Adilabad

News February 6, 2025

ఆదిలాబాద్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో సుమారు 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి. 

News February 6, 2025

మంచిర్యాల: షటిల్ ఆడుతూ గుండెపోటుతో అధ్యాపకుడి మృతి

image

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుడు బంధం బాపిరెడ్డి(50) గుండెపోటుతో ఈరోజు మరణించాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో నేటి ఉదయం షటిల్ ఆడుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మరణించినట్లుగా మృతుడి మిత్రులు తెలిపారు. అధ్యాపకుడి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

News February 6, 2025

ఆదిలాబాద్‌లో చికెన్ ధరలు

image

ఆదిలాబాద్‌లో చికెన్ ధరలు యథావిధిగా ఉన్నాయి. నెల రోజుల క్రితం కిలో రూ.220కి పైగానే అమ్మారు. నేటి ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.200 నుంచి రూ.210, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?

News February 6, 2025

ఆదిలాబాద్‌లో నూతన మండలం ప్రారంభం!

image

ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు పాలనాధికారి శ్యామలాదేవి కలిసి ప్రారంభించారు. నూతన మండలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరలో పూర్తిచేస్తామన్నారు. సంబంధిత కార్యాలయాల నిర్మాణాలకు నివేదికలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ పాలనాధికారి మాల్వియా, ఆర్డీఓ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

News February 6, 2025

ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త

image

అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేశాడు.. కేసు నమోదైంది.

News February 6, 2025

సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలి: ADB కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు, పూర్తైన ఇందిరమ్మ మోడల్ గృహాల గ్రౌండింగ్‌ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి తహశీల్దార్లు అనుమతులు ఇవ్వాలన్నారు.

News February 6, 2025

బోథ్: వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి రిమాండ్

image

బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన బండారి చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మూడు రోజుల క్రితం నిందితుడు తన శనగ పంట చుట్టూ కరెంటు వైర్ అమర్చడంతో అతడి దగ్గర పని చేస్తున్న పాలేరు మేస్రం కృష్ణ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.

News February 6, 2025

బోథ్: గుండెనొప్పితో ఉపాధ్యాయుడు మృతి

image

బోథ్‌లోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు దేవరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇచ్చోడ మండలం కోకస్ మున్నూరు గ్రామానికి చెందిన దేవరాజ్ బుధవారం ఎప్పటిలాగే పాఠశాల విధులకు హాజరయ్యాడు. సాయంత్రం గుండెలో నొప్పి వస్తుందని తోటి ఉపాధ్యాయులకు తెలపడంతో వారు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News February 6, 2025

ADB: అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ఈ నెల 10న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిగ్యన్ మల్వియా, DMHO నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు.

News February 6, 2025

ఆదిలాబాద్‌లో 100 రోజుల TB క్యాంపెనింగ్

image

జిల్లాలో వందరోజుల టీబీ క్యాంపెనింగ్‌లో వల్నరబుల్ పాపులేషన్స్‌కి వాహనాల ద్వారా ఎక్స్రే రేకు పంపాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎపిడెమిక్ సెల్, ఆర్బీఎస్కే వాహనాలను 100 రోజుల శిబిరానికి వినియోగించుకోవాలన్నారు. అర్బన్ స్లమ్స్, 50 రోజుల్లో శిబిరాలు జరగని గ్రామాల్లో శిబిరాన్ని నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. టీబీ లక్షణాలు కలిగిన వారిని గుర్తించాలన్నారు.

error: Content is protected !!