB జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయలు, బాలికల హాస్టల్ అనుబంధ మోడల్ స్కూల్‌లల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే KGBV ఆదిలాబాద్ రూరల్, అర్బన్, బేలా, మావల, తోషం మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే బాలికల హాస్టల్ బంగారిగూడలో నాలుగు పోస్టులు హెడ్ కుక్(1), అసిస్టెంట్ కుక్(2) వాచ్ ఉమెన్(1) నాలుగు పోస్టులు ఉన్నాయన్నారు.

News November 12, 2025

ఆదిలాబాద్‌లో JOBS.. అప్లై NOW

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), అనుబంధ మోడల్ స్కూళ్లలో బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామకాలకు స్థానిక మండలానికి చెందిన 18-45 ఏళ్ల వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా అర్హులు మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 12, 2025

ADB: పాఠశాల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్బన్, రూరల్, మావల, ఇచ్చోడ మండలాల్లోని పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు సహా తరగతి గదుల మరమ్మత్తులపై చర్చించి, పనుల్లో జాప్యం చేయవద్దని సూచించారు.

News November 11, 2025

సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.

News November 10, 2025

ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

image

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.