India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ను ఈనెల 23న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్లో అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు జరుగుతాయని, ఆసక్తి గల వారు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లకు వాట్సాప్లో తమ వివరాలు పంపించి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.
ఆక్రమణలతో గోల్కొండ కోట ప్రతిష్ఠ మసకబారుతోంది. చట్టం ప్రకారం పురాతన కట్టడం నుంచి సుమారు 300 మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ గోల్కొండలో మాత్రం ఆక్రమణదారులు ఇష్టానుసారం గోడలు కూల్చేసి భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు కోట చుట్టూ వ్యర్థాలు, జంతు కళేబరాలు పారేయడం, మూత్ర విసర్జన చేస్తుండడంతో ప్రపంచ వారసత్వ హోదా కలగానే మారింది.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మం. కుంట్లూరు రెవెన్యూ పరిధి భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, నాయకులు జంగయ్య, రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు CMని కలిసి వినతి పత్రం అందించారు. ఈ వ్యవహారంపై ఆయన సానుకూలంగా స్పందించారని కూనంనేని వెల్లడించారు.
> మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డైరెక్టర్తో ఐటీశాఖ మంత్రి భేటీ
> బాలానగర్ డీసీపీగా సురేశ్ కుమార్ బాధ్యతలు
> JNTU యూనివర్సిటీలో నేషనల్ వర్క్ షాప్
> ఓయూలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
> పోర్న్ వీడియో ఎఫెక్ట్.. కూతురిపై లైంగిక దాడియత్నం.. హత్య
> నీట్ పరీక్షను రద్దు చేయాలని తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఆందోళన
> మాదాపూర్లోని హాస్టల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
> తుకారంగేట్ పీఎస్ పరిధిలో మహిళ దారుణ హత్య
HYD చిలకలగూడ PS పరిధిలో దారుణం జరిగింది. CI అనుదీప్ కథనం ప్రకారం.. లాలాగూడకు చెందిన ఓ మహిళ 2022లో అనారోగ్యంతో చనిపోయింది. ఆమె కూతురు(12)ను సోదరి గార్డియన్గా పెంచుకుంటుంది. మల్కాజిగిరి వాసి సాయికృష్ణ(25)బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. చిల్డ్రన్ హోమ్ నుంచి తన ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్ చేశాడు. సాయికృష్ణతో పాటు అతడికి సహకరించిన చిల్డ్రన్ హోమ్ వర్కర్ లక్ష్మీపై కేసు నమోదైంది.
HYD మరోసారి దేశవ్యాప్తంగా సత్తాచాటింది. రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కలుపు యాజమాన్య విభాగానికి అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ రీసెర్చ్ సెంటర్ అవార్డు దక్కడం విశేషం. భువనేశ్వర్లో అఖిల భారత కలుపు యాజమాన్య సంస్థ వార్షిక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి HYD సైంటిస్టులు డాక్టర్ రామ్ ప్రకాశ్, డాక్టర్ పద్మజ ఈ అవార్డు అందుకొన్నారు.SHARE IT
HYD నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్నగర్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూపార్కు పరిసరాల్లో వాయు, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉద్ధృతి పెరిగి జూపార్కులోకి నీరు ప్రవేశిస్తుండటంతో జూపార్కును మరో చోటికి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని షర్మిల అన్నారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గ్రేటర్ వ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ తాగునీటి, మురుగు కనెక్షన్లకు యాప్తో అరికట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ యాప్ను విజయవంతంగా పరిశీలించిన అధికారులు నగర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కొన్నేళ్లుగా అక్రమ నల్లాలు, మురుగునీటి కనెక్షన్ల వల్ల జలమండలికి నష్టం జరుగుతోంది. అక్రమ కనెక్షన్లను అరికట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
HYDలో భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. వరుస చైన్ స్నాచింగ్లకు ముఠా పాల్పడటంతో పోలీసులకు సవాలుగా మారింది. HYDతో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే లక్ష్యంగా స్నాచింగ్లు చేస్తున్నారు. జవహర్నగర్, శామీర్ పేట, మెహిదీపట్నంలో చైన్ స్నాచింగ్ చేసి శివారు ప్రాంతాల్లోకి గ్యాంగ్ మకాం మార్చడంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు. యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.