Adilabad

News July 2, 2024

నిర్మల్: ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి

image

సారంగాపూర్ మండలం అడేల్లిపోచమ్మ ఆలయ సమీపంలో గల రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కౌట్ల(బి) గ్రామానికి చెందిన భీమన్న అనే వ్యక్తి మంగళవారం పోచమ్మ ఆలయం వద్ద గ్రామస్థులు పండుగ చేయగా అక్కడికి వెళ్ళాడు. మోదుగ ఆకులు తెంపడానికి రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు బండరాయిపై జారిపడ్డాడు.

News July 2, 2024

ADB: వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక్ గోదామును పరిశీలించి నిల్వలను గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించామన్నారు. సిబ్బంది నరేష్, రమేష్, క్రాంతి ఉన్నారు.

News July 2, 2024

ADB: రెండు క్లినిక్లకు షోకాజ్ నోటీసులు.. రూ.5వేల జరిమానా

image

దిలాబాద్ శివాజీ చౌక్ ప్రాంతంలో ఆర్ఎంపీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో స్థాయికి మించి ఫస్ట్ ఎయిడ్ కేంద్రంలో అందించే సేవల కంటే రోగులను ప్రభావితం చేసే అంశాలను అధికారులు గుర్తించారు. దీ రెండు క్లినిక్లకు షోకాజ్ నోటీసులు అందజేసి రూ.5 వేల జరిమానా విధించారు.

News July 2, 2024

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు రేపే చివరి తేదీ

image

సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్ష కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా జులై 3తో గడువు ముగియనున్నట్లు వెల్లడించారు.

News July 2, 2024

చిన్నారి అత్యాచారంపై పలు అనుమానాలు: DSP

image

ASF జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై <<13547833>>అత్యాచారం<<>> జరిగిన విషయం తెలిసిందే. DSP కరుణాకర్ ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంకట్రావ్‌పేటకు చెందిన ఓ యువతిని ఆత్యాచారినికి గురైన చిన్నారి తండ్రి ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి నిరాకరించడంతో 17-9-2023న ఆమెకు పురుగుమందు తాగిపించడంతో మృతి చెందింది. కాగా చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆ యువతి సోదరుడు కావడంతో ప్రతికార చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 2, 2024

కాగజ్‌నగర్: మూడేళ్ల పాపపై అత్యాచారం

image

సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్‌లో మూడు సంవత్సరాల పాపను ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా బుదే రాజేందర్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకుని పోయి అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. పాప తండ్రి ఫిర్యాదు మేరకు కాగజ్‌నగర్ డీఎస్పీ కేసు నమోదు చేసి నింధితుడిని రిమాండ్‌కు తరలించారు.

News July 2, 2024

రాజకీయాలకు అతీతంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేద్దాం: సీతక్క

image

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో అధికారులకు సహకరించే బాధ్యత ప్రజాప్రతినిధులదని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అంకిత భావంతో జిల్లాను అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని, అధికారులు ప్రజలతో మమేకమవలని సూచించారు.

News July 1, 2024

మంచిర్యాల: స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

image

2024-2025 సంవత్సరానికి స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాల ఎంపిక కొరకు ఈ నెల 3, 4 తేదీల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి కీర్తి రాజవీర్ తెలిపారు. ఓయూ క్యాంపస్, హన్మకొండ, ఖమ్మం, వనపర్తి, సరూర్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అకాడమీల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 1, 2024

దస్తురాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి

image

బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎంబడి లావణ్య, మల్లేశ్ దంపతుల చిన్న కుమారుడు రాజ్ కుమార్ (13) సోమవారం ఇంటి అవసరాల కోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీరు తీసుకువచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్ఐ శంకర్ తెలిపారు.

News July 1, 2024

ADB: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్ష కొరకు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా జులై 3 వరకు గడువు ఉండగా జులై 7 వరకు పొడిగించారు.