India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మేడారం మహా జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో జాతరకు 369 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ నిజామాబాద్కు బదిలీ అయ్యారు. 2021లో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగున్నరేళ్ల పాటు పారదర్శక సేవలు అందించారు. జైలు ప్రాంగణంలో పెట్రోల్ బంక్, అడ్వాన్స్డ్ వెహికల్ వాష్, సోలార్ పార్కింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్తో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదని ఆయన పేర్కొన్నారు.

నేటి నుంచి కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులుా కానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయన్నారు.

కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులు గానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయని స్పష్టం చేశారు.

చానక-కోరట ప్రాజెక్టు భూసేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమీక్షించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీఓ స్రవంతి, నీటిపారుదల శాఖ ఈఈ విఠల్ రాథోడ్, రోడ్లు భవనాలు శాఖ ఈఈ నర్సయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్ తదితరులు ఉన్నారు.

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లోని టీటీడీసీ కేంద్రంలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ, ఇతర ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఆర్డీఓ రవీందర్, మున్సిపల్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

క్షయ వ్యాధి నిర్మూలనలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, తప్పుడు సమాచారాన్ని అరికట్టి ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీబీ చికిత్స విజయవంతం కావడానికి ముందస్తు నిర్ధారణ, టీబీ ప్రివెంటివ్ థెరపీ, పోషకాహార మద్దతు అవసరమని తెలిపారు. టీబీ వ్యాధి జయించిన పలువురిని శాలువాతో సత్కరించారు.

ఆదిలాబాద్ వడ్డెర కాలనీ వాటర్ ట్యాంకు వద్ద మున్సిపల్ అనుమతులు లేకుండా భూమి పూజలు చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన 14 మందిపై, మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు 2 టౌన్ PSలో కేసు నమోదు చేశామని సీఐ కె.నాగరాజు తెలిపారు. ప్రభుత్వ అధికారులను అడ్డుకుని వాగ్వాదానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కబ్జాదారులు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ కళాశాలలో లెటరల్ ఏంట్రీ ద్వారా నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రకటన విడుదలైనట్లు ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐలో 60% మార్కులతో రెండేళ్ల కోర్సు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలన్నారు. తమ సమీపంలోని ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, టైలరింగ్ కోర్స్లకు ఉచిత శిక్షణ కోసం మైనార్టీల నుంచి (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, బౌద్ధులు, పార్శీ) దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ADB DMWO కలీం తెలిపారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్కు ఇంటర్ , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు, టైలరింగ్ కోసం పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తులను ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.