Hyderabad

News August 4, 2024

HYD: చదువుకుంటూనే నాలుగు ఉద్యోగాలు సాధించిన తులసి

image

ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతూ నల్లగొండకు చెందిన చింతల తులసి ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభంజనం సృష్టించింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో AEE, AE, గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించిన తులసి.. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా గత రెండు సంవత్సరాలుగా పరీక్షలకు సన్నద్ధమవుతూ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది.

News August 4, 2024

HYD: 3ఏళ్లలో బెంగళూరును అధిగమిస్తాం: మంత్రి

image

IT ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.

News August 4, 2024

RR జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాలు

image

RR జిల్లా కలెక్టర్ శశాంక అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.✓LRS అప్లికేషన్లో ప్రాసెసింగ్‌పై చర్యలు చేపట్టాలి.✓పెండింగ్ ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ✓అంగన్వాడి కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలి. ✓జిల్లావ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం విజయవంతం చేయాలి.✓రైతు రుణమాఫీపై రైతులకు సమాచారం అందించండి.

News August 4, 2024

HYD: 309 మంది మందు బాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాగి వాహనాలు నడిపి 309 మంది బాబులు పోలీసులకు పట్టుబడ్డారు. కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 309 మందిలో అత్యధికంగా 211 మంది ద్విచక్ర వాహనదారులు కాగా.. 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కారు, ఒకరు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు.

News August 4, 2024

HYD: యామినీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన CM

image

పద్మ పురస్కారాల గ్రహీత, ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల రాష్ట్ర CM రేవంత్ రెడ్డి HYDలో సంతాపం తెలిపారు. భరత నాట్య, కూచిపూడి నృత్య కళకు యామినీ విశిష్ట సేవలందించారని, ఎంతో మంది యువతకు నాట్యం నేర్పించి దేశంలోనే కళారంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.

News August 4, 2024

హైదరాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే హైదరాబాదీ‌లు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

News August 4, 2024

Breaking: HYD: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ లీడర్ మృతి

image

HYD శివారు ఆమనగల్లు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పులిగోనిపల్లి తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రమేశ్ నాయక్ (36) ఆమనగల్లు నుంచి తన ఆటోలో తండాకు వెళుతున్నాడు. హనుమాన్ ఆలయం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు SI వెంకటేశ్ తెలిపారు.

News August 3, 2024

నాంపల్లి: 30% రైతులకు మాత్రమే రుణమాఫీ: కొండపల్లి శ్రీధర్

image

రైతు రుణమాఫీ విషయంలో వేలాది మంది రైతులకు అన్యాయం జరిగిందని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, వేలాది మంది రైతులు తమకు కాల్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలతో 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. మిగతావారు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నెల 5నుంచి గ్రామాల వారిగా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

News August 3, 2024

HYD: ఏటా 15 వేల గర్భాశయ క్యాన్సర్ కేసులు!

image

రాష్ట్రంలో ప్రతి ఏటా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 15 వేలు నమోదవుతుండగా.. కొత్త కేసుల్లో 13% సర్వైకల్ క్యాన్సర్ ఉంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక్క HYD MNJ ఆస్పత్రిలోనే రోజూ 300-400 మందికి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తుండగా 2-3 కేసులు బయట పడుతున్నాయి. ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో వ్యాక్సిన్ అందించినట్లు MNJ డైరెక్టర్ జయలత తెలిపారు.

News August 3, 2024

హైదరాబాద్‌లో ఇక సందడే.. సందడి

image

మూడంతో 3 నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ రానుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30వ తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, శ్రావణ మాసం SEP3తో ముగుస్తుంది.