India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్లో మరో దారుణం వెలుగుచూసింది. బేగంపేట పాటిగడ్డలో ఓ యువకుడిని కత్తులతో నరికి చంపేశారు. తన మరదలిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఇజాజ్ ముగ్గురు స్నేహితులు ఫిరోజ్, సాహిల్, రెహన్లతో కలిసి ఉస్మాన్ గొంతు కోశారు. ముఖంపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. మర్డర్ చేసిన నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి దేవాలయానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు గుడ్న్యూస్. JBS నుంచి స్వర్ణగిరి దేవాలయానికి నేటి నుంచి డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు కంటోన్మెంట్ డిపో మేనేజర్ ఎల్. రామ్మోహన్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రెండు బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాంగ్రూట్లో వెళితే ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ANPR(ఆటో మేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డదారిలో వెళ్లిన వారి వాహనాలను గుర్తించి చలానాలు విధిస్తారు. IPC 336 సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు. SHARE IT
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతం తదితర విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్ తదితరులు ఉన్నారు.
HYDలో దారుణం జరిగింది. కాచిగూడ పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపల్లికి చెందిన బాలిక(13)కు విజయ్(23)తో పరిచయం ఏర్పడింది. నిత్యం బైక్ మీద తిప్పుతూ ఇంటివద్ద వదిలేసేవాడు. ఈ క్రమంలోనే వినాయక్నగర్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి స్నేహితులు నలుగురు కూడా బెదిరించి రేప్ చేయగా గర్భం దాల్చింది. బాలిక తల్లి కాచిగూడ PSలో ఫిర్యాదు చేసింది. 0 FIR నమోదు చేసి కేసును నేరెడ్మెట్ PSకు బదిలీ చేశామని SI తెలిపారు.
అంబర్పేటలోని రఘునాథ్నగర్లోని ఓ వైన్ షాప్ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూం ఏర్పాటు చేయడంతో పాటు టేబుల్స్, కుర్చీలు వేసి జనతా బార్లుగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ వైన్ పర్మిట్ రూమ్ నుంచి శబ్దాలతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ధూమపానం, మందుబాబుల మూత్ర విసర్జనతో దుర్వాసన వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
HYD డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్లో ప్రక్షాళన మొదలైంది. GHMC కమిషనర్గా ఆమ్రపాలి, HMDA కమిషనర్గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్ రెడ్డిని నియమించింది. నగరంలోని 6 జోన్లకు కొత్తగా నలుగురు జోనల్ కమిషనర్లు వచ్చారు. కూకట్పల్లి ZCగా అపూర్వ్ చౌహన్, ఖైరతాబాద్ ZCగా అనురాగ్, ఎల్బీనగర్ ZCగా హేమంత్ పాటిల్, శేరిలింగంపల్లి ZCగా ఉపేందర్ రెడ్డిని నియమించారు.
HYD వాసులకు గుడ్న్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్(NSS) వాలంటీర్ల సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం వాలంటీర్ల మొదటి బ్యాచ్కు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ వాలంటీర్లు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సిగ్నళ్ల వద్ద ఉంటారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వీరు భాగమవుతారని అధికారులు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం వద్ద నిరుద్యోగులు సోమవారం ధర్నాకు దిగారు. డీఎస్సీ షెడ్యూల్ వెంటనే ప్రకటించి, 25వేల పోస్టులు కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ప్రిపరేషన్కి రెండు, మూడు నెలల సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగుల ప్రమోషన్స్ వల్ల ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు కాపాడారు. పర్వత్ నగర్లో నివాసం ఉండే సాయికిరణ్(23) క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న మాదాపూర్ పోలీసులు గమనించి సాయి కిరణ్ను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Sorry, no posts matched your criteria.