Hyderabad

News August 18, 2025

HYD: పైళ్లైన విషయం దాచి యువతితో డాక్టర్ సహజీవనం

image

ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ పోసినపల్లి రాజేందర్‌రెడ్డి (35), పెళ్లయిన విషయాన్ని దాచి ఒక డిజైనర్‌(28)తో సహజీవనం చేస్తున్నారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆ యువతిపై దాడి చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News August 18, 2025

నేటి ఆమనగల్ బంద్ వాయిదా

image

మార్వాడీ గో బ్యాక్ పేరిట ఆమనగల్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంపై ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక కిరాణ, వర్తక, వస్త్ర, బంగారం వ్యాపారులు మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. గత శుక్రవారం కరపత్రాలు ముద్రించి దుకాణాల్లో పంచారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేడు పెట్టిన బంద్‌ను స్థానిక వ్యాపారులు విరమించుకున్నారు.

News August 18, 2025

‘మార్వాడీ గో బ్యాక్’: ఆమనగల్లు బంద్‌పై ఉత్కంఠ

image

ఆమనగల్లు బంద్‌ చర్చనీయాంశమైంది. మార్వాడీలు తమ పొట్ట గొడుతున్నారని SM వేదికగా స్థానిక వ్యాపారులు ‘గో బ్యాక్’ నినాదం ఎంచుకున్నారు. ఎవరి పొట్ట ఎవరూ కొట్టడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్వాడీలు మనలో ఒకరేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అనగా, రోహింగ్యాల కంటే ఎక్కువేం దోచుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్థానిక వ్యాపారుల మద్దతుదారులు తేల్చి చెప్పగా.. బంద్‌ ఉత్కంఠ‌ రేపుతోంది.

News August 18, 2025

గోల్కొండ కోటను ఏలిన గౌడన్న

image

సర్వాయి పాపన్న గౌడ్.. గోల్కొండను ఏలిన వీరుడు. జనగామ(D) ఖిలాషాపూర్‌లో జన్మించాడు. పెద్దలను దోచి పేదలకు పంచిన ఈయన జమీందార్లలో వణుకు పుట్టించాడు. 12 మందితో మొదలైన పాపన్న దళం 12 వేలకు విస్తరించి, చివరకు గోల్కొండలో బహుజన జెండా ఎగరేశాడు. ఇది నచ్చని జమీందార్లు మొగల్ రాజును ఉసిగొల్పి, పాపన్న మీద దాడి చేయించారు. శతృవులు చంపారని కొందరు, పాపన్నే ప్రాణత్యాగం చేశారని మరికొందరు చెబుతారు.
నేడు పాపన్న గౌడ్ జయంతి.

News August 17, 2025

HYD: వినాయకచవితి.. పోలీసుల సూచనలు

image

వినాయకచవితి నేపథ్యంలో పోలీసులు ఆర్గనైజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. DJల స్థానంలో సంప్రదాయంగా కళాకారులతో కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆదివారం మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు పలు సూచనలు చేశారు.
SHARE IT

News August 17, 2025

HYD: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ దూరవిద్య కేంద్రంలో ఈ విద్యా సంవత్సరానికి MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 2వ తేదీ వరకు, రూ.500 ఫైన్‌తో 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాగా సెప్టెంబర్ 7న ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. టీజీఐసెట్-2025లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ కోర్సుల్లో నేరుగా ప్రవేశం కల్పించనున్నారు.

News August 17, 2025

HYD: వినాయకుడిని తీసుకెళ్లేవారికి సూచనలు

image

ఆరాంఘర్‌ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి వేళ విగ్రహాల తరలింపుపై జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న విగ్రహాలను ట్రక్కులో తరలించాలని, పెద్ద విగ్రహాల కోసం ట్రాక్టర్లు లేదా ప్రత్యేక వాహనాలను ఉపయోగించాలని చెబుతున్నారు. ప్రయాణ సమయంలో విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News August 16, 2025

HYD: అదుపుతప్పిన వాహనం.. కిందపడిపోయిన విగ్రహం

image

ఆరాంఘర్‌ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయింది. వాహనం అదుపుతప్పి విగ్రహం ఒకేవైపు ఒరిగి, కిందపడిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డుగా భారీ ప్రతిమ పడిపోవడంతో ఆ రూట్‌లో ట్రాఫిక్ జామైంది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మండపానికి తీసుకెళ్తుంటే ఊహించని సంఘటన ఎదురైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

News August 16, 2025

అబిడ్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

image

నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామైంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్‌ టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ఈ ప్రభావంతో అబిడ్స్, జగదీశ్ మార్కెట్, మొజంజాహీ మార్కెట్, కోఠి రూట్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
SHARE IT

News August 16, 2025

జూబ్లీహిల్స్‌‌లో బూత్ స్థాయిలో పటిష్టం కావాలి: తుమ్మల

image

జూబ్లీహిల్స్‌లో కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేస్తూ బూత్ స్థాయిలో పటిష్టం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ మధురానగర్, యాదగిరినగర్ 105 నుంచి 114 బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. బూత్ స్థాయిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని, ఎన్నికల నాటికి పటిష్టం కావాలని తుమ్మల సూచించారు.