India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ బదిలీల్లో భాగంగా వైద్య శాఖలో సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ బి.రవీందర్ నాయక్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఆదిలాబాద్ రిమ్స్, DMHO కార్యాలయం నుంచి PHCలకు, PHCల నుంచి DMHO కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో జిల్లా వ్యాప్తంగా 15 మంది సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.
పాలిటెక్నిక్ డిప్లమాలో ప్రవేశానికి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుపుతున్నామని ఆదిలాబాద్ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్/ పాలిసెట్ కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు. ఈ నెల 26న స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. 27న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 31న సీట్లు కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు గమనించాలన్నారు.
తలసరి ఆదాయంలో ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక ముఖచిత్రం 2024లో తలసరి ఆదాయం విషయంలో 32వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు మెరుగైన స్థానంలో ఉండగా, కొమురం భీం వెనుకబడి కనిపిస్తోంది. రాష్ట్రంలో తలసరి ఆదాయం విషయంలో మంచిర్యాల 18, నిర్మల్ 21, ఆదిలాబాద్ 22 స్థానాల్లో నిలిచాయి.
అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
◆ ఆదిలాబాద్ : కట్నం విషయంలో భర్తకు జైలుశిక్ష
◆ ఆసిఫాబాద్ : ఆన్లైన్ మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్టు
◆ రెబ్బెన : గేదెలు తరలిస్తున్న నలుగురిపై కేసు
◆ బెల్లంపల్లి : గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
◆ కుబీర్ : RTC బస్సు కిందపడి మహిళ మృతి
◆ కాగజ్ నగర్ : ఇంటిగోడ కూలి.. మహిళ మృతి
◆ ఆదిలాబాద్ : ఫ్యాన్ కు ఉరేసుకొని యువకుడు సూసైడ్
◆ ముథోల్: గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్ట్
అదనపు కట్నం విషయంలో భార్యను వేధించిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానాను విధిస్తూ ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2017 మార్చి నెలలో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తలమడుగు PSలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 7గురు సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన నిందితుడు లచ్చన్నకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. స్పెషల్ విడత ద్వారా జులై 25 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జులై 27 నుంచి ఆగస్టు 3వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.
>>SHARE IT
ఎకో టూరిజంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్పాట్లను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఫారెస్ట్తో పాటు కుంటాల జలపాతానికి చోటుదక్కింది. కుంటాల జలపాతం వద్ద ట్రైబల్ ఎకో టూరిజం కింద రిసార్ట్ నిర్మాణం, టూరిస్టుల విడిది కోసం వసతి, ఎకో ఫ్రెండ్లీ కార్టెజ్లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ITDA PO ద్వారా రూ.3.81లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నారు.
బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడికి నిర్మల్ కోర్టు 5ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు CI ప్రవీణ్ కుమార్ తెలిపారు. 7మార్చి2020న ఓ తల్లి 11ఏళ్ల కూతురిని తీసుకొని హోటల్కి వెళ్లింది. తన కూతురిని ఇంట్లో దింపమని బెస్తవార్ పేటకు చెందిన మహమ్మద్ రఫి అనే ఆటో డ్రైవర్తో పంపించింది. డ్రైవర్ తనను ఇంట్లో దింపి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై అప్పటి SI కేసు నమోదు చేయగా కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ముగ్గురు మహిళలతో వ్యభిచారం చేస్తున్న విటులను పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వారిలో లాడ్జి నిర్వాహకుడు శ్రీనివాస్తో పాటు అఖిల్, అరుణ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన మహిళలను పోలీసులు స్థానిక సఖీ కేంద్రానికి తరలించినట్లు సీఐ వివరించారు.
Sorry, no posts matched your criteria.