Hyderabad

News August 29, 2024

HYD: డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దగ్గర పడుతున్న గడువు!

image

HYDలోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్సిటీలో దూర విద్యలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆగస్టు 31న ఈ గడువు పూర్తి కానుంది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, కోర్సులు ఉన్నట్లు ప్రొఫెసర్ కోటేశ్వరరావులు, డా.వీరన్న తెలిపారు.

News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

News August 29, 2024

రాష్ట్రంలోనే HYD జిల్లాలో అత్యధిక MSME యూనిట్లు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా HYD జిల్లాలో MSME యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 1,68,077 MSMEలు ఉంటే.. ఇందులో 1,33,937 యూనిట్లు సర్వీస్ విభాగంలో ఉన్నాయి. మిగతా 34,140 యూనిట్లు ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. ఇందులో సూక్ష్మ సంస్థలు అత్యధికంగా 1,56,642 యూనిట్లు పనిచేస్తున్నాయి. చిన్న తరహావి 9,813, మధ్య తరహావి 1,622 దాకా ఉన్నాయని అధికారులు తెలిపారు.

News August 28, 2024

రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్..!

image

బేగంబజార్‌లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇటీవల ఫీల్ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు.

News August 28, 2024

HYD: త్వరలో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు

image

టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి దశలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి ఆమోదం తెలిపారన్నారు.

News August 28, 2024

HYD: సాంకేతిక సేవలతో నిర్మాణరంగ వ్యర్థాల తరలింపు

image

నిర్మాణరంగ వ్యర్థాల తరలింపునకు సాంకేతిక సేవలను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్‌లో సంప్రదిస్తే నిర్మాణ రంగ వ్యర్థాలు సేకరించే ప్రక్రియను అమల్లోకి తెచ్చింది. నిర్ణీత రుసుం చెల్లిస్తే ఎక్కడ నుంచైనా నిర్మాణరంగ వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది సేకరించనున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1159తో పాటు వాట్సాప్ నంబర్ 9100927073లో సంప్రదించవచ్చు.

News August 28, 2024

ఖైరతాబాద్: గణేశ్ ఉత్సవాల సమయంలో అదనపు ట్రిప్పులు

image

ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రోరైళ్లు నడిపిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడిపిస్తామని వెల్లడించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రోరైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు. 

News August 28, 2024

HYD: మహిళల బొమ్మలతో మగవారికి పరీక్ష.. ఫలితం

image

యువతులు, మహిళలను మగవారు ఏ విధంగా చూస్తున్నారన్న అంశంపై ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు బొమ్మలతో ప్రయోగాలు చేశారు. కుర్తాలు, చీరలను ఉపయోగించి కొన్ని బొమ్మలు, జీన్స్, షర్టులతో మరికొన్ని బొమ్మలను వేలమందికి పంపిణీ చేశారు. ముఖ కవళికలను తెలుసుకునేందుకే ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. అయితే, ఎక్కువ మంది యువకులు అనుచితంగా లైంగిక శరీర భాగాలను చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడైంది.

News August 28, 2024

HYD: మరో పదేళ్లు మాదే అధికారం: మంత్రి

image

BRS నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని రంగారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు KCR పాలన చూసి విసుగు చెంది BRSను ఓడించి, తమను గెలిపించారని మంగళవారం HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. రుణమాఫీపై అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టడం మానుకోకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు.

News August 28, 2024

Rewind: ఆగస్టు 28.. ఉలిక్కిపడ్డ హైదరాబాద్

image

28-08-2000 రోజు HYD ఉలిక్కిపడింది. విద్యుత్ ఛార్జీలు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరగానే పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చనిపోయారు. నేడు ఆ అమరులకు కామ్రేడ్‌లు నివాళి అర్పిస్తున్నారు.