Hyderabad

News August 11, 2024

HYD: JNTUలో ఒకేసారి 2 డిగ్రీలకు ఛాన్స్!

image

HYD జేఎన్టీయూలో బీటెక్ ఇంజనీరింగ్‌తో పాటు BFSI బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మైనర్ డిగ్రీ కోర్సును చదివే అవకాశం కల్పించనున్నట్లు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో సుమారు 5,000 మంది ఇంజనీరింగ్, మరో 5,000 నాన్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు JNTU దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.

News August 11, 2024

HYD: ఆలస్యం జరిగితే చెరువులు కనుమరుగు!

image

HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 3,500 చెరువులన్నింటిని 3 నెలల్లో బఫర్ జోన్లను గుర్తించి నోటిఫై చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జాప్యం జరిగితే అక్రమాలతో చెరువులే కనిపించకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామన్నకుంట చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని హ్యూమన్ రైట్స్ గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

News August 11, 2024

HYD: ఓపెన్ డిగ్రీ, డిప్లొమా, PG చేయాలని ఉందా!

image

HYDలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 31 దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా ఓపెన్ కోర్సులకు దరఖాస్తు చేసుకొని ఉన్నత విద్య అభ్యసించవచ్చని తెలిపారు.

News August 11, 2024

HYD: రేవంత్, బండి సంజయ్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

image

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సీఎం సహాయ మంత్రిగా మారిపోయారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీల్లోకి పెట్టుబడి తీసుకొస్తుంటే ఆయన ఏం చేస్తున్నారని ఆదివారం తెలంగాణ భవన్‌లో నిలదీశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా అని MLA ప్రశ్నించారు. నిరుద్యోగులు ఎన్ని పోరాటాలు చేసినా బీజేపీ నాయకులు మద్దతు ఇవ్వరని మండిపడ్డారు.

News August 11, 2024

HYD: హైడ్రాలో 1,490 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

image

HYDRA బలోపేతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. GHMC, HMDAలో పోలీస్ శాఖ నుంచి 188 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. వీటికి తోడు 1,490 నూతన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ అవుట్‌సోర్సింగ్ పద్ధతిన జరగనుంది. GHMC ప్రాంతం నుంచి ORR వరకు అర్బన్ కోర్ రీజియన్ ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వం, HYD డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ సంస్థను ఏర్పాటు చేసింది.

News August 11, 2024

BREAKING.. HYDలో గొంతు కోసి హత్యాయత్నం

image

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోరబండ పీఎస్ పరిధి కార్మికనగర్‌లోని NI-MSME గ్రౌండ్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు దాడి చేసి, అతడి గొంతుకోసి హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

HYD: ఇక సిటీ మొత్తం సీసీ కెమెరాలు!

image

హైదరాబాద్ నగరం మొత్తం ఇక సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండనుంది. HYD కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ సర్వైలెన్స్ కోసం రూ.50 కోట్లు, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రూ.18 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సేఫ్టీ ప్రాజెక్టులో భాగంగా మహిళ భద్రత కోసం నిర్భయ కింద ప్రత్యేక కేటాయింపులు జరిపింది. నగరాన్ని భద్రతా వలయంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపింది.

News August 11, 2024

HYD: విద్యుత్ బిల్లింగ్ అంచనా రూ.24,000 కోట్లు!

image

TGSPDCL పరిపాలన సౌలభ్యం రీత్యా మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లుగా విభజించారు. దాదాపుగా అన్ని విభాగాల్లో విద్యుత్ కనెక్షన్లు 60 లక్షలకు పైగా దాటాయి. వీటి నుంచి దాదాపు ఏటా రూ.23,000 కోట్ల బిల్లింగ్ డిమాండ్ వస్తుండగా.. ఈ ఏడాది రూ.24,000 కోట్ల బిల్లింగ్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.

News August 11, 2024

HYD: రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం

image

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీఎస్సీ (హన్స్) మొదటి ఏడాది ప్రవేశం కోసం ఈ నెల 12న ఆన్ లైన్‌లో అప్లికేషన్లు తీసుకుంటామని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఈఏపీసెట్- 2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

News August 11, 2024

HYD: రూ.50 కోట్ల బడ్జెట్.. మరో 10 MMTS రైళ్లు!

image

రాష్ట్ర ప్రభుత్వం MMTS రెండో దశ పనుల కోసం దాదాపు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. సీతాఫల్మండి, మౌలాలి మధ్య రెండో లైన్ నిర్మాణం, సికింద్రాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, ఘట్‌కేసర్, మౌలాలి, సనత్ నగర్, లింగంపల్లి, తెల్లాపూర్ మార్గాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లభించనుంది. ఈ మార్గాల్లో 10 MMTS రైళ్ల వరకు కొనేందుకు వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.