India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయదశమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆయుధ భాండాగార మందిరంలో ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. వేద పండితుల శాస్త్రోక్తాల మధ్య దుర్గామాత సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులంతా మహారాష్ట్ర బార్డర్లపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎందుకంటే అక్కడి నుంచే అక్రమ మద్యం ADBలోకి తీసుకొచ్చే ఆస్కారముంది. అక్కడ అక్కడ తక్కువ ధరకు దొరికే దేశీదారును అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంచే అవకాశముంది. తలమడుగు, తాంసి, బేల, భీంపూర్, భైంసా, కుబీర్, జైనథ్, చింతలమానేపల్లి ఇలా సరిహద్దుల్లోని మండలాల్లో చెక్పోస్టు తనిఖీలు పెంచాలి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్తో కలిసి కలెక్టర్, ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ యజమానులతో మాట్లాడారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుదిజాబిత, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఇతర ఎన్నికలకు సంబంధించి సమాచారం, సందేహాలకు
కంట్రోల్ రూమ్ టూల్ ఫ్రీ నంబర్ సంప్రదించవచ్చన్నారు. 1800425193 నంబర్కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

దేవి నిమజ్జన మహోత్సవంలో మహిళల కోసం 30 మంది మహిళా పోలీసు సిబ్బందిచే పటిష్టమైన షీ టీం బృందంతో బందోబస్త్ ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని పొందవచ్చని సూచించారు. నవరాత్రి నిమజ్జన ఉత్సవాలలో డీజేలకు అనుమతులు లేదని తెలిపారు.

ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో అందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, ఈ దసరా అందరికీ విజయాలను చేకూర్చాలని ఆకాంక్షించారు.

నేడు జరగనున్న దుర్గా నవరాత్రి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వన్ టౌన్, టూ టౌన్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 80 దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. 200 మంది పోలీసు సిబ్బందితో కూడిన బృందాన్ని 9 సెక్టార్లుగా, 4 క్లస్టర్లుగా విభజించి, సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. జూలైలో జరిగిన మొదటి, రెండో, మూడో సంవత్సరం (ఓల్డ్ బ్యాచ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల కోసం విద్యార్థులు https://braou.ac.in/#gsc.tab=0 వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

ద్విచక్ర వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ రుక్మారెడ్డిని ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన ఓ యువకుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడనే ఆరోపణతో ఆదిలాబాద్లోని వినాయక చౌక్ వద్ద రుక్మారెడ్డి అతనిపై దాడి చేసిన ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళల రక్షణకై షీ టీంలు జిల్లాలో పనిచేస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం అందూనాయక్ తండాలో ఆయన పర్యటించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్వాలాముఖి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులతో కలసి దాండియా ఆడారు. అత్యవసర సమయంలో డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్ సింగ్, రాంసింగ్ మహారాజ్, ఎస్సై సాయన్న, ఉన్నారు.
Sorry, no posts matched your criteria.