Adilabad

News April 12, 2025

నేరడిగొండ: 52 మందికి TB పాజిటివ్

image

నేరడిగొండ మండలంలో గత నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్దారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ సూచించారు. నేడు 25 మందికి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. టీబీ బాధ్యులుగా ఉన్నవారికి 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోశన్న న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్, సంతోష్ తదితరులున్నారు.

News April 12, 2025

జైనథ్: ఇసుక అక్రమ రవాణా.. 12మందిపై కేసు

image

జైనథ్ మండలం సాంగ్విలో పెనుగంగ నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక జేసీబీ సీజ్ చేసి చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 మందిపై సెక్షన్ 3, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పీఏ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.

News April 12, 2025

తెలంగాణలో టాప్‌ 3లో ఉమ్మడి ADB

image

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4350 మంది బుక్ చేసుకున్నట్లు తెలిపారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News April 12, 2025

ADB: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన సోనిపై కేసు: CI

image

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి స్టాఫ్‌నర్స్ డబ్బులు కాజేసిన ఘటన ADB లో జరిగింది. వన్ టౌన్ CI సునీల్ కథనం ప్రకారం.. రిమ్స్ స్టాఫ్‌నర్సు సోని ANM శిక్షణ పూర్తి చేసిన మహేశ్వరీకి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.40లక్షలు డిమాండ్ చేసింది. దీంతో ఆమె నమ్మి ఆమె చెప్పిన గజ్జె రాజేందర్ ఖాతాలో డబ్బులను వేసింది. రేపు మాపు అంటూ మాటలు దాటి వేయడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు చేశారు.

News April 12, 2025

ADB జిల్లా కోర్టులో PPలు వీరే

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది అబ్దుల్ రహీం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా మరో న్యాయవాది ప్రవీణ్ కుమార్ పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. వీరిద్దరి పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఈ సందర్భంగా వీరికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.

News April 12, 2025

ADB: PMIS పథకానికి దరఖాస్తులు

image

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కింద జిల్లాలోని నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెప్మా డీఎంసీ శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్/ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి 21 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. జిల్లాలోని ఆసక్తి గల యువత https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్‌లో ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 11, 2025

ADB: లింగ నిర్ధారణ పరీక్షలు నేరం: DMHO

image

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీ బృందం ADBలోని రెండు స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తనిఖీ బృందం సభ్యులు డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, డాక్టర్ క్రాంతి, యశోద, వైష్ణవి ఉన్నారు.

News April 11, 2025

ఆదిలాబాద్: సర్టిఫికెట్ పొందేందుకు రేపే ఆఖరు

image

ఐటీఐలో ఏదైన ట్రేడ్‌కు సంబంధించి మూడేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ పొందేందుకు ఈనెల 12లోపు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 11, 2025

ADB: దొంగతనం.. ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరార్

image

ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్‌కు చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

News April 11, 2025

ADB: దొంగతనం.. ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరార్

image

ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్ చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!