India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్యాబ్ బుక్ చేసుకొన్న కొండాపూర్కు చెందిన యువతికి డ్రైవర్ నుంచి అసభ్యకర సందేశం రావడంతో ఖంగుతిన్నట్లు తెలిపారు. ‘క్యాబ్ ఎక్కకుండా రోడ్డుపైనే ఉండిపోయాను. డ్రైవర్ తీరు పట్ల సదరు సంస్థకు ఫిర్యాదు చేశాను. అతడిపై పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి’ అని SMలో పోస్ట్ చేశారు. స్పందించిన పోలీసులు తదుపరి చర్యలకై ఆమెకు సూచనలు చేశారు. ఎవరైనా ఇలా వేధిస్తే వెంటనే 87126 56856(WhatsApp), డయల్ 100కు సమాచారం ఇవ్వండి.

నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ‘అడ్వాన్స్ పేమెంట్’ నిబంధన తేవడంతో డీలర్లు నగదు కోసం UPI, కార్డు చెల్లింపులు నిలిపివేసి ‘ఓన్లీ క్యాష్’ బోర్డులు తగిలించారు. సాధారణ పెట్రోల్ లేదంటూ ఖరీదైన ప్రీమియం రకాలను అమ్ముతూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. యుద్ధం వస్తుందన్న పుకార్లతో జనం ఎగబడటంతో బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి.

నుమాయిష్ ఎగ్జిబిషన్లో Gen-Z మొదలుపెట్టిన కిర్రాక్ ట్రెండ్ సిటీని ఊపేస్తోంది. నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్లేట్లు పక్కనపెట్టి Cake in a Can పట్టుకుని రీల్స్ చేసిన కుర్రాళ్ళు.. ఇప్పుడు ఆ ట్రెండ్ని సిటీలోని పాప్-అప్ స్టాల్స్, ఇన్ఆర్బిట్ మాల్లోని ‘స్ట్రాబెర్రీ కార్నివాల్స్’కి షిఫ్ట్ చేశారు. స్ట్రాబెర్రీ ట్రీట్స్తో ‘Strawberry Stories’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అది అసలైన ‘వైబ్’ అంటున్నారు.

పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. HYDలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ప్రకటించింది. పెట్రోల్ బంకుల వద్ద క్యూలకు బదులుగా ప్రజా రవాణా వినియోగించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఇది ఇంధన పొదుపు, కాలుష్య తగ్గింపు, ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. నగరంలో పెట్రోల్ కొరత లేదని అధికారులు చెప్పినా బంకుల వద్ద క్యూ లైన్లు తగ్గడం లేదు.

HYDలో ఇంధన కొరత లేదని పోలీసులు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నిన్నటి నుంచి నగరంలో పెట్రోల్పై నెలకొన్న పుకార్లపై పోలీసులు సీరియస్ అయ్యారు.

నగర మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడం, వేసివి అధిక వినియోగంతో వీటి ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్ సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. నేడు సభలో ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై చర్చించేందుకు BRS సిద్ధమైంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసన సభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.

పరీక్షలంటేనే పరేషాన్ అవుతున్నారా? అయితే మీకోసం సైకాలజిస్టులు రెడీగా ఉన్నారు. తెలంగాణ పదో తరగతి విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (APA ఇండియా) ఉచిత టెలి కౌన్సెలింగ్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 105 మంది నిపుణులు అందుబాటులో ఉండి, విద్యార్థుల ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆందోళనగా ఉంటే వెంటనే 8008553069, 8686444200 నంబర్లకు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చు.

పరీక్షలంటేనే పరేషాన్ అవుతున్నారా? అయితే మీకోసం సైకాలజిస్టులు రెడీగా ఉన్నారు. తెలంగాణ పదో తరగతి విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (APA ఇండియా) ఉచిత టెలి కౌన్సెలింగ్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 105 మంది నిపుణులు అందుబాటులో ఉండి, విద్యార్థుల ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆందోళనగా ఉంటే వెంటనే 8008553069, 8686444200 నంబర్లకు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చు.

పరీక్షలంటేనే పరేషాన్ అవుతున్నారా? అయితే మీకోసం సైకాలజిస్టులు రెడీగా ఉన్నారు. తెలంగాణ పదో తరగతి విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (APA ఇండియా) ఉచిత టెలి కౌన్సెలింగ్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 105 మంది నిపుణులు అందుబాటులో ఉండి, విద్యార్థుల ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆందోళనగా ఉంటే వెంటనే 8008553069, 8686444200 నంబర్లకు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చు.
Sorry, no posts matched your criteria.