India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరికాసేపట్లో వెస్ట్ హైదరాబాద్(గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, మూసాపేట్, కూకట్పల్లి)లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు @Hyderabadrains పేర్కొంది. ఇప్పటికే నల్లటిమబ్బులు అలుముకున్నాయి. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. భారీ వర్షం, వరదల్లో రిస్క్ చేయకండి.
గంజాయి ముఠాను సుమారు 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. HYD-విజయవాడ హైవేలోని పతంగి టోల్ ప్లాజా వద్ద నలుగురు సభ్యులున్న ఓ గంజాయి ముఠాను నల్గొండ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఈరోజు పసిగట్టారు. అక్కడ వారిని అడ్డుకోగా కారుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకోవడంతో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంబడించి HYD శివారు అబ్దుల్లాపూర్మెట్ JNNURM వద్ద అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిను సీజ్ చేశారు.
BJPలో BRS విలీనం అవనుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అది కాంగ్రెస్ విష ప్రచారమని, ఊహాజనిత వ్యాఖ్యలని మండిపడ్డారు. BJPలో అలాంటి చర్చ ఏం లేదని, ఫేక్ ప్రచారం మానుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.
HYD నగరానికి మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీలు తరలించనున్నారు. రెండేళ్లలో భారీ పైప్ లైన్, నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగనుంది. 40 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం, 60% ఏజెన్సీ ఖర్చును భరించనుంది. మొత్తం రూ.5,560 కోట్లతో ఈ పైపుల నిర్మాణం జరుగనుంది. ఇందులో ప్రాజెక్టు దక్కించుకున్న ఏజెన్సీ రూ.3,336 కోట్లు భరించి, ఆ తర్వాత జలమండలి నుంచి వసూలు చేయనుంది.
అలంకరణ కోసం వాడే థర్మోకోల్, క్యాండీ స్టిక్, ఐస్క్రీమ్ స్టిక్, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ ఫోర్లు, చెంచాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ కవర్లు సహా అనేక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం 2022 జులైలో నిషేధం ప్రకటించింది. కేంద్ర పర్యావరణశాఖ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా GHMC అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
గ్రేటర్ HYD, RR, MDCL జోన్ ప్రాంతాల్లో 33/11KV ఫీడర్లు, LT విద్యుత్తు లైన్ల అభివృద్ధి మరమ్మతులకు రూ.25 కోట్ల నిధులు విద్యుత్ సంస్థ కేటాయించింది.గ్రేటర్ పరిధిలోని బంజారాహిల్స్, సైబర్ సిటీ, హబ్సిగూడ, HYD సెంట్రల్,HYD సౌత్,మేడ్చల్ రాజేంద్రనగర్, సంగారెడ్డి, సరూర్ నగర్,సికింద్రాబాద్ సర్కిల్ ప్రాంతాల్లో 11,770 పాయింట్లు సర్వే నిర్వహించిన అధికారులు ఒరిగిన విద్యుత్ స్తంభాలు, ఇతర సమస్యలు పరిష్కరిస్తారు.
HYD,RR,MDCL,VKB జిల్లాల పరిధిలో ఉన్న గర్భాశయ క్యాన్సర్ నివారించడం చాలా సులువని మేడ్చల్ వైద్య అధికారులు తెలిపారు. క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని, క్యాన్సర్కు రెండు అడుగుల దూరంలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా సహా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోస్టర్లు ఏర్పాటు చేసే అవగాహన కల్పించారు. పరీక్షల కోసం వాట్సప్ 8411803040, మిస్డ్ కాల్ 1800221951 ఇవ్వాలని సూచించారు.
షాద్నగర్ PSలో సునీతపై థర్డ్ డిగ్రీ వ్యవహారంపై NHRCలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది సమతా సైనిక్ దళ్ న్యాయ సలహాదారు కార్తీక్ నవయాన్ గురువారం ఫిర్యాదు చేశారు. సునీతపై దాడికి పాల్పడిన డీఐ రాంరెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించాలని, అరెస్ట్ చేసి శిక్షించాలని పిటిషన్లో కోరారు.కేసు CBIకి అప్పగించి దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని,బాధితురాలికి పరిహారం, ఉపాధి కల్పించాలని కోరారు.
HYD శివారు షాద్నగర్లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్లో ఉన్న షాద్నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. బాధితురాలు సునీత ఈనెల 11వ తేదీన ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదైంది.
HYDలో హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీMLA మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామ్ చెయ్.. రుణమాఫీ అయిపోయే..నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.