India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్తో పాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్లోని క్లాసిక్ గార్డెన్లో రేపు(ఆదివారం) ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేస్తారు.

రియల్ ఎస్టేట్ అంటే హైటెక్స్ మాత్రమే కాదు. RRR వెంట HMDA ప్లాన్ చేస్తున్న 10 గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్లు గేమ్ ఛేంజర్ కాబోతున్నాయి. ప్రభుత్వం భూములు కొనకుండా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP)తో రైతులనే పార్ట్నర్లను చేస్తోంది. సంగారెడ్డి IT హబ్గా, తూప్రాన్ లాజిస్టిక్స్ అడ్డాగా, ఆమన్గల్ ఫ్యూచర్ సిటీ గేట్వేగా మారనున్నాయి. ఈ 10 క్లస్టర్ల పరిధిలోకి వచ్చే గ్రామాల సర్వే నంబర్ల జాబితా ఇంకా సీక్రెట్గానే ఉంది.

HYD మరింత పెద్దది కాబోతోంది. ప్రస్తుతం HMDA పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా దీన్ని 10,472 చదరపు KMకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా 11 జిల్లాల పరిధిలోని RRR ప్రాంతాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. ముఖ్యంగా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP) పద్ధతిలో 10 భారీ టౌన్షిప్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ విస్తరణ పూర్తయితే HYD దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాల్లో ఒకటిగా మారుతుంది.

HYD శరవేగంగా విస్తరిస్తున్నా మన నీటి సరఫరా మాత్రం 2012 నాటి 600 MGD దగ్గరే ఆగిపోయింది. కానీ ఇప్పుడు నగరానికి కావాల్సింది 835 MGD. అంటే రోజుకు 235 మిలియన్ గ్యాలన్ల భారీ కొరత ఉంది. ప్రస్తుతం అధికారులు కోర్ సిటీ నీటిని తగ్గించి, తెల్లాపూర్, కొల్లూరు లాంటి కొత్త ఏరియాలకు సర్దుబాటు చేస్తున్నారు. కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు కానీ, అదనపు నీటి వనరులు పెరగకపోవడం గమనార్హం.

సిటీ నుంచి వైజాగ్ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రెగ్యులర్గా నడుస్తోంది. లింగంపల్లి- విశాఖ (12806) ఉ.6:55 గం.కు బయలుదేరి విశాఖకు రాత్రి 7:50కు చేరుకుంటుంది. విశాఖ- లింగంపల్లి (12805) రైలు విశాఖలో 6:20 గం.కు బయలుదేరి లింగంపల్లికి రాత్రి 7:15 గం.కు చేరుకుంటుంది. ఈ మార్పులు రేపటి నుంచి అమలవుతాయి.

RR మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు. చేవెళ్ల 5th వార్డులో TRP అభ్యర్థి రాజుకు ఒక్క ఓటూ పడలేదు. తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. 1st వార్డులో BJP అభ్యర్థి శ్రీనివాస్కు 2ఓట్లు రాగా 4వవార్డు BJP అభ్యర్థి కేశపల్లి భాగ్యమ్మకు 2ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో 2nd వార్డ్లో అలీకి ఓట్లురాలేదు. 19thవార్డులో BSP అభ్యర్థి రఘుపతికి 1ఓటు పడింది. శంకర్పల్లిలో 13వవార్డు జనసేన అభ్యర్థి సాయికి 2ఓట్లు పడ్డాయి.

HYDలో 3 ముళ్ల బంధాలు మున్నాళ్ల ముచ్చటవుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. నిపుణుల సలహా ఏంటంటే.. మీ కూతురుకి మీలాంటి లక్షణాలున్న వ్యక్తి భర్తగా వస్తే అంగీకరిస్తారా? అలాగే స్త్రీలూ మీ అబ్బాయికి మీలాంటి వ్యక్తి భార్యగా వస్తే అంగీకరిస్తారా? అంగీకరించలేకుంటే అలా మిమ్మల్ని మార్చుకుంటే బంధాలు నిలబడతాయి. యువత ఆత్మపరిశీలన చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని సూచిస్తున్నారు.

నాచారం PS పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడికి కుషాయిగూడ సెషన్స్ న్యాయస్థానం శిక్ష విధించింది. 2022లో అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు రమేశ్(38)కి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ వాదనలను సమర్థించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అప్పటి ఇన్స్పెక్టర్ మహేశ్ పకడ్బందీగా సాక్ష్యాలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.

పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించాలని TG హైకోర్టు GHMCని ఆదేశించింది. HYDలో ఉన్న ఫుట్పాత్లను 3 నెలలోగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాటసారులకు ఆటంకం కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టంచేసింది.

మున్సిపాలిటీ రిజల్ట్స్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. షాద్నగర్లో BRS అభ్యర్థులుగా 28వ వార్డు నుంచి లక్ష్మీప్రసన్న, 9వ వార్డు నుంచి ఆమె భర్త వేణుగోపాల్ పోటీ చేశారు. భార్య గెలవగా.. భర్త ఓడారు. ఇంజినీరింగ్, MBBS చదివే ఆమె పిల్లలే భుజానేసుకుని తల్లిని గెలిపించుకున్నారు. 22వ వార్డులో అనితను కుమార్తెలు, కుమారుడు గెలిపించారు. మాజీ ఛైర్మన్ నరేందర్ సతీమణి మహేశ్వరి ఓడిపోగా.. 23, 24లో వదిన మరిది గెలిచారు.
Sorry, no posts matched your criteria.