Hyderabad

News August 23, 2025

HYDలో గణనాథుడికి స్వాగతోత్సవాలు.. ట్రాఫిక్‌ జామ్

image

హైదరాబాద్‌లో గణనాథుడికి స్వాగతోత్సవాలు, ఆగమన్ వేడుకలను పిల్లలు, పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై వినాయక విగ్రహాన్ని తీసుకెళుతుండగా చెట్లు అడ్డుగా రావడంతో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. గాంధీనగర్ ట్రాఫిక్ పీఎస్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పోలీసులు సూచించారు.

News August 23, 2025

HYD: సూసైడ్ అటెంప్ట్.. 7 నిమిషాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసులు

image

వనస్థలిపురం పరిధి సహారా ఎస్టేట్ ప్రాంతంలో ఓ 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు స్పందించి కేవలం 7 నిమిషాల్లో ఆమె ప్రాణం కాపాడారు. సూసైడ్ అటెంప్ట్ కాల్ రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, డ్రైవర్ ARPC నరేశ్ చాకచక్యంగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి, హ్యాంగింగ్ చేసుకుంటున్న ఆమె ప్రాణాలను కాపాడారు. పోలీసులు సకాలంలో స్పందించడంపై స్థానికులు అభినందిస్తున్నారు.

News August 23, 2025

HYD: గ్యాంగ్ మెన్ విధులు ట్రాకింగ్‌కు GIS మానిటర్

image

రైల్వే ట్రాక్ సురక్షితంగా ఉందా..? లేదా..? అని తెలుసుకోవడంలో గ్యాంగ్ మెన్ కీలక పాత్ర పోషిస్తారు. కింది స్థాయి ఉద్యోగులైనప్పటికీ ప్రకృతి విపత్తులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉండే ప్రమాదాన్ని గుర్తించేది వీరే. ఈ నేపథ్యంలో గ్యాంగ్ మెన్ విధులను ట్రాక్ చేయడానికి వారికి GISమానిటర్ ఏర్పాటు చేసి, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టామని సికింద్రాబాద్ రైల్వే GM శ్రీవాస్తవ తెలిపారు.

News August 23, 2025

HYD: ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం

image

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధతపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్, మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలపై ఇంటింటి ప్రచారం చేయాలన్నారు.

News August 23, 2025

HYD: బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి: ఆర్.కృష్ణయ్య

image

ఆగస్టు 25న జరగనున్న సత్యాగ్రహ దీక్షపై ఈరోజు HYDలోని సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు పాల్గొన్నారు.

News August 23, 2025

HYD: ఈనెల 25న సత్యాగ్రహ దీక్ష: తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం

image

ఆగస్టు 25న MP, BC సంఘం జాతీయ అధ్యక్షుడు R.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో జరగబోయే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ BC విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సిరిపురం రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 42% BC రిజర్వేషన్లను అమలు చేయాలని, రిజర్వేషన్లపై ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. డిక్లరేషన్‌ను అమలు చేయాలని, లేకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

News August 23, 2025

HYD: రేపు ఉదయం ఈ రూట్లు బంద్..!

image

HYDలో ఆదివారం ఉ.5 గంటల నుంచి పలు రూట్లు బంద్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ (7:15 AM వరకు), ఇందిరానగర్ HCU గేట్ నంబర్-2 (11:30 AM వరకు), లెమన్ ట్రీ నుంచి సైబర్ టవర్స్ (8 AM వరకు), IKEA నుంచి సైబర్ టవర్స్ (8 AM వరకు), రోడ్ నంబర్ 45 వంతెన నుంచి కేబుల్ బ్రిడ్జి (8:30 AM వరకు) రూట్లు మూసి ఉంటాయి. SHARE IT

News August 23, 2025

HYD: రాబడి పెంచుకోవడంపై జలమండలి స్పెషల్ ఫోకస్

image

రెవెన్యూ పెంపుపై జలమండలి స్పెషల్ ఫోకస్ పెట్టింది. జలమండలి పరిధిలో డొమెస్టిక్ క్యాటగిరీ కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించడంతో రెవెన్యూను పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నాన్ రెసిడెన్షియల్ భవనాల జాబితాను సేకరించి, వాటిని నేటి సరఫరా కనెక్షన్లతో పోల్చాలని జలమండలి నిర్ణయించింది.

News August 23, 2025

HYD: NIMSలో వసతుల కల్పనకు రూ.57 కోట్లు..!

image

HYD పంజాగుట్ట పరిధిలోని NIMS ఆసుపత్రిలో CSR కింద అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నట్లుగా ఆసుపత్రి డైరెక్టర్ బీరప్ప తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 19 సంస్థలు రూ.57 కోట్లు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. ఈ నిధులతో అత్యాధునిక పరికరాలు, వసతులు సమకూర్చుతామని వివరించారు.

News August 23, 2025

HYD: 2,016 పడకలతో ‘గాంధీ’ అప్‌గ్రేడ్.. రూ.5 కోట్లతో STP

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి త్వరలోనే 2,016 పడకలతో అప్‌గ్రేడ్ కానుంది. ఇందుకు కావాల్సిన వైద్యులు, సిబ్బందిని నియమించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాక డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసినందుకు STP ప్లాంట్ నిర్మాణానికి అదనంగా అవసరమయ్యే రూ.5 కోట్ల త్వరలోనే కేటాయిస్తామని పేర్కొంది. గాంధీ ఆసుపత్రి సమస్యలన్నింటినీ తీరుస్తామని వివరించింది.