Hyderabad

News September 23, 2024

HYD: అక్టోబర్ 2 నుంచి ఆపరేషన్ సీవరెజ్

image

గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.

News September 23, 2024

సికింద్రాబాద్‌లో పురాతన అద్భుతమైన టెంపుల్

image

సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని 1847 నాటి పురాతన పర్సి ఫైర్ టెంపుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ సైకిల్ లిస్టులో బృందం టెంపుల్ వెళ్లి సందర్శించి, ఆనాటి చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పేస్తోంజి, విక్కాజి మెహర్జీలు HYD, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

News September 22, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

East HYD‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్, అంబర్‌పేట, మీర్‌పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలు‌లతో కూడిన‌ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667‌ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News September 22, 2024

HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

News September 22, 2024

HYD: ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్!

image

HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్‌నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.

News September 22, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి ప్రధానాంశాలు

image

> చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో అన్నమయ్య పద సమార్చనం
> బొటానికల్ గార్డెన్ లో బర్డ్ వాక్
> ఉప్పల్‌లోని విశ్వకర్మ ఆత్మగౌరవ భవనంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవం
> కార్వాన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> తెలంగాణ ఆక్యుపంక్చర్ అక్యుప్రెషర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
బషీరాబాగ్ ప్రెస్ క్లబ్‌లో సెమినార్
> డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

News September 22, 2024

28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

News September 21, 2024

నగరవాసులకు GHMC కమిషనర్ కీలక విజ్ఞప్తి

image

నగరవాసులకు GHMC కీలక విజ్ఞప్తి చేసింది. ‘నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇంట్లోనే ఉండండి. అనవసర ప్రయాణాన్ని మానుకోండి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నూతన నిర్మాణాలు, శిథిలావస్థ భవనాలకు దూరంగా ఉండండి. వరదల్లో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో 040 21111111నంబర్‌ను సంప్రదించండి. అహోరాత్రులు సేవలు అందించేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం’ అని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.

News September 21, 2024

BREAKING: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

image

భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రూట్‌లలో భారీగా ట్రాఫిక్ జామైంది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి రాణిగంజ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మరోవైపు భారీ వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడం బెటర్.
SHARE IT