India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లాకు ట్రైనీ కలెక్టర్గా 2024 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి సలోని చాబ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లు సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శాంతినగర్లో CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారని ADB ఒకటో పట్టణ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.2,620 నగదు, ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు ట్రైనీ కలెక్టర్గా 2024 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సలోని చాబ్రాను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.శాంతికుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం ఈ జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లుగా సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 356 రేషన్ షాపులకుగాను 6 లక్షల 32 వేల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ పథకం ద్వారా 9 రోజుల్లో 70 శాతం సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 4,127 మెట్రిక్ టన్నుల బియ్యం, అదనంగా కొత్తగా 14,322 మంది చేరినట్లు చెప్పారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మనోహర్ కు వచ్చిన సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులు ఓ బైక్ పైన వారిని తనిఖీ చేయగా వారి వద్ద సుమారు కిలోకు పైగా గంజాయి లభించింది. అదిలాబాద్ రూరల్ మండలం అసోద గ్రామంలో గంజాయి ఇచ్చిన కుమ్ర రాహుల్, రాయికల్ మండలనికి చెందిన మెండే అనిల్, తురగ గౌతంలను అదుపులోకి తీసుకున్నారు.
పోషణ పక్షం ఈనెల 22 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోషణ పక్షం 2025పై అధికారులతో సమావేశం నిర్వహించారు. సరైన పోషణతో ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేలా అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేలా యోగా, వ్యాయామం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
జిల్లా ప్రజలకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలను అందించాలని ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా ప్రజలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఎలాంటి సమస్యలున్నా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. 8712659973కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
బోథ్కు చెందిన డా.రుక్మారెడ్డి TG మెడికల్ సర్వీసెస్&ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఔషధాలు, శస్త్ర చికిత్స పరికరాలు విభాగానికి జనరల్ మేనేజర్గా నియమితులయ్యారు. రాష్ట్రంలోని సబ్సెంటర్ల నుంచి మెడికల్ కాలేజీ దవాఖానాల వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ దవాఖానాల ఔషధ అవసరాలు పర్యవేక్షణ చేయనున్నారు. కాగా ఆయన ప్రస్తుతం HYD DMHO ఆఫీస్లో ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు.
ఇచ్చోడ మండలంలో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన జరిగింది. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం. ముఖరా(బి)కి చెందిన రఫీ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులతో మద్యం తాగి వచ్చి రోజు గొడవ పడేవాడు. దీంతో మనస్థాపానికి గురైన కూతురు షేక్ ఫిర్దోసి(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి జాబీనాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.