India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం మార్చి 31లోపు చెల్లించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడికి ప్రొసీడింగ్ కాపీని కలెక్టర్ అందజేశారు. 25% రాయితీతో ప్రభుత్వం ఇచ్చిన సదవాకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్స్, సీనియర్ రెసిడెంట్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, సీఎంఓ పోస్టులు ఉన్నాయన్నారు. ఈనెల 18న ఇంటర్వ్యూలు ఉంటాయని, వివరాలకు rimsadilabad.org వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ వాగ్మారే జగ్జీవన్ కుమారుడు వాగ్మారే రోహిత్ గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో సత్త చాటాడు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1, 2, 3 పరీక్షలకు ఆయన హాజరవ్వగా.. సోమవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 438 మార్కులు సాధించాడు. దీంతో ఆయనను మంగళవారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ రూ.50 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) నిర్మాణ స్థలంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయనను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో పాత మొబైల్ ఫోన్లకు ఆయా వస్తువులు అమ్ముతున్న <<15720691>>బిహార్ ముఠా<<>> వివరాలను మంగళవారం పోలీసులు వెల్లడించారు. A1గా తబరాక్, A2 మొహమ్మద్ మెరాజుల్, A3 మహబూబ్ ఆలం, A4 మొహమ్మద్ జమాల్, A5 ఉజీర్, A6గా అబ్దుల్లాగా గుర్తించారు. దీంతో సోమవారం సాయంత్రం బస్సు స్టాండ్ సరిహద్దుల్లో A3 నుంచి A6 వరకు మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు శిక్షకుడు రవీందర్కు రిపోర్ట్ చేయాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో దారుణం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామ శివారులోని వాగులో మంగళవారం ఉదయం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు.
జిల్లాలోని 447 పాఠశాలల్లో మొత్తం రూ.75.31 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. అవి పాత కరెంటు బిల్లులు కావడంతో చెల్లించలేదని, నిధులు మంజూరైనప్పటి నుంచి రెగ్యులర్ బిల్లు చెల్లిస్తున్నామని పలువురు HMలు వివరించారు. కాగా నెల రోజుల్లో బకాయిలు పూర్తి చేయకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.
మావలలో ఓ వ్యక్తి <<15710393>>మృతదేహం<<>> లభ్యమైన విషయం తెలిసిందే. అయితే మావల ఎస్ఐ గౌతమ్ వివరాల మేరకు.. మావలకు చెందిన షేక్ పర్వేజ్ (22) పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి బయలుదేరి.. రాత్రయినా తిరిగి వెళ్లలేదు. సోమవారం ఉదయం మావల ఎర్రకుంట చెరువులో శవమై కనిపించాడు. కాగా తల్లి ఫిర్యాదు మేరకు సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో LRS క్రమబద్ధీకరణ రుసుంపై మున్సిపల్, గ్రామపంచాయితీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. LRS అవుట్ క్రమబద్ధీకరణపై ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చ్31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25 శాతం రిబేట్ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.