India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ISO 9001, ISO 22000తో సహా మొత్తం నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన తొలి ఆలయంగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు, ప్రసాదాల తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డులు వచ్చాయి. ఈ సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సమక్షంలో ఆలయ అధికారులకు ఈరోజు HYDలో అందజేశారు.
HYD KBR పార్క్ వద్ద నిలిచిన వరద నీటిని హైడ్రా తొలగించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ పనులను పర్యవేక్షించారు. ఈ సమస్యను కౌన్సిల్లో పెట్టి పైపులైన్ల ఏర్పాటు పనులను మంజూరు చేయిస్తామని మంత్రి, మేయర్ అధికారులకు చెప్పారు. అప్పటి వరకు ఇక్కడ నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులకు సూచించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవం ఈరోజు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓయూ ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణ్, వీసీ కుమార్ మొగులం చేతుల మీదుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన మాట్లాడుతూ.. గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో 84వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం మొత్తం 121 బంగారు పతకాలను ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ డాక్టర్ నారాయణన్, ఓయూ ఉపకులపతి మొలుగరం ఆచార్య కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఆయా విభాగాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన 1,261 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలోని ఎత్తిపోతల జలపాతం సందర్శనకు ప్రత్యేకంగా బస్సు నడుపుతున్నట్లు HYD మియాపూర్ డిపో మేనేజర్ మోహన్రావు ఈరోజు తెలిపారు. ఈనెల 24న ఉ.5 గంటలకు మియాపూర్ నుంచి బయల్దేరి జలపాతం వద్దకు వెళ్లి తిరిగి అదే రోజు రా.8 గంటలకు మియాపూర్కు చేరుకుంటుందన్నారు. ఆసక్తి గల ప్రయాణికులు 8500309052 నంబర్కు ఫోన్ చేసి, టికెట్లు బుక్ చేసుకోవాలని, ఒక్కో టికెట్ ధర రూ.1,200 అని తెలిపారు.
వానాకాలం చదువులు.. ఈ పేరు విన్నారా.. అంటే వర్షం వచ్చినపుడు ఆరోజు స్కూలుకు వెళ్లేది లేదన్నమాట.. పెద్దలు ఈ మాట చెబుతూ ఉంటారు. ఇపుడు మహానగరంలో ఆ పరిస్థితి నెలకొంది. జీడిమెట్ల అయోధ్య నగర్ ప్రాథమిక ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్థులు లోపలకు వెళ్లలేని పరిస్థితి. సుమారు 230 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
HYD కూకట్పల్లి సహస్ర <<17454835>>హత్య కేసులో<<>> కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనంలో ఉన్న వారిలో ఎవరో బాలికను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చేతబడి కారణంగా హత్య జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. హత్య జరిగిన రోజున భవనం వైపు కొత్త వ్యక్తులు ఎవరూ రాకపోవడంతో, బాలికకు తెలిసినవారే నిందితులుగా ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. బాలిక గొంతుపై ఏకంగా 7 సార్లు పొడిచినట్లు గుర్తించారు.
కూకట్పల్లి అల్లాపూర్ PS పరిధిలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. రాజీవ్గాంధీ నగర్కు చెందిన మహమ్మద్ షాదుల్ను ఆగస్టు 15న ఉదయం భార్య తబ్సుం, ప్రియుడు మొహమ్మద్ తాఫిక్తో కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. 4ఏళ్ల క్రితం తాఫిక్కి తబ్సుంతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
HYD రామంతాపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడడం విషాదకరమని HRC వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై HRC సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిష్కార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం, భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని TGSPDCL సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి <<17452574>>ఎంపికైన విషయం<<>> తెలిసిందే. రంగారెడ్డి(D) కందుకూరు(M) ఆకులమైలారంలో 1946 జులై 8న ఓ సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. 1971లో HYDలోని ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. ప్లీడర్గా పని చేసిన ఆయన 1990లో ఓయూ లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. తమ గ్రామస్థుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంపై ఆకులమైలారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.