Adilabad

News April 9, 2025

ADB: వ్యాపారంలో నష్టాలు.. వ్యక్తి SUICIDE

image

ADBలోని సంజయ్ నగర్‌కు చెందిన పశువుల వ్యాపారి సలీంఉల్లా సిద్దీఖీ అలియాస్ ఫేరోజ్(35) పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల క్రయవిక్రయాల్లో నష్టాలపాలైన సలీంఉల్లా సిద్దిఖీ సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్దనే గుర్తు తెలియని మందు తాగేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News April 9, 2025

ADB: విద్యార్థులకు GOOD NEWS.. అడ్మిషన్లు START

image

ADB జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. బీఏ(హెచ్ఈపీ), బీకాం (సీఏ), బీఎస్సీ, బీజడ్సీ, డాటా సైన్స్, స్టాటిస్టిక్స్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 9849390498 లేదా https://ttwrdcs.ac.in/Boat వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.

News April 9, 2025

ఇచ్చోడ: యాక్సిడెంట్.. నలుగురికి గాయాలు

image

ఎదురుఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని నలుగురికి గాయాలైన ఘటన మంగళవారం పెంబి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం సల్లెడ గ్రామానికి చెందిన మాడవి శ్రీకాంత్, పోషన్న ఖానాపూర్ నుంచి పెంబి వస్తున్నారు. ఈ క్రమంలో పరిమండల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఎదురుఎదురుగా వస్తున్న బైక్‌ను భీకొని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు.

News April 8, 2025

కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

ఆదిలాబాద్‌: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని KRK కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. భాగ్యలక్ష్మి, గంగన్న అనే ఇద్దరు.. అమాయక మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించామన్నారు. నిందితులైన భాగ్యలక్ష్మి, గంగన్నతో పాటు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 8, 2025

ఆదిలాబాద్‌లో 12ఏళ్ల బాలికపై అత్యాచారం

image

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News April 8, 2025

బోథ్: కత్తుల ప్రదర్శన చేసిన వారిపై కేసు నమోదు

image

బోథ్ మండల కేంద్రంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో బహిరంగంగా కత్తుల ప్రదర్శన చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ర్యాలీలో కార్తీక్, రాహుల్, ఆకాష్ అనే వ్యక్తులు బహిరంగంగా ర్యాలీలో కత్తుల ప్రదర్శన చేశారని ఎస్సై వివరించారు. నిబంధన విరుద్ధంగా ర్యాలీలో మరణ ఆయుధాలు ప్రదర్శించిన వారిపై సోమవారం కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు

News April 8, 2025

ADB: కత్తిని చూపిస్తూ బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

image

ఆదిలాబాద్ చించర్‌వాడకు చెందిన తోట విగ్నేష్ రామనవమి శోభాయాత్రలో కత్తిని చూపిస్తూ చంపేస్తానంటూ బెదిరించినందున కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. భారీ ర్యాలీలో నిందితుడు కత్తితో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. కత్తులను చూపిస్తూ బెదిరించి చంపేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 8, 2025

ADB: ఎమ్మెల్యేను కలిసిన జనార్దన్ రాథోడ్

image

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని సోమవారం ఆదిలాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలతో కలిసి చర్చించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే మహాసభను విజయవంతం చేయాలనీ ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్నూర్ PACS ఛైర్మన్ సురేష్ ఆడే, మాజీ సర్పంచి రామేశ్వర్ తదితరులున్నారు.

News April 7, 2025

ఆదిలాబాద్: ‘సమగ్ర సర్వే నిధులు విడుదల చేయాలి’

image

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎనిమిరేటర్ సూపర్వైజర్ కంప్యూటర్ ఆపరేటర్లకు తక్షణమే నిధులు వారి అకౌంట్లో జమా చేయాలని టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ జాధవ్ కోరారు. ఈ విషయమై సోమవారం సీపీఓ ను కలిసి నిధులు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. సర్వే చేసి నేటికీ ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!