Hyderabad

News August 23, 2025

HYD: ఈ ప్రాంతాల్లో HMDA ఓపెన్ ప్లాట్ల విక్రయం.!

image

HMDA త్వరలోనే తుర్కయంజాల, బాచుపల్లి ప్రాంతాల్లో 82 ప్లాట్లను విక్రయించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఆ తర్వాత మిగతా స్థలాలు అమ్మనున్నారు. బాచుపల్లి పరిధిలో 70ప్లాట్లు, తుర్కయంజాల పరిధిలో 12 ప్లాట్లు ఉన్నాయి. దశలవారీగా బైరామల్‌గూడ, కోకాపేట, చందానగర్, బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, పూప్పాలగూడ ప్రాంతాల్లోని ప్లాట్లను సైతం HMDA విక్రయించనుంది.

News August 23, 2025

HYD: 25లక్షల మొక్కలు నాటడమే TARGET

image

GHMC వ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటటమే టార్గెట్ అని అధికారులు తెలిపారు. ఇందులో HYD పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో మొక్కల పంపిణీ చేశారు. 1,500 పార్కులలో మొక్కలు నాటడం, వంతెనలు, కమ్యూనిటీ పార్కులలో పచ్చదనాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం తెలియజేసింది.

News August 23, 2025

HYD: 25లక్షల మొక్కలు నాటడమే TARGET

image

GHMC వ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటటమే టార్గెట్ అని అధికారులు తెలిపారు. ఇందులో HYD పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో మొక్కల పంపిణీ చేశారు. 1,500 పార్కులలో మొక్కలు నాటడం, వంతెనలు, కమ్యూనిటీ పార్కులలో పచ్చదనాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం తెలియజేసింది.

News August 23, 2025

HYDలో గుంతలు పూడ్చేందుకు స్పెషల్ డ్రైవ్

image

HYDలో గుంతలు పూడ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. 2025 జూలై 1వ తేదీ నుంచి ఇప్పటికీ 9,899 గుంతలు పూడ్చి వేసినట్లుగా తెలియజేశారు. ప్రతి వార్డులో ఏరియాల ప్రకారంగా ప్రత్యేక బృందాలు రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేపడుతున్నట్లుగా అధికారులు వివరించారు.

News August 23, 2025

హైదరాబాద్‌కు ‘HILLS’.. అక్కడ ఇదీ రోడ్ల పరిస్థితి!

image

HYDలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే తెలియని వారు ఉండరు. భారీ బిల్డింగ్‌లు, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ అందాలకు ఈ ఏరియాలు మారుపేరు. ధనికులు ఉండే ప్రాంతంగానూ పేరు పొందింది. కానీ.. ఇప్పుడు బంజరాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రహదారులు గుంతల మయంగా మారి, అధ్వాన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12 పరిస్థితికి అద్దంపట్టే రోడ్డు ఫొటో.

News August 23, 2025

ఢిల్లీ గడ్డపై.. తమిళనాడుతో రంగారెడ్డి బిడ్డ ఢీ

image

సెప్టెంబర్ 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఈ ఏడాది రసవత్తరంగా జరుగనుంది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో తెలంగాణ వర్సెస్ తమిళనాడు అని రాజకీయ నాయకులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సీపీ రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి సీటుకోసం పోటీ పడుతున్నారు.

News August 23, 2025

HYD: వామ్మో.. ఏడు బ్లేడ్‌లను మింగిన వ్యక్తి

image

గాంధీ ఆస్పత్రిలో 7 బ్లేడ్లను మింగిన వ్యక్తికి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. మౌలాలికి చెందిన రియాజుద్దీన్ పాషా 16న బ్లేడ్లను మింగాడు. కడుపు నొప్పితో గాంధీలో అడ్మిట్ కాగా.. ఎక్స్‌రే తీయడంతో 7 బ్లేడ్లు కనిపించాయి. సర్జరీ చేసి బ్లేడ్లు బయటకు తీయడం ప్రాణాపాయమని భావించిన వైద్యులు మలద్వారం నుంచి వచ్చేలా చేశారు. ఈ కేసులో ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రొ.సునీల్ కుమార్ తెలిపారు.

News August 23, 2025

HYDలో ఇల్లు కడుతున్నారా? ఇది మీ కోసమే!

image

జలమండలి జారీ చేసే వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. MD అశోక్ రెడ్డి సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. HYDలో భవనం నిర్మించేటప్పుడు GHMC నుంచి విద్యుత్ ఫీజిబిలిటీ, జలమండలి నుంచి వాటర్ ఫిజిబిలిటీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ జలమండలి సర్టిఫికెట్ కోసం HMWSSB వెబ్‌సైట్ https://www.hyderabadwater.gov.in/ పై క్లిక్‌చేసి, న్యూ కనెక్షన్ ఆప్షన్ ఎంచుకొని, వివరాలు అందించాలి.

News August 23, 2025

PhD అభ్యర్థులకు గమనిక.. 12 నుంచి ఎంట్రన్స్ టెస్ట్

image

JNTUHలో Phd ప్రవేశాలకు సెప్టెంబర్ 12 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. 3 రోజుల పాటు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. 12న ఇంగ్లిష్, బయో టెక్నాలజీ, నానో టెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫార్మసీ సబ్జెక్టులకు, 13న వాటర్ రిసోర్సెస్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, సివిల్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఈసీ అభ్యర్థులకు, 14న మెకానికల్, EEE, CS ఎగ్జామ్స్ ఉంటాయన్నారు.

News August 23, 2025

HYDలో గుంతల చింతలు తీరేనా!

image

మహానగర రోడ్లపై గుంతలు ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. గుంతల రోడ్లపై వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. అందుకే గుంతలను సాధ్యమైనంత త్వరగా పూడ్చేలా GHMC చర్యలు తీసుకుంటోంది. మహానగరంలో 12,696 గుంతలున్నాయని గమనించింది. కొద్ది రోజులుగా మరమ్మతులూ ప్రారంభించింది. ఇప్పటి వరకు 9,899 గుంతలను పూడ్చినట్లు  GHMC ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు.