Hyderabad

News August 16, 2025

HYD: హెడ్ కానిస్టేబుల్‌పై వేధింపుల కేసు

image

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(39)పై వేధింపుల కేసు నమోదైంది. బల్కంపేట్‌కు చెందిన ఓ వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రముఖ కొరియోగ్రాఫర్ బంధువు అని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 16, 2025

HYD: నమ్రతతో పాటు ఆమె కొడుకు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

సృష్టి కేసులో నమ్రతతో పాటు ఆమె కొడుకు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. నమ్రత నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందని పోలీస్ తరఫు న్యాయవాది వాదించారు. నమ్రత కంపెనీలపై దర్యాప్తు జరపాల్సి ఉందని చెప్పారు. మరోవైపు తన కొడుకు పెళ్లి ఉందని కోర్టుకు నమ్రత తెలిపింది. ఇరువాదనల తర్వాత బెయిల్ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

News August 16, 2025

HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

image

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్‌లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.

News August 16, 2025

HYD: 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు

image

వచ్చే నెల 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలో వివిధ డిగ్రీ కోర్సుల్లో చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు వన్ టైం ఛాన్స్ పరీక్షకు అర్హులన్నారు. ఓయూ క్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో వన్ టైం ఛాన్స్ పరీక్షకు ఫీజులు చెల్లించవచ్చని కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు.

News August 16, 2025

HYD: మత్తు అనేక సమస్యలకు దారితీస్తుంది: ED

image

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్ పాల్గొని ఉద్యోగులతో మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. మత్తుపదార్థాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవడానికి ప్రతిఒక్కరూ చైతన్యంతో ముందుకురావాలని, మత్తుపదార్థాల నుంచి దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

News August 16, 2025

HYD: కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు కధీరవన్ పళని, జి.ముకుంద రెడ్డి, డీఆర్ఓ ఈ.వెంకటాచారితో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

News August 16, 2025

HYD: కోకాపేట్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

HYD కోకాపేట్ పరిధిలోని పోలువామి 90 విలాస్ ముందు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రోడ్డు దాటుతున్న సమయంలో టాండాల మంజుల(44) అనే మహిళను దత్తుచంద్ర అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. మంజుల గాంట్లకుంట పరిధి కన్వాయిగూడెం తండాకు చెందిన మహిళ అనే నార్సింగి పోలీసులు తెలిపారు.

News August 15, 2025

ఆ కష్టాలు మళ్లీ రాకుండా GHMC ముందు జాగ్రత్త..!

image

2020, 2023లో భారీ వర్షాల కారణంగా గ్రేటర్ HYD పరిధిలోని పలు చెరువులు నిండి కట్టలు తెగి బస్తీలు, కాలనీల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ఆ సమస్య ఉత్పన్నం కాకుండా గ్రేటర్ అధికారులు చెరువుల ఎఫ్టీఎల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎఫ్టీఎల్‌కు రెండు అడుగుల తక్కువగానే నీరుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్‌కు దగ్గరగా నీటి మట్టం పెరిగితే నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

News August 15, 2025

HYD: లోకల్ వ్యాపారుల పోరాటం.. బంద్‌కు పిలుపు

image

మార్వాడీ వ్యాపారస్థులకు వ్యతిరేకంగా లోకల్ వ్యాపారులు చేస్తోన్న పోరాటం ఉద్ధృతమవుతోంది. నార్త్ ఇండియా నుంచి TGకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, తాము ఎలా బతకాలంటూ వారు వాపోతున్నారు. ‘మార్వాడీ వ్యాపారస్థులు గోబ్యాక్’ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లులో లోకల్ వ్యాపారస్థులందరూ కలిసి ఈనెల 18న స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు.కాగా ఇదంతా BRS,కాంగ్రెస్ కుట్ర అని బండి సంజయ్ HYDలో ఆరోపించారు.

News August 15, 2025

HYD: అద్భుత రూపంలో శ్రీదుర్గాదేవి అమ్మవారు

image

HYD ఎల్బీనగర్ పరిధి మన్సూరాబాద్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వేళ అమ్మవారిని గాజులతో అలంకరించారు. నిమ్మకాయల దండ వేశారు. అమ్మవారు భక్తులకు అద్భుతంగా దర్శనమిచ్చారు. మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి దర్శించుకుంటున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ పోచబోయిన గణేశ్ యాదవ్ తెలిపారు.