India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో బుధవారం (నేడు) ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్ వెంకన్నగౌడ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో షరతులతో కూడిన పదోన్నతులపై ప్రభుత్వం న్యాయ విచారణ, బీసీ, ఓసీ ఉద్యోగులు నష్టపోయిన పదోన్నతులు కల్పించడం తదితర డిమాండ్లపై ధర్నా చేయనున్నట్లు తెలిపారు.
HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ మత్స్యకారుల కోసం 24 గంటల హెల్ప్లైన్ సేవలను ఆ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని మత్స్య భవన్లో మత్స్య శాఖ కమిషనర్ డా.ప్రియాంక అలా, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ హెల్ప్ లైన్ నెంబర్ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు సహాయార్థం 8090199299 హెల్ప్ లైన్ నంబర్ను అందుబాటులో ఉంచారు.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్సుఖ్నగర్కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సర్కారు భారీగా పెంచింది. ఏకంగా 2 నుంచి 5 రెట్ల వరకు పెంచేసింది. భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 28న స్పీడ్-19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి RRR దక్షిణ భాగంపై చర్చించి, ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న మహానగరం ప్రజా రవాణాలో వెనకబడిపోతోంది. బస్సుల కొరతతో వందలాది మార్గాలను ఆర్టీసీ వదిలేసింది. ప్రస్తుతం నగరంలో 2,850 సిటీ బస్సులు 795 మార్గాలలో 25వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం 1,000 బస్సులు తక్కువగా నడుస్తున్నందున ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి.
నగరంలో నాలాలను పూర్తిగా సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలాలపై ఆక్రమణలను తొలగించి పూర్వ రూపు తేవడానికి ప్రణాళికను రూపొందించింది. నాలాలపై అక్రమణలను తొలగించడానికి హైడ్రా రంగంలోకి దిగనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నాలాలను పూర్వస్థితికి తీసుకురావడానికి రూ.650కోట్లు ఖర్చు అవుతుందని సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు సమకూర్చితే వచ్చే వర్షాకాలంలో వరద సమస్యలు ఉండవన్నారు.
రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఈ నిర్లక్ష్యం ఖరీదు 20 మంది ప్రాణాలు కోల్పోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్కు వరద ముప్పు తప్పిందని అన్నారు.
కేంద్ర మంత్రులు అమిత్, కిషన్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించడంపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ నాంపల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. 2024 మే 1న ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ శాలిబండలో కేసు నమోదైందని, విచారణలో వారు కోడ్ ఉల్లంఘించలేదని పేర్లు తొలగించారు. ఈ నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 14కు వాయిదా వేసింది.
తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(TDF) రూపొందించిన రిపోర్టును రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, MP కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, అనిల్ కుమార్ రెడ్డిలకు చైర్మన్ గోనారెడ్డి సమర్పించారు. అలాగే ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంలకు కూడా రిపోర్టును అందజేశారు.
Sorry, no posts matched your criteria.