India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతుబిడ్డ తెలంగాణ ఇంటర్ ఫస్టియర్లో టాపర్గా నిలిచింది. ఇబ్రహీంపట్నం మం. పోచారానికి చెందిన నగేశ్ గౌడ్-సబిత దంపతుల కూతురు శ్రీవార్షిక MPCలో 470 మార్కులకు 468 మార్కులు సాధించింది. ఇంగ్లిష్, సంస్కృతంలోనే ఒక్కో మార్కు రాలేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలంగాణ స్టేట్ టాప్ ర్యాంకర్గా రైతు బిడ్డ నిలవడం గర్వకారణం.
SHARE IT
ఇంటర్ ఫలితాల్లో మన హైదరాబాద్ విద్యార్థులు నిరాశ పరిచారు. ఫస్టియర్లో 66.68 శాతంతో సరిపెట్టుకున్నారు. 85,772 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,197 మంది పాస్ అయ్యారు. సెకండియర్లో విద్యార్థుల కాస్త మెరుగుపడ్డారు. 74,781 మంది పాస్ పరీక్ష రాయగా.. 50,659 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్, రంగారెడ్డి విద్యార్థులు సత్తాచాటారు. టాప్ 10లోనూ మన హైదరాబాద్ పేరు లేకపోవడం గమనార్హం.
BRS కంచుకోటలో ఆ పార్టీ పోటీ చేయకపోవడం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక, ఇప్పుడు జరుగుతోన్న MLC కోటా ఎన్నిక నుంచి BRS తప్పుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు వీచినా.. గ్రేటర్ ప్రజలు గులాబీ జెండాను ఎగరేశారు. వాస్తవానికి MLC కోటాలో BRSకు 24 ఓట్లే ఉన్నా.. కనీసం ప్రత్యర్థులతో పోటీ పడకపోవడం శోచనీయం. దీనిపై మీ కామెంట్?
అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి గాంధీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పలు వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. CBP/ESR, సీయూఈ, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, ఎస్ క్రియేటినిన్, ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్, బ్లడ్ గ్రూప్తో పాటు 50 ఏండ్లు పైబడినవారికి తమ 2 మోకాళ్ల ఎక్స్ రే అవసరం. అప్లికేషన్ మీద ఫొటో పెట్టి గాంధీలో ఇస్తే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు.
SHARE IT
రూల్స్ ఫాలో అవకపోతే ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో తెలిసిందే. నగరవాసులకు ఆపద వస్తే మాత్రం అంతకుమించి మానవత్వం చూపిస్తారు. అలాంటి ఘటనే మన SRనగర్లో జరిగింది. ఉమేశ్ చంద్ర విగ్రహం వద్ద సోమవారం ఓ మైనర్ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. విధుల్లో ఉన్న CI సైదులు ఇది గమనించాడు. బాలుడిని పైకి లేపి FIRST AID చేశారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంటికి పంపారు.
నేడు మ. 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. మన హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం నేడు తేలనుంది. రిజల్ట్ చూసుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లే పని లేదు.. మొబైల్ ఉంటే చాలు. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Way2Newsలో చెక్ చేసుకోండి.
SHARE IT
రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన హైదరాబాద్ జిల్లాలో 244 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2Newsలో<<>> చెక్ చేసుకోండి.
SHARE IT
TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో HYD, RR, MDCL జిల్లాలో నిరుద్యోగులు ప్రిపరేషన్కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
హైదరాబాద్లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.