India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో క్షణాల్లో కోట్లు మాయమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఇటీవలే ఈ కేటుగాళ్లను HYD పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడికి మాయ మాటలు చెప్పి ఏకంగా రూ.5.4 కోట్లు బ్యాంకు ఖాతా నుంచి మాయం చేశారు. ఆసీఫ్నగర్ ప్రాంతంలోనూ ఈ ఘటనలు జరిగాయి. జర జాగ్రత్త..!
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన 10 నెలల తర్వాత ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మూసివేసిన పాత ఇనుప దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు లంచం తీసుకోవడమే కాకుండా మరింత కావాలని డిమాండ్ చేశారని వచ్చిన ఫిర్యాదుతో సీబీఐ హైదరాబాద్ విభాగం స్పందించింది. జీఎస్టీ సూపరింటెండెంట్ వి.డి.ఆనంద్ కుమార్, ఇన్స్పెక్టర్ మనీశ్ శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోబో చికిత్సలు ప్రవేశపెట్టిన ఏడాదిలోనే 300 వరకు శస్త్రచికిత్సలు చేసిన అరుదైన ఘనతను నిమ్స్ వైద్యులు సొంతం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న పేద రోగులకు ఉచితంగా, ఇతర రోగులకు తక్కువ ఖర్చుతోనే ఈ సేవలందిస్తున్నారు. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు పరిమితమైన ఈ రోబోటిక్ సేవలను గతేడాది ఆగస్టులో దాదాపు రూ.30 కోట్లతో నిమ్స్లో ప్రారంభించారు. ప్రస్తుతం నిమ్స్లో ఎక్కువ శాతం ఈ సేవలు పేదలకే అందుతున్నాయి.
అధికారులు పాఠశాలలను సందర్శించినప్పుడు నైపుణ్యాలు అభివృద్ధి చేసే విధంగా ఉపాధ్యాయులకు సూచనలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. మంగళవారం కలెక్టరేట్లో డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐఓఎస్, కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు, మండల నోడల్ అధికారులు, సర్వశిక్షా అభియాన్ కో ఆర్డినేటర్లలతో సమావేశం నిర్వహించారు. ప్రోత్సాహకరమైన, సానుకూల సమస్యలపై చర్చించాలన్నారు.
యువకుడి ఆత్మహత్య కేసులో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా.. మనస్తాపం చెందిన యువతి భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగేసి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకు వెళ్తున్నా అంటూ’ ఉరేసుకొన్నాడు.
కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ గాంధీలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఈ ప్రభావంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం OP సేవలను జూడాలు బహిష్కరించడంతో ఔట్ పేషెంట్ వార్డులో వైద్య సేవలు అందక ఆవేదన చెందుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పేషెంట్లను పట్టించుకునే వారు కరవయ్యారు. ఎలక్టివ్ OT సేవలను కూడా జూనియర్ డాక్టర్లు బాయ్ కాట్ చేశారు.
HYD నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసేవారు. నేటి నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. బైక్లు మినిమం 2 గంటల వరకు నిలిపి ఉంచితే రూ.10, 8 గంటల వరకు రూ.25, 12 గంటల వరకు నిలిపితే రూ. 40 చొప్పున చెల్లించాలి కారు పార్కింగ్ ధరలు వీటికంటే మూడింతలు ఎక్కువగా నిర్ణయించారు. దీనిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పంద్రాగస్టు నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆంక్షలు విధించారు. జంటనగరాల్లో కీలకమైన సికింద్రాబాద్లోనూ నిఘా పెంచారు. మంగళవారం రాత్రి మార్కెట్ పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో 31 బస్టాప్ తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను అపి సోదాలు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అపార్ట్మెంట్లో ఉండేవారికి GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట కీలక సూచన చేశారు. మంగళవారం అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చెత్త కోసం డోర్ టూ డోర్ తిరగకుండా ఒక చోట డస్ట్ బిన్లను ఏర్పాటు చేస్తే సేకరణ సులభతరం అవుతుందన్నారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ వారిని సంప్రదించి డస్ట్ బిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కుల వద్ద కూడా ఇలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.
వేణుస్వామికి మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న స్వయంగా మహిళా కమీషన్ ఎదుట హాజరు కావాలని తెలంగాణ మహిళా కమీషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. నటుడు నాగ చైతన్య.. శోభిత ధూళిపాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని సోమవారం తెలగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర మహిళా కమిషన్కు పిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.