India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. అర్ధరాత్రి దాటినా అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల MDMA వంటి మత్తుపదార్థాలు పట్టుబడటం సంచలనం రేపింది. మరోవైపు, డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైన యువతులు బాధితులను పబ్లకు పిలిపించి, భారీగా బిల్లులు వేయించి పరారవుతున్నట్లు మోసాలు వెలుగు చూస్తున్నాయి.

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం సికింద్రాబాద్లో తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత కాస్త పెరిగింది.

మన HYD చారిత్రక కట్టడాలకు నిలయం. వందలేళ్ల బంగ్లాలు నేటికీ చెక్కుచెదరకుండా చెమక్కుమంటున్నాయి. 1913లో 7వ నిజాం బాగ్-ఇ-ఆమ్(పబ్లిక్ గార్డెన్)లో ఇండో-పర్షియన్ శైలిలో ఓ అద్భుత భవనం నిర్మించారు. తన 25 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా 7వ నిజాం ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపారు. అప్పటినుంచి ఇది ‘జూబ్లీహాల్’గా ప్రసిద్ధి చెందింది. 27 ఏళ్ల పాటు రాష్ట్ర శాసన మండలి ఈ భవనంలో కొనసాగింది. మీరెప్పుడైనా చూశారా?

హైదరాబాద్ నుంచి ORR వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, లేఅవుట్ ఆక్రమణలు, పార్కుల కబ్జాలు ఉంటే వెంటనే హైడ్రాకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. హైడ్రా హెల్ప్లైన్ 040-29565758కు కాల్ చేసి తెలియజేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో (DRF) 9000113667కు నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు సరికొత్త నైట్ లైఫ్ సెంటర్గా మారింది. పగటి ఆఫీసు గొడవలు పక్కనపెట్టి రాత్రుళ్లు భజన రేవ్లు, ‘ఫ్లోర్-హాప్’ ఈవెంట్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘నో-గ్రైండ్ గ్లో’ పేరుతో హడావుడి చేస్తూ కష్టపడి పనిచేయడం కంటే, లైఫ్ను ప్రశాంతంగా గడపడమే ముఖ్యమని చాటిచెబుతున్నారు. షీ-టీమ్స్ నిఘా ఉండటంతో మహిళల సందడి పెరిగింది. దీంతో నగర నైట్ ఎకానమీకి కొత్త ఊపిరి పోస్తోంది.

సిటీలో ప్రాపర్టీ వెరిఫికేషన్ ఇకపై డిజిటల్ మయం కానుంది. పన్ను వసూళ్లలో పారదర్శకత కోసం బల్దియా సరికొత్త ‘సెంట్రలైజ్డ్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్’ను సిద్ధం చేసింది. ఫీల్డ్ స్టాఫ్ మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ స్కాన్ చేయగానే ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ 3ఏళ్ల ప్రాజెక్టు కోసం 70:30 రేషియోలో టెక్నికల్ బిడ్డింగ్ నిర్వహించాలని GHMC కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. దీంతో పన్నుల ఆడిటింగ్ సులభతరం కానుంది.

టీచర్ ఉద్యోగం కోసం పిలిచి లైంగిక దాడికి యత్నించిన స్కూల్ కరస్పాండెంట్పై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫతేనగర్లోని ఓ పాఠశాలలో ఉద్యోగం కోసం ఓ టీచర్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూ చేసిన సదరు కరస్పాండెంట్ జాబ్ ఇచ్చాడు. ఆమెతో చనువుగా మాట్లాడుతూ లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయంపై PSలో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వారం రోజులుగా సిటీలో CNG గ్యాస్ దొరకడం లేదని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్దనున్న పెట్రోల్ బంక్లో గత 3-4 గంటల నుంచి క్యూ కట్టారు. ఇతర బంకుల్లోనూ CNG కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. CNG నింపుకోవడానికి దినం గడిచిపోతుందని.. బిజినెస్ ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు. సమస్య తీర్చాలంటున్నారు.
Sorry, no posts matched your criteria.