India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో ఆషాఢ బోనాల జాతర కొనసాగుతోంది. భక్తుల రద్దీని అదునుగా భావిస్తోన్న కొందరు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ జాతరలోనూ వీరు రెచ్చిపోయారు. 12 గంటల్లోనే 19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 13 సెల్ఫోన్ దొంగతనాలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లలో నిలబడినప్పుడు, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
SHARE IT
హుస్సేన్సాగర్లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాలు.. రామంతాపూర్కు చెందిన మహిళ శుక్రవారం ట్యాంక్బండ్ మీదకు వచ్చింది. ఒక్కసారిగా నీటిలో దూకేసింది. ఇది గమనించిక ట్యాంక్బండ్ శివ కుమారుడు హుస్సేన్సాగర్లోకి దిగారు. నీటిలో మునుగుతున్న ఆమెను బ్లూ కోట్ పోలీసుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. మహిళ సూసైడ్ అటెంప్ట్కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో PVNR ఎక్స్ప్రెస్ వే నుంచి మాసబ్ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.
HYD మెగా మాస్టర్ ప్లాన్-2050 వేగం పుంజుకుంటుందని HMDA అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన కామన్ మొబిలిటీ, ఎకనామికల్ డెవలప్మెంట్ బ్లూ, గ్రీన్ ఏరియా ప్లాన్ తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసేందుకు కన్సల్టెన్సీ ప్రపోజల్ రిక్వెస్ట్ కోసం HMDA ప్రకటన విడుదల చేసింది. ఈనెల 18వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ప్లాన్ అమలైతే HYD మరో స్థాయికి వెళ్లనుంది.
బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ మోటార్స్ను GHMC అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వరుణ్ మోటార్స్ నిర్వహకులు వ్యాపారం చేస్తుండడంతో పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ సీజ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్వర్టైజ్మెంట్ ఫీజులు బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
BRS రజతోత్సవ సభ కోసం నగర శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను తరలించేందుకు నాయకులు వాహనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ను LED లైట్లతో అందంగా అలంకరించారు. సభ వరంగల్లో అయినా హైదరాబాద్ కేంద్రంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు వెళ్లాయి. బస్సులు, డీసీఎంలు, కార్లు ఘట్కేసర్ మీదుగా ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోనున్నాయి. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
HYDలో వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్కాలనీలోని ఓ స్పా సెంటర్లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఉగ్రదాడి అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ జాతీయులను వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఇటువంటి సమయంలో పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ హైదరాబాద్లో అరెస్ట్ అయ్యాడు. నగర యువతిని పెళ్లి చేసుకున్న ఫయాజ్ ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడు. టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.