Hyderabad

News April 24, 2025

HYD: ఎండలు.. సర్దుకుపోదాం!

image

HYDలో ఎండలు దంచికొడుతున్నాయి. G+1 భవనం, పెంట్ హౌస్, రేకుల ఇంట్లో ఉండే మధ్య తరగతి, పేదవాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీలింగ్, టేబుల్ ఫ్యాన్ ఉన్నా ఉపశమనం లేదని వాపోతున్నారు. మార్కెట్‌లో కూలర్లు, ACలకు డిమాండ్‌కు తగ్గట్లే ధరలున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బుల్లేక EMI దిక్కు అయ్యిందని మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీ అంటున్నారు. స్థోమత లేని పేదోడు షాపులో కొనలేక, ఇంట్లోనే సర్దుకుపోతున్నాడు.

News April 23, 2025

HYD: సంగారెడ్డి జైలుకు అఘోరి

image

లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.

News April 23, 2025

HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

image

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.

News April 23, 2025

2PM: HYDలో 78.57% పోలింగ్

image

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది. సాయంత్రం 4 గంటలను పోలింగ్ ముగియనుంది.

News April 23, 2025

ఓయూ భవనానికి ట్రేడ్ మార్క్ గుర్తింపు

image

ఉస్మానియా యూనివర్సిటీ ముఖచిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో నిర్మాణ శైలి చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్‌హోటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాల తర్వాత ట్రేడ్ మార్క్ కలిగిన 3వ కట్టడంగా ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది.

News April 23, 2025

HYDలో మరోసారి ఎలక్షన్‌కు BRS దూరం

image

ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో BRS సభ్యులెవరూ ఇప్పివరకు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకే నేతలందరూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికకు మరో 2 గం. వ్యవధి ఉంది. ఫిబ్రవరిలో GHMC స్టాడింగ్ కమిటీ ఎన్నికకు BRS దూరంగా ఉండగా మరోసారి HYD స్థానిక సంస్థల ఎలక్షన్‌ నుంచి తప్పుకుంది. రాష్ట్రవ్యాప్తంగా BRSకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినప్పటికీ GHMCలో మాత్రం ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు.

News April 23, 2025

HYDలో మరోసారి ఎలక్షన్‌కు BRS దూరం

image

ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో BRS సభ్యులెవరూ ఇప్పివరకు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకే నేతలందరూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికకు మరో 2 గం. వ్యవధి ఉంది. ఫిబ్రవరిలో GHMC స్టాడింగ్ కమిటీ ఎన్నికకు BRS దూరంగా ఉండగా మరోసారి HYD స్థానిక సంస్థల ఎలక్షన్‌ నుంచి తప్పుకుంది. రాష్ట్రవ్యాప్తంగా BRSకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినప్పటికీ GHMCలో మాత్రం ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు.

News April 23, 2025

HYDలో మ.12 వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే!

image

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 77.68% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది.

News April 23, 2025

HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

image

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.

News April 23, 2025

HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్

image

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ ల‌భించింది. TMRJC ఖైర‌తాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కుల‌కు గాను 495 మార్కులు వ‌చ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.