India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.

ఉపాధి కోసం HYD బాట పట్టిన జనం, పండుగ రాగానే ఊరువైపు పరుగులు పెడతారు. పట్నంలో పరుగు తీసిన కష్టాన్ని మరిచే ఆనందం, పండగకు పల్లెల్లోనే దొరుకుతుందని చెబుతుంటారు. అమ్మ వంట, నాన్న ఆశీర్వాదం, బంధువుల ఆప్యాయత ఇవన్నీ పండగకు ఊరే చిరునామా.. కాంక్రీట్ జంగల్ HYD జీవితంలోనూ పల్లె జ్ఞాపకాలే మనసుకు ఊరటనిస్తాయి. సంక్రాంతికి ఊరెళ్లి, మళ్లీ HYD బాట పట్టిన ప్రజలు ముచ్చటిస్తున్నారు.

‘అందంగా ఉన్నంత మాత్రాన రీల్స్ వైరల్ కావు.. యూజర్ స్కిప్ చేయకుండా చూసినప్పుడే అల్గారిథమ్ గుర్తిస్తుంది’ అని క్రియేటర్వర్స్ ఫౌండర్ డా.మణి పవిత్ర పేర్కొన్నారు. FTCCI టూరిజం కమిటీ ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహిల్స్లో టూరిజం రీల్స్ బూట్ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ టూరిజంను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో జరిగిన ఈ శిక్షణలో 58 మంది పాల్గొన్నారు. FTCCI ప్రతినిధులు పాల్గొన్నారు.

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలని NMC ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాగా, డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ సిబ్బందికి సులువుగా అర్థమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం వారి పని అనుభవమే. రోజూ వందలాది ప్రిస్క్రిప్షన్లు చూసే ఫార్మసిస్టులు డాక్టర్ల చేతిరాత, మందుల అబ్రివేషన్లు, ఫార్ములాలను ఈజీగా గుర్తిస్తారు. మందులపై అవగాహన ఉండటంతో చీటీ చూడగానే టక్కున మాత్రలు ఇచ్చేస్తారు.

HYDపై మాజీ CM దివంగత NTR చెదరని ముద్ర వేశారు. ట్యాంక్బండ్లో మనం చూసే బుద్ధ విగ్రహం ఆయన ఆలోచనలోనుంచే పుట్టింది. ఇందులో 1990 మార్చి 10న ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహ తొలి ప్రతిష్ఠ విషాదంగా మారింది. అనంతరం 1992లో విజయవంతంగా ప్రతిష్ఠించగా, నేడు అది HYDకు ప్రతీకగా నిలుస్తోంది. సాగరతీరం సౌందర్యవృద్ధికి 1996లో నెక్లెస్ రోడ్డును రూపుదిద్దారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా HYD ఆయనను స్మరిస్తోంది.

మేడారం జాతర ప్రసాదం (బంగారం) ఇంటి వద్దకు పంపేందుకు HYD ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.299 చెల్లించిన వారికి ప్రసాదంతోపాటు వనదేవతల ఫొటోలు, పసుపు, కుంకుమ అందజేయనున్నారు. TGSRTC ఆన్లైన్లో భక్తులు తమ వివరాలు నమోదు చేయాలని ఆర్టీసీ HYD అధికారి భద్రినారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించి 9154298733, 9154298865 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు.
# SHARE IT

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.