Hyderabad

News August 31, 2025

HYD: లడ్డూ దొంగలొస్తున్నారు.. జాగ్రత్త!

image

వినాయకచవితి నవరాత్రుల వేళ లడ్డూ దొంగల బెడద పెరిగింది. మీర్‌పేట PS పరిధి హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్‌ కాలనీలో ఏకంగా 4 మండపాల్లో గణపతి లడ్డూలను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన యువకులు అదును చూసి చోరీ చేశారు. దీనిపై స్థానికులు PSలో ఫిర్యాదు చేశారు. మండపంలో నిద్రించే వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT

News August 30, 2025

HYDలో ఫంక్షన్ కోసం పేదోడి టెన్షన్!

image

ఇంట్లో ఫంక్షన్‌ ఉంటే HYDలో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువుకు వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్‌లో కనీసం 2 ఫంక్షన్ హాల్స్ నిర్మించి, తక్కువ ధరకు ఉంచేలా చూడాలని కోరుతున్నారు.

News August 30, 2025

మహానగరంలో శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

image

వచ్చే నెల 6న జరిగే గణపతి శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్టాటిక్ క్రేన్లు: 134, మొబైల్ క్రేన్లు: 269, హుస్సేన్‌సాగర్ వద్ద పడవలు 9, డీఆర్ఎఫ్ 16 టీములు, గజ ఈతగాళ్లు: 200, గణేశ్ యాక్షన్ టీమ్స్: 160, పారిశుద్ధ్య కార్మికులు 14,486 మంది, మినీ టిప్పర్లు: 102, జేసీబీలు 125, స్వీపింగ్ యంత్రాలు 30, మొబైల్ టాయిలెట్స్ 309, లైటింగ్ పాయింట్లు 56,187, వైద్య శిబిరాలు 7 ఏర్పాటు చేశారు.

News August 30, 2025

భారీ వర్షాల నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దు

image

భారీ వర్షాలు కురిసి ట్రాక్స్ దెబ్బతిన్న కారణంగా పలు రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- నాగర్ సోల్, నిజామాబాద్- కాచిగూడ, నాందేడ్- మేడ్చల్, కాచిగూడ- కరీంనగర్, కాచిగూడ- మెదక్, సికింద్రాబాద్- సిద్దిపేట, కరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, సిద్దిపేట- సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు.

News August 30, 2025

సిటీకి సుస్తీ.. ఆస్పత్రుల్లో కుస్తీ

image

వాతావరణ మార్పులతో నగరానికి సుస్తీ చేసింది. దీంతో ప్రజలు ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో రోజుకు 2,200 నుంచి 2,500 మంది చికిత్సకు వస్తున్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 400- 500 OP ఉండగా ఇప్పుడు రోజుకు 1,100- 1,300 మంది వస్తున్నారు. ఉస్మానియాలో సాధారణ OP 1,100 నుంచి 1,200 ఉండగా ఇప్పుడు 1,600-1,800 మంది వస్తున్నారు. ఒక్కో బస్తీ దవాఖానాకు 70- 90 మంది వస్తున్నారు.

News August 30, 2025

HYD: 10 ఏళ్ల తర్వాత హాజరవుతున్న సీఎం

image

టీచర్స్ డే.. ఉపాధ్యాయులు ఉప్పొంగే దినోత్సవం. ఈ వేడుకలో ఉపాధ్యాయుల ఆనందమే వేరు. ఈ అవార్డులు పొందిన టీచర్లకు ఆరోజు అభినందనలు వెల్లువెత్తుతాయి. ఇలాంటి వేడుకకు సీఎం వస్తే.. ఆ ఫీలే వేరు ఇది సగటు టీచర్ ఆనందం. ఎప్పుడో 2014లో రవీంద్రభారతిలో జరిగిన వేడుకలకు అప్పటి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్లకు ఈ సెప్టెంబరు 5న రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మాదాపూర్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహించనున్నారు.

News August 30, 2025

HYD: గణేశుడితో పాటు బంగారం నిమజ్జనం!

image

హస్తినాపూర్ వాసులు గణేశుడికి వేసిన 5తులాల బంగారంతోనే శివారు తుర్కయంజాల్ మాసబ్‌చెరువులో నిమజ్జనం చేశారు. విషయాన్ని గుర్తించి జరిగిన విషయం మున్సిపల్ నోడల్ అధికారులు వినయ్, శ్రీధర్‌రెడ్డికి చెప్పారు. సిబ్బంది వెంటనే రంగంలోకి దింపగా.. JCB సహాయంతో శ్రమించి విగ్రహాన్ని బయటికి తీశారు. 5 తులాల బంగారాన్ని వారికి అందించారు. పోయిందనుకున్న బంగారం తిరిగి దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయ్.

News August 30, 2025

HYD: మెట్రో టైమింగ్స్ పొడిగింపు

image

మెట్రో రైలు టైమింగ్స్ శనివారం ప్రత్యేకంగా పొడిగించారు. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది. వినాయక మండపాల దర్శనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఎక్కువ సమయం, భక్తి, సౌకర్యం కోసం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాంటూ మెట్రో ప్రకటించింది.

News August 30, 2025

శేరిలింగంపల్లి: ‘360 లైఫ్‌’ ప్రాజెక్టు నిలిపివెయ్యండి: హైకోర్ట్

image

శేరిలింగంపల్లి ఇజ్జత్‌నగర్‌లో నిర్మిస్తున్న నమిత 360 లైఫ్‌ ప్రాజెక్టు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్, ఎయిర్‌పోర్టు ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సరిదిద్దకుండానే ఎలా ఉత్తర్వులు జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

News August 30, 2025

జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు బీజేపీ యత్నం

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో విజయం సాధించాలని బీజేపీ వ్యూహం పన్నుతోంది. రాష్ట్ర అద్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు ఐదుగురి సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ప్రకటించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు, HYD సెంట్రల్‌ జిల్లా మాజీ ప్రెసిడెంట్‌ గౌతమ్‌రావును నియమించారు. బూత్ కమిటీ నాయకులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారు.