India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఏ ఒక్క రోగిని వదలకుండా వైద్య పరీక్షలు నిర్వహించి రోగుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ అన్నారు. మంగళవారం DMHO కార్యాలయ సమావేశ మందిరంలో ఏంఎల్.హెచ్.పీ, ఏఎన్ఎంలతో అసాంక్రమిత వ్యాధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్ష్యాలను సాధించని సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్, సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

రంజాన్ మాసంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ‘అరైవ్ అలైవ్’ అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్కు దూరంగా ఉండాలని, రాత్రి 11:30 గంటల తర్వాత బయట ఉండొద్దన్నారు.

జల్ సంచయ్ జన భాగీదారి కార్యక్రమం కింద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్వహించిన వాటర్ సిరీస్ వెబినార్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న జల సంరక్షణ ఉత్తమ విధానాలను ప్రస్తావించారు. వర్షపు నీటి సంగ్రహణ, సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ, జల్ జీవన్ మిషన్, పీఎంఖెఎస్వై వంటి పథకాల సమన్వయంతో భూగర్భ జల మట్టం పెంపుదలపై చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర నేటితో ముగిసింది. 9రోజులుగా కొనసాగిన నాగోబా జాతర ఉట్నూర్ మండలం శ్యాంపూర్ బుడుం దేవతకు పవిత్ర గంగాజలంతో ఆదివారం మహా పూజ నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం “ఝరి” తాలిని భద్రపరిచేందుకు మేస్రం వంశీయులు కాలినడకతో కేస్లాపూర్లోని శాంతి నిలయానికి చేరుకొని మెస్రం వంశీయులు కలశం (జారీ)దేవతకు ప్రత్యేక పూజలు చేసి నాగోబా జాతరకు ముగింపు పలికారు.

అక్రెడిటేషన్ జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై PRESS అని స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. PRESS లేని వారు, ఇతర వర్గాలు ఇష్టారీతిన వాహనాలపై PRESS అని రాయవద్దని సూచించారు. ఇది మోటార్ వాహన చట్టం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.

మేడారం మహా జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో జాతరకు 369 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ నిజామాబాద్కు బదిలీ అయ్యారు. 2021లో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగున్నరేళ్ల పాటు పారదర్శక సేవలు అందించారు. జైలు ప్రాంగణంలో పెట్రోల్ బంక్, అడ్వాన్స్డ్ వెహికల్ వాష్, సోలార్ పార్కింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్తో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదని ఆయన పేర్కొన్నారు.

నేటి నుంచి కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులుా కానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయన్నారు.

కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులు గానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.