Adilabad

News August 17, 2025

ADB: రేపటి ప్రజావాణి రద్దు

image

ఈ నెల 18, 19 తేదీల్లో వాతావరణ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 18న సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

News August 17, 2025

ADB: వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారా..?

image

వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రతిఒక్కరూ https://policeportal.tspolice.gov.in/index.html వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసుకోవాలని ADB ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండపాల వద్ద వాలంటీర్లు కమిటీ సభ్యులు 24 గంటలు ఉండేలా చూసుకోవాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు అధిక శబ్దం చేసే డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

News August 17, 2025

ADB: సహాయక చర్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

image

ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులకు వెంటనే సహాయం అందించేందుకు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ నంబర్: 18004251939, మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ 9492164153కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

News August 16, 2025

ADB: ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు

image

కృష్ణుడి ప్రేమ, ఆధ్యాత్మికతకు ప్రతీక రాధ. రాధాకృష్ణుల ప్రేమ బంధాలకు అతీతమైనది. వారి అనుబంధం దైవిక ప్రేమ, నిస్వార్థ భక్తికి నిలువెత్తు నిదర్శనం. భీంపూర్(M)లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం గుబిడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో చిన్నారులు వేసిన శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలు తిలకించేందుకు గ్రామస్థులు ఒకచోట చేరారు.

News August 16, 2025

ADB: రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలు ప్రారంభం

image

క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు విజేతనే అని తెలంగాణ రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు హరిశంకర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ బేస్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రం నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొనగా వారికి అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.

News August 16, 2025

NRG: ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

image

నేరడిగొండ మండలంలోని మథుర(కైతి లంబాడ) కులస్థులు శ్రీ కృష్ణాష్టమి శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలంతా కలిసి సంప్రదాయ పద్ధతిలో మట్టిని తెచ్చి దానితో శ్రీకృష్ణుని ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమను తమ ఇంట్లో ప్రతిష్టిస్తామని తెలిపారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించిన సమయం అనంతరం ఆ ప్రతిమకు ఓమా, బంక, బెల్లం, గోధుమ పిండితో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తామని మహిళలు పేర్కొన్నారు.

News August 16, 2025

తాంసి మండలంలో అత్యధిక వర్షపాతం

image

జిల్లావ్యాప్తంగా కురిసిన వర్ష పాతం నమోదు వివరాలను అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 8 నుంచి 11 గంటలకు వరకు తాంసి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తాంసిలో 142.0 మి.మీ, తలమడుగు 140.3, సిరికొండ 135.0, గుడిహత్నూర్ 133.3, రాంనగర్ 129.0, సాత్నాల 125.5, హీరాపూర్ 122.2, ఇచ్చోడ 114.3 మి.మీ వర్షపాతం రికార్డయింది.

News August 16, 2025

లారీ డ్రైవర్‌ను కాపాడిన తర్నం వాసులు

image

తర్నం వాగులో వరద ఉద్ధృతి కొంత మేర తగ్గింది. దీంతో వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ను తాడు సహాయంతో కాపాడారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఇదే వాగులో జైనథ్ మండలానికి చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వరద సమయంలో వాహనదారులు వాగు వైపు వెళ్లకుండా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News August 16, 2025

తాంసి: రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి

image

శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని తాంసి మండలం కప్పర్ల రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశాల్ శ్రీ రాముడిని కృష్ణుడి రూపంలో అలంకరించారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న రాముడి రూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

News August 15, 2025

రాష్ట్రపతి విందులో పాల్గొన్న ADB ఉపాధ్యాయుడు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని at home కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుతులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విందులో పాల్గొన్నారు. కైలాస్ రాష్ట్రపతి, ప్రధానీకి గోండి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్పించాలని విన్నవించారు.