India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో భారీ వర్షం కురుస్తోంది. హయత్నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డినగర్, బాలాపూర్, అల్మాస్గూడ, నాదర్గుల్, మీర్పేట్, బడంగ్పేట్ తదితర ప్రాంతాల్లో సుమారు అర గంట నుంచి భారీ వర్షం కురుస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా కామెంట్ చేయండి.
HYD మెట్రో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇబ్బందులకు గురైతే వాటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలపాలని అన్నారు. మెట్రోలో ఏసీ సరిగా రావడం లేదని ఓ వ్యక్తి తెలపగా, ప్రస్తుతం మెట్రోలో ఏసీ 22-24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. వాట్సాప్ నంబర్ 7995999533 ద్వారా సమస్యలు తెలపాలని కోరారు. SHARE IT
HYDలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు తెలిపారు. దీనిని తాడుతో పంపుతారని, 100 కేజీల బరువు వరకు లాగుతుందని తెలిపారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
HYD మెట్రో జోన్ పరిధిలో 18, రంగారెడ్డి జోన్ పరిధిలో 25, మేడ్చల్ జూన్ పరిధిలో 18 చొప్పున కొత్తగా 33KV ఉపకేంద్రాలను ఏర్పాటుకు చీఫ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక రచించారు. గృహ, వాణిజ్య, మాల్స్ నిర్మాణాల దూకుడుతో విద్యుత్ వినియోగం ఏటేటా పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో డిమాండ్ తట్టుకునేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు ఇంజినీర్లు లేఖ రాశారు.
HYDలో కార్నివాల్, నుమాయిష్, ఎల్బీ స్టేడియంలో మ్యాచ్, సభలు, వివాహ, ఇతర వేడుకలు, సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారా.. అయితే అక్కడ అగ్నిప్రమాదాల నివారణకు ఫైరింజిన్లను అద్దెకు తీసుకోవచ్చు. గంటలు, రోజుల చొప్పున అద్దె చెల్లించి సేవలు పొందొచ్చని అగ్నిమాపక శాఖ తెలిపింది. నూతనంగా 8 అధునాతన పంపులను కొనుగోలు చేశారు. ఫైర్ ఇంజిన్ https://fire.telangana.gov.in/WebSite/standby.aspx ద్వారా బుక్ చేసుకోండి.
HMDA పరిధిలో చెరువులు, పార్కుల సుందరీకరణపై అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువుల సుందరీకరణకు రూ.22 కోట్లు, కొత్తగా 15 ఫారెస్టు బ్లాకుల ఏర్పాటు, నర్సరీల పెంపునకు నిధులు రూ.75 కోట్లు, కొత్త పార్కుల్లో థీమ్స్ అభివృద్ధి, సరస్సుల సుందరీకరణ, పాత పార్కుల్లో థీమ్స్ మార్పుకు రూ.144కోట్లు, గోల్డెన్ మైన్స్ వే 20 ఎకరాల్లో మయూరినగర్ అమీన్పూర్ రాక్ గార్డెన్ నిర్మాణం, కాలనీ పార్కులకు రూ.46 కోట్లు వెచ్చించనున్నారు.
మోడల్ కారిడార్ల పొడవునా అలంకరణ జాతులకు చెందిన మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా అధికారులు నాటుతున్నారు. శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్ల పరిధిలోని రోడ్డు విభాగినులపై వరుసగా 1.13 లక్షలు, 70 వేలు, కూకట్పల్లి జోన్ రహదారులపై 18 వేల మొక్కలను నాటనున్నారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో 38,400 మొక్కలను నాటుతున్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం(HCU)మరొక అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. విదేశీ విద్యార్థులకు అనువైన టాప్ 12% యూనివర్సిటీల్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విలువలు కలిగిన విశ్వవిద్యాలయాలకు స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ ఇచ్చిన 2024 ర్యాంకింగ్లో భారతదేశం నుంచి అత్యుత్తమ ర్యాంకు పొందిన విశ్వవిద్యాలయంగా హెచ్సీయూ నిలిచింది.
HYDలో జీతం పెరగట్లేదు కానీ.. ఖర్చులు ఎక్కువేనని సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా సామాన్యుడి జీవితం మారుతోంది. ఉద్యోగ, ఉపాధి కోసం పట్నం బాటపట్టే ఎంతో మంది, చాలీచాలనీ జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇంటి ఖర్చులు, రవాణా,విద్య,వైద్యం ఇలా రోజు వారీ ఖర్చులు గణనీయంగా పెరుగుతుండటంతో, వచ్చే జీతం డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదని అంటున్నారు.మరి మీరేమంటారు..? కామెంట్ చేయండి.
GHMC ఆరేళ్ల క్రితం ఎల్బీనగర్, అమీర్పేట్, పాతబస్తీ, ఖైరతాబాద్, మలక్పేట్, హైటెక్ సిటీ, మియాపూర్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఒక్కోదానికి రూ.6.50 లక్షలు వెచ్చించి, నీటి శుద్ధి పరికరాలను కొనుగోలు చేసింది. రూ.5కు 10 లీటర్ల చొప్పున మొదట నీరు అందించినా.. ప్రస్తుతం ఉప్పల్ సహా అనేక చోట్ల మూలన పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.