Hyderabad

News August 29, 2025

HYD: సీఎస్ పదవీకాలం 7నెలలు పొడిగింపు

image

తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం 7నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2026 మార్చి వరకు CSగా కొనసాగనున్నారు. కాగా 2025 మేలో ఆయనను తెలంగాణ CSగా ప్రభుత్వం సిఫారసు చేయగా.. కేంద్రం ఆమోదించింది. ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుండగా.. మరి కొంతకాలం పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాయగా దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

News August 29, 2025

HYD: డ్రగ్స్ ముఠాల వలలో మహిళలు!

image

డ్రగ్స్..జీవితాలను అల్లకల్లోలం చేసే పెనుభూతం. మహానగరంలో డ్రగ్స్ ముఠాల చేతుల్లో మహిళల జీవితాలు బలవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. 7 నెలల్లో దాదాపుగా 100 మందికిపైగా మహిళా బాధితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వంటి వాటి వైపు వీరు మరలుతున్నట్లు తెలుస్తోంది. ఒంటరి జీవితం, హై రేంజ్ ఉద్యోగం, భర్తతో వైరం, జీవితంపై విరక్తి, నివసించే పరిసరాలు దీనికి కారణాలుగా వెల్లడైంది.

News August 29, 2025

మూసారాంబాగ్ వంతెన వద్ద డేంజర్

image

మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మూసారాంబాగ్ వంతెన వద్ద నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగింది. గండిపేట ఉస్మాన్‌సాగర్ నుంచి 6 గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులు, హిమాయత్‌‌సాగర్ నుంచి 2 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,270 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. GHMC, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై& సీవరేజ్ బోర్డ్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

News August 29, 2025

హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

image

HYDలో పలు ప్రాంతాల నుంచి వచ్చే గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని నేటి నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఆయా రోజుల్లో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి NTR మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, PVNR మార్గ్‌లో మ.3 నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని తెలిపారు. దీన్ని బట్టి నగరవాసులు ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి.

News August 29, 2025

బడా గణేశ్‌ని దర్శించుకున్న CP CV ఆనంద్

image

హైదరాబాద్ CP CV ఆనంద్ ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై అధికారుల నుంచి ఆరా తీశారు. అనంతరం ట్యాంక్‌బండ్ మీద నిమజ్జనం, పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

News August 28, 2025

ఓయూ: ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
SHARE IT

News August 28, 2025

HYD: సోషల్ మీడియా పోస్టులు.. CP హెచ్చరిక

image

HYDలో వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 6వ తేదీ వరకు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండరాదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 28, 2025

‘TRS’కు పురుడుపోసిన బషీర్‌బాగ్ దమనకాండ

image

నాడు TDP హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 2000 మే నెలలో రాష్ట్రమంతా ఉద్యమించింది. ఈ పరిణామాలతో నాటి Dy. స్పీకర్‌ KCR లేఖ ద్వారా ప్రభుత్వానికి అసంతృత్తి తెలుపుతూ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. పరోక్షంగా బషీర్‌బాగ్ దమనకాండ TRS పార్టీ పురుడుపోసుకోవడానికి ఓ కారణమైంది. నాడు పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ఈ ప్రాంతానికి కలిగే నష్టాన్ని ఆయన అసెంబ్లీలో ప్రసంగించి ప్రజల మన్నెనలు పొందారు.

News August 28, 2025

HYD: గౌరీపుత్రుడు గంగను చేరేందుకు 78 స్పాట్లు

image

నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో గణనాథులను ప్రతిష్టించారు. ఇక లక్షల సంఖ్యలో ఇళ్లల్లో వినాయకులు కొలువు దీరారు. ఇన్ని విగ్రహాలు చెరువుల్లో నిమజ్జనం చేయాలంటే కష్టం. అందుకే GHMC అధికారులు 78 చోట్ల కృత్రిమ, తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేసింది. 29 చోట్ల బేబీ పాండ్స్, 28 చోట్ల పోర్టబుల్ పాండ్స్ సిద్ధం చేసింది. ఇక 21 ప్రాంతాల్లో తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేశారు.

News August 28, 2025

HYD: నిమజ్జనోత్సవ భద్రతకు 30 వేల మంది పోలీసులు

image

మహానగరంలో వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రై కమిషనరేట్ల కమిషనర్లు అందుకు తగ్గ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. శోభాయాత్ర జరిగే సెప్టెంబర్ 6న 30,000 మంది పోలీసులను రంగంలోకి దించనున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.