India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పొందిన వారికి సెప్టెంబరు నెలలో రేషన్ పంపిణీ చేయనుంది. రేషన్ షాపులకు ఇండెంట్ ప్రకారం స్టాక్ సరఫరా చేస్తున్నారు. ఈ నెల 20 వరకు మంజూరైన కొత్త కార్డులకు బియ్యం ఇవ్వనున్నారు. HYD పరిధిలో మొత్తం కొత్తవాటితో కులుపుకుని 13.76 లక్షల కార్డులు ఉండగా 60.01 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. RRలో 4,21,400, మేడ్చల్లో 2,19,316 రేషన్ కార్డులు ఉన్నాయి.
బ్యాంక్ చెక్కుల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బంగారం తాకట్టుపెట్టి ఎక్కడైనా చెక్కును తీసుకున్నారా? ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. తమిళనాడుకు, ఛత్తీస్గఢ్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన వ్యాపారులు HYDలో పలుచోట్ల బంగారం తాకట్టు పెట్టుకుని, FAKE చెక్కులు ఇస్తున్నారు. కావాల్సిన బంగారం వచ్చాక పారిపోతున్నారు. ఇటీవల ఈ స్కామ్లు నగరవాసులను కలవరపెట్టాయి. జాగ్రత్త!
ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, జెమిని ఎడిబుల్స్& ఫ్యాట్స్ ఇండియా Ltd పర్యావరణ హితం 10వేల విత్తన గణేశ్ పెట్టలను పంపీణీ చేస్తున్నట్లు ప్రకటించాయి. 5వేలు HYDలో మరో 5వేలు బెంగళూరులో పంపీణీ చేయనున్న వాహనాలను ఫ్రీడమ్ ఆయిల్స్ DGM చేతన్ పింపాల్ ఖుటే జెండా ఊపి ప్రారంభించారు. రిడ్జ్ టవర్స్, మైహోమ్ జ్యువెల్, వన్ సిటీ, సాయిమిత్రా టవర్స్, కృష్ణకుంజ్ గార్డినియా, మలేషియన్ టౌన్షిప్స్ పలు చోట్ల పంపిణీ చేస్తారు.
ఈ నెల 24న జరగనున్న 14వ HYD మారథాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉ 5 నుంచి 11:30 గం. వరకు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కవాడిగూడ- సైబర్ టవర్స్ మార్గం ఉ 7:15 వరకు, IKEA- సైబర్ టవర్స్ మార్గం ఉ.8 వరకు మూసేస్తారు. రోడ్ నం.45 ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జి మూసేస్తారు.
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు సా.5 గంటల నుంచి ఆదివారం ఉ.10 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో నేచర్ క్యాంప్ నిర్వహించనున్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నాక్టర్నల్ వాక్, నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ఉ.6 నుంచి 9.30 వరకు బర్డ్ వాక్ ఉంటుంది. వివరాలకు 73823 07476కు సంప్రదించండి.
ధూల్పేటలో వినాయక విగ్రహాల కొనుగోళ్ల నేపథ్యంలో ఆగస్టు 23 ఉదయం 7 గంటల నుంచి ఆగస్టు 27 రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ ప్రకటించారు. బోయిగూడ కమాన్ నుంచి గాంధీ విగ్రహం వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదన్నారు. విగ్రహాల కోసం వచ్చే వాహనాలను గాంధీ విగ్రహం, పురానాపూల్ నుంచి అనుమతించి, బోయిగూడ కమాన్ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తామని స్పష్టం చేశారు.
SHARE IT
సీపీజీఈటీ – 2025లో భాగంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి దశ ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్ను ఖరారు చేశారు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 28వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 28వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 30వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు.
వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఇది. సిటీకి చెందిన 37 ఏండ్ల వ్యక్తి ఈనెల 16న మానసిక సమస్యతో 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు. కుటుంబీకులు గాంధీ ఎమర్జెన్సీలో చేర్పించారు. జనరల్ సర్జరీ విభాగంలో డాక్టర్లు పేషంట్కు వైద్యపరీక్షలు చేసి, ఆహారం ఇవ్వకుండ, మందులు, ప్లూయిడ్స్ ఇచ్చారు. లక్కీగా జీర్ణాశయంలో ఎలాంటి రక్తగాయాలు కాలేదు. మలద్వారం వెంట 7 బ్లేడ్లు పడిపోవడంతో పేషంట్ను డిశ్చార్జీ చేసినట్లు డా.సునీల్ తెలిపారు.
సహస్ర హత్య కేసులో బాలుడికి సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? అనేదానిపై పూర్తిగా పేపర్ పైన రాసుకొని మరీ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పేపర్లో లాస్ట్ లైన్ మిషన్ కంప్లీటెడ్ అని రాసుకొన్న బాలుడి ఆలోచన విధానం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. పదేళ్ల బాలుడి మైండ్సెట్ ఇలా ఉండటం పట్ల అంతా నివ్వెరపోతున్నారు.
కూకట్పల్లిలోని సంగీత్నగర్లో బాలిక సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.