India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అటువంటి వార్తలను నమ్మొద్దని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. మళ్లీ ఈ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారని వార్తలు వస్తున్నట్లు గుర్తు చేశారు. కానీ, ఆ జాబితాలో తాను లేనన్నారు. కాంగ్రెస్లోనే ఉంటానని కాలే యాదయ్య స్పష్టం చేశారు.
యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన అమ్మాయితో స్వామికి FBలో పరిచయమైంది. ఆమెను HYDకి రప్పించిన అతడు పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడు. చివరకు ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మహంకాళీ పోలీసులు ఎయిర్పోర్ట్లోనే స్వామిని అరెస్ట్ చేశారు. CI పరశురాం, SIలు వెంకటేశ్వర్లు, పరదేశి జాన్, కానిస్టేబుల్స్ వంశీ, రుషి చరణ్ సిబ్బంది ఉన్నారు.
HYD వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్పై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే హోటల్లో యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. స్నేహితుడితో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యా పరంగా దేశంలోనే 4వ స్థానంలో ఉన్న ఎయిర్పోర్ట్ త్వరలోనే ఆస్థానాన్ని మరింత మెరుగుపరచుకోనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే 10.9% పెరుగుదలతో శరవేగంగా బిజీగా మారుతున్న ఎయిర్ పోర్టులలో నగరం ఒకటిగా నిలుస్తోంది.
ధార్ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఘట్కేసర్ క్రైమ్ ఎస్ఐ అశోక్ సూచించారు. హైదరాబాద్ నగరంలో ధార్ గ్యాంగ్ కదలికలు కనిపించాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులపై అనుమానం వస్తే ఫోన్ చేయాలని కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల హైదరాబాద్లో ధార్ గ్యాంగ్ పలు చోట్ల చోరీలకు పాల్పడిన విషయం విదితమే.
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్-పరిగి-కృష్ణా రైల్వే లైన్ పనులపై రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్ సభలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న BJPకి లోక్ సభలో విప్గా బాధ్యత నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్ సభ స్పీకర్కు పార్టీ తరుఫున చీఫ్ విప్, విప్లుగా నియమించిన వారి పేర్లను తెలియజేశారు. రాష్ట్రం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపిక కావడం పట్ల కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. ఉప్పల్ PS పరిధి రామంతపూర్లోని వెంకట్ రెడ్డి నగర్లో 4 అంతస్థుల భవనం నుంచి దూకి దివ్య(29) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అంబర్పేట్ ప్రేమ్ నగర్కు చెందిన దివ్యకు రామంతపూర్ రామ్ రెడ్డి నగర్కు చెందిన నవీన్తో ఏప్రిల్ 24, 2024న పెళ్లైంది. ఈనెల 27న దివ్య మిస్ ఐనట్లు పుట్టింటి వారికి చెప్పారు. నేడు ఆత్మహత్య చేసుకోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు.
మాజీమంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతిని సోమవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLAలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేష్లు పాల్గొని ముఖేష్ గౌడ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు.
గ్రేటర్ HYDలో చైన్ స్నాచర్లు విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రోడ్లపై వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు. బైక్లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లేవారికి ఓ చీటీ చూపి అడ్రస్ అడుగుతున్నారు. వారు చెప్పేలోపే గోల్డ్ చైన్ కొట్టేసి పరారవుతున్నారు. తాజాగా పటాన్చెరు పరిధి అమీన్పూర్ వాసి అశ్విని గొలుసును దుండగులు ఇలాగే కొట్టేశారు. జర జాగ్రత్త!
SHARE IT
Sorry, no posts matched your criteria.