India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేశ్ తెలిపారు. చాంద(టి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14, 16, 18, 20 విభాగాలలో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఆసక్తి గల క్రీడాకారులు 9492136510 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
అంబులెన్స్లో ఓ మహిళ ప్రసవించిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. ముక్రా(బి)కి చెందిన ప్రతిక్ష అనే మహిళకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ అంబులెన్స్కు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చారు. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రతిక్ష ప్రసవించి, కవల పిల్లలకు జన్మనిచ్చిందని అంబులెన్స్ పైలట్ వినోద్, ఈఎంటీ రాకేశ్ తెలిపారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని విద్యా సంస్థలకు (ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు) సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
యువత అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్కు చెందిన బద్దం మేఘనారెడ్డి పెన్సిల్ చార్కోల్ ఆర్ట్ ద్వారా ఎస్పీ చిత్రాన్ని అద్భుతంగా గీశారు. ఈ మేరకు సోమవారం ఎస్పీని స్థానిక డీపీఓ కార్యాలయంలో కలిసి చిత్రాన్ని ఆమె బహూకరించారు. చిత్రాన్ని చూసి విద్యార్థిని ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ADB శివాజీ చౌక్ సమీపంలో ఈనెల 8న యాచకురాలిపై అత్యాచారానికి, దోపిడీకి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా పది రోజుల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడు గుడిహత్నూర్ మండలం మల్కాపూర్కు చెందిన మాడవి నగేష్ను సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నామన్నారు. తాగిన మైకంలో, కామంతో నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, రంగారెడ్డి జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.
ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతకు 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యను తెలుసుకున్నారు. మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎడ్ల బండెక్కి పంట పొలాల్లో కలియ తిరుగుతూ రైతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టం చెందిన వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే సోమవారం పర్యటించారు. భోరజ్ మండలలోని కేదర్పూర్, ఆకోలి, గిమ్మ, కోరాట, పూసాయి, పిప్పర్వాడ తదితర గ్రామాల్లో తహసీల్దార్ రాజేశ్వరీ అగ్రికల్చర్ అధికారులతో కలిసి పర్యటించి నీట మునిగిన పంటను పరిశీలించారు
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండప కమిటీ, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో ఈనెల 18న ఆదిలాబాద్ తనీషా గార్డెన్లో ఉదయం 10:30 గంటలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహిస్తున్న డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిర్వహకులకు మండపాల ఏర్పాటుపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, కమిటీ సభ్యులు చేయవలసిన విధి విధానాలపై ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వన్ టౌన్, టూటౌన్, మావల, రూరల్ మండపాల సభ్యులు కావాలన్నారు.
ADB డివిజన్ TTD కల్యాణ మండపంలో ఈనెల 19న, ఉట్నూర్ డివిజన్ వికాసం పాఠశాలలో 20న దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఉపకరణాలు అందజేయుడానికి గుర్తింపు, నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు DEO కుష్బూగుప్తా తెలిపారు. అవసరమైన దివ్యాంగులను గుర్తించి వారికి ఉచితంగా ఉపకరణాలను అందజేయడానికి సిఫారసు చేస్తారన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో అర్హులైన దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు హాజరు కావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.