India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి త్వరలోనే 2,016 పడకలతో అప్గ్రేడ్ కానుంది. ఇందుకు కావాల్సిన వైద్యులు, సిబ్బందిని నియమించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాక డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసినందుకు STP ప్లాంట్ నిర్మాణానికి అదనంగా అవసరమయ్యే రూ.5 కోట్ల త్వరలోనే కేటాయిస్తామని పేర్కొంది. గాంధీ ఆసుపత్రి సమస్యలన్నింటినీ తీరుస్తామని వివరించింది.
గ్రేటర్ HYD వ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల నుంచి వివిధ ప్రాంతాలకు పార్సెల్, స్పీడ్ పోస్ట్ సర్వీసులు వేగంగా జరుగుతున్నట్లుగా ఉప్పల్ అధికారులు తెలియజేశారు. మీ పార్సల్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం https://www.indiapost.gov.in వెబ్సైట్ను సందర్శించి, కాన్సెంట్ నంబర్, క్యాప్చ లెటర్స్ ఎంటర్ చేసి, సర్చ్ బార్ నొక్కితే, ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చని వివరించారు. SHARE IT
‘HYD మారథాన్’ ఆదివారం ఉ.5 గంటల నుంచి ఉ.11:30 వరకు ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ఈరోజు తెలిపారు. 42K / 21K ఈవెంట్ పీపుల్ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు,10K రన్ ఈవెంట్ హైటెక్ గ్రౌండ్స్, మాదాపూర్, క్యుములేషన్ గచ్చిబౌలి స్టేడియం రూట్లలో జరుగుతాయన్నారు. పలు రోడ్లు మూసి ఉంటాయని ORR, రోలింగ్ హిల్స్, IKEA ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ వంతెన, మాదాపూర్ రోడ్డు ఆల్టర్నేట్ రూట్లని తెలిపారు.
జలమండలి పరిధిలో మరో 15 తాగునీటి రిజర్వాయర్లు అందుబాటులోకి రానున్నాయి. ORR ఫేజ్-2 కార్యక్రమంలో భాగంగా 2,761 కిలోమీటర్ల పైప్లైన్ను నిర్మించారు. కాగా ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సర్వీస్ రిజర్వాయర్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. గుర్రంగూడ, విశాఖనగర్, సుల్తాన్పూర్, బోదిగుట్ట, గంధంగూడ, ఉస్మాన్సాగర్, కృష్ణ బృందావన్ కాలనీ తదితర చోట్ల వీటిని త్వరలో ప్రారంభిస్తారు.
వర్షాకాలం ముందు నుంచే HYDలో పూడిక తొలగింపు పనులు జరగగా జులై 1 నుంచి పనుల్లో హైడ్రా వేగం పెంచింది. ఇప్పటి వరకు 15,665 క్యాచ్పిట్లు, 359 కల్వర్టులను సిబ్బంది శుభ్రపరిచారు. 1,670 నాలాల్లో చెత్తను తొలగించారు. 4,609 వాటర్ లాగింగ్ పాయింట్లు క్లియర్ చేసి, వర్షాకాలంలో 4,974 ప్రాంతాల్లో చెత్తను తొలగించారు. మొత్తంగా జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు 27,272 చోట్ల చెత్త, పూడిక తొలగింపు పనులు పూర్తి చేశారు.
గణపతి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉ.6 గంటల నుంచి రా.10 గంటల వరకు మాత్రమే భక్తిగీతాలను మాత్రమే వినిపించాలని రాచకొండ సీపీ సుధీర్బాబు సూచించారు. డీజే, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు నిషేధమని, శోభాయాత్రలు, ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు బందోబస్తు చేపట్టనున్నామని చెప్పారు.
మొబైల్ వాడకం పెరగడంతో రోజు రోజుకు స్క్రీన్ టైమింగ్ పెరిగి, కంటి పొర పొడిబారుతున్నట్లుగా మేడ్చల్ జిల్లా కీసర డాక్టర్ సరిత తెలిపారు. కళ్లలో ఇరిటేషన్, నొప్పి, మంటలు రావడం, నీరు లేకుండా ఉండటం, ఆకారంలో చిన్నవిగా కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని, మెల్లగా దృష్టి మసకబారుతుందన్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్లుపైకి కిందకి అనడంతోపాటు దూర ప్రాంతాన్ని చూడాలని, రోజు 3 లీటర్ల నీరు తాగాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డుల రివార్డు పాయింట్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్, ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల పేర్లతో ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్ లింకులను పంపించి సైబర్ మోసాలకు పాల్పడి రూ.లక్షలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయని HYD CSB డైరెక్టర్ IPS షికా గోయల్ తెలిపారు. లింక్లు క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారన్నారు. లింక్ మెసేజ్లతో జర జాగ్రత్త..!
వర్షం పడితే HYDలో చెట్లు నేలకొరిగి రహదారులపై పడిపోతున్నాయి. రాకపోకలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. జోరుగా వర్షం కురుస్తుండగానే పడిన చెట్లను తొలగించాల్సిన పరిస్థితి వస్తోంది. భారీ వాహనాలు వెళ్లలేని చోట బైకులపై వెళ్లి కొమ్మలను కట్ చేసే చర్యలు హైడ్రా తీసుకుంటోంది. జులై 1 నుంచి ఇప్పటి వరకు 810 చెట్లను తొలగించింది. గణేశ్ ఉత్సవాల్లో విగ్రహాల రవాణాకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తోంది.
సోషల్ మీడియా వినియోగం పెరగడంతో వ్యాపార ప్రకటనలకు ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వేదికలుగా మారాయి. రూ.3 వేలకే మొబైల్, రూ.10కే ఇంటర్నేషనల్ బ్రాండ్ టీషర్ట్, రూ.12 వేలకే LCD TVఅంటూ చేసే రీల్స్ చూసి గుడ్డిగా నమ్మొద్దని HYDపోలీసులు సూచిస్తున్నారు. నగరంలో కొందరు యువత ఆ యాడ్స్ను నమ్మి వాటిని కొనుగోలు చేసిన తర్వాత మోసపోయామంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారన్నారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.