India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్సాగర్ పక్కన తమ పట్టా స్థలాల రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటుకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ బి.శరణప్పస్వామి మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టి.. ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితి కారొబార్ & సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడrగా సాదుల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల, ముఖ్య నాయకుల కారొబార్, జీపీ సిబ్బంది సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు.
సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవానికి చేనేత వస్త్రాలను, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యా శాఖ అధికారులకు సూచించారు. చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లైతే నేతన్నలందరికీ ఆర్థికంగా సహకరించినట్లు అవుతుందని మంగళవారం పేర్కొన్నారు. టీచర్స్డేకు సింథటిక్ శాలువాలకు బదులు కాటన్ శాలువాలు వాడాలన్నారు.
ఒక్కో జోన్లో 5 చెరువుల చొప్పున గుర్తించి సుందరీకరణ, అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. మహా నగరంలో చెరువుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. కనీసం 50 చెరువులను గుర్తించి సీఎస్ఆర్ నిధులతో సుందరీకరణ, అభివృద్ధి చేపట్టాలన్నారు.
ఫ్లడ్ కమిటీల ఏర్పాటుపై నేడు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఆ శాఖ వర్గాలు మీడియాకు మంగళవారం వెల్లడించాయి. పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, రాకపోకల పునరుద్దరణ ప్రణాళికపై చర్చలు జరగనున్నాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు హజరు కానున్నట్టు తెలిపాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. ‘X’ వేదికగా మంగళవారం స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ జీ’ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతి కుమారి అన్ని శాఖలను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి వివరాలు సేకరించి నివేదికలు సమర్పించాలి. ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.
రాష్ట్రంలో వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నెల రోజులుగా సీజనల్ వ్యాధులతో లక్షల మంది ప్రజలు ఇబ్బందిపడుతున్న దృష్ట్యా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో బుధవారం (నేడు) ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్ వెంకన్నగౌడ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో షరతులతో కూడిన పదోన్నతులపై ప్రభుత్వం న్యాయ విచారణ, బీసీ, ఓసీ ఉద్యోగులు నష్టపోయిన పదోన్నతులు కల్పించడం తదితర డిమాండ్లపై ధర్నా చేయనున్నట్లు తెలిపారు.
HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.