India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేరాలు జరగకుండా పటిష్టమైన గస్తీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మావల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది విధులను, ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ కర్ర స్వామి సహా ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి కామ్రేడ్లు సైతం బరిలో నిలవనున్నారు. 6 జడ్పీటీసీ స్థానాలు, 9 ఎంపీటీసీ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు పొటీ చేసేందుకు నిర్వహించారు. బోథ్, రూరల్, తాంసి, నార్నూర్, భీంపూర్, మావల, భోరజ్ ZPTC, బోథ్-1, బోథ్-2, అందూర్, బండల్ నాగపూర్, కప్పర్ల, తాంసి, భీంపూర్ వడుర్, భోరజ్, పెండల్వాడ, బాలాపూర్ MPTC స్థానాల్లో బరిలోకి దిగనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం మీడియాపై పూర్తిస్థాయి నిఘా పెట్టాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలు, ప్రచారాలపై దృష్టి సారించాలి. తప్పుడు వార్తలు, పెయిడ్ న్యూస్, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరిగితే గుర్తించి, కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం మీడియా మానిటరింగ్, సర్టిఫికేషన్ కమిటీలని ప్రారంభించారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం పాక్షికంగా కూలిపోవడంతో పలు కార్యాలయాలు తాత్కాలిక మార్పులు జరిగాయని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పెన్ గంగ భవన్కు, కలెక్టరేట్ విభాగాలు AO నుంచి H వరకు పెన్ గంగ భవన్కు, తహశీల్దార్ (అర్బన్) జెడ్పీ ఆఫీస్కు, డీఎస్ఓ ఆఫీస్ రోడ్లు భవనాల (R&B) శాఖ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

2025-26 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ పాస్ http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖాధికారి రాజలింగు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలు ఉండాలన్నారు.
..SHARE IT

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 9 నుంచి ఎస్ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 9న నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు స్వీకరించడం, 23న తొలివిడత పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొదటి విడతలో 80 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు.

నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆర్ఓ, ఏఆర్ఓల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జెడ్పీ సీఈఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని, దీనివల్ల తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త పడవచ్చన్నారు.

నోటిఫికేషన్ జారీచేసిన నాటి నుంచి ప్రతి రోజు త్వరగా రిపోర్టును పంపించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే అవి తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయన్నారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరగాలని పేర్కొన్నారు.

ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలలో, జడ్పీటీసీ సభ్యుల నామినేషన్ల స్వీకరణ మండల పరిషత్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తూ సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలని సూచించారు.

RTO చలాన్ పేరుతో ఓ APK ఫైల్ సోషల్ మీడియా వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పలువురికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చింది. చలాన్ పెండింగ్ ఉందని, కోర్టులో కట్టాలని FORM నింపాలంటూ డీటెయిల్స్తో కూడిన APK ఫైల్ వచ్చింది. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని, ఎవరూ కూడా ఈ APKను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచించారు. ఆ మెసేజ్ను వెంటనే డిలీట్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.