Hyderabad

News March 29, 2025

అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.

News March 29, 2025

అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69,79,352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణ చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపారు.

News March 29, 2025

హైదరాబాద్‌ భగభగ మండుతోంది..!

image

హైదరాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం ముషీరాబాద్ మండలంలో అత్యధికంగా 40.0℃, షేక్‌పేట 39.9, నాంపల్లి 39.9, అంబర్‌పేట్ 39.9, మరేడ్‌పల్లి 39.9, హిమాయత్‌నగర్ 39.9, ఖైరతాబాద్ 39.9, అసిఫ్‌నగర్ 39.9, చార్మినార్ 39.9, బండ్లగూడ 39.9, సైదాబాద్ 39.8, బహదూర్‌పురా 39.5, గోల్కొండ 39.4, సికింద్రాబాద్ మండలంలో 39.4 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.

News March 29, 2025

కూకట్‌పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

image

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.

News March 29, 2025

ఖైరతాబాద్: సిటీలో 20% వృథా అవుతున్న నీరు

image

వేసవిలో నగరంలో నీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే జలమండలి నగర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న నీటిలో సుమారు 20% వృథా అవుతోంది. అంటే దాదాపు 95 మిలియన్ లీటర్లు (3.5 మిలియన్ గ్యాలన్లు) వేస్టేజ్ అవుతోంది. పైప్‌లైన్ల లీకేజీలు, అనధికార కనెక్షన్ల కారణంగా ఈ నీరు ఇలా అవుతోందని జలమండలి అధికారులు చెబుతున్నారు. 2% సరఫరా లోపం కాగా.. మరో 18% నీటి పంపిణీలో ఉన్న లోపాల కారణంగా వేస్ట్ అవుతోంది.

News March 29, 2025

HYD : రోజుకు 9వేల ట్యాంకర్ల బుకింగ్

image

నగరంలో నీటి ఎద్దడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక ఉగాది, రంజాన్ పండగలు రావడంతో నీటి వినియోగం కొంచెం ఎక్కువైంది. ఈ క్రమంలో జలమండలి ట్యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు సగటున 9 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని, వాటిని 24 గంటల్లోపే సరఫరా పంపుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటిని సాధ్యమైనంత పొదుపుగా వాడుకోవాలని అధికారులు నగర వాసులకు సూచిస్తున్నారు.24గం.హోమ్ డెలివరీ HYDలో భారీగా బుకింగ్స్

News March 29, 2025

నిమ్స్‌లో ఉచితంగా పీడియాట్రిక్ గుండె శస్త్ర చికిత్సలు

image

HYD నిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ సెంటర్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు అమరేష్ రావు తెలిపారు. తెలంగాణకు చెందిన చిన్నారులతోపాటు ఇక్కడ సెటిల్ అయిన TG, AP ఆధార్ కార్డు ఉన్న కుటుంబాల చిన్నారులకు గుండె సమస్యలు ఉన్నట్లయితే ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని, వివరాలకు ఆస్పత్రిలో సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 29, 2025

బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

image

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

News March 29, 2025

SCRలో 92 మంది పదవీ విరమణ

image

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 92 మంది ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. హెడ్‌ క్వార్టర్స్, సికింద్రాబాద్, హైదరాబాద్‌ డివిజన్లతో పాటు లాలాగూడ వర్క్‌షాపులో వీరు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సహోద్యోగుల ఆధ్వర్యంలో వివిధ రైల్వే కార్యాలయాల్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

News March 29, 2025

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: డీఎంహెచ్‌ఓ

image

30, అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వెంకట్‌ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సహకారంతో సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ అలుమ్నీ భవనంలో శుక్రవారం ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.

error: Content is protected !!