India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏటా పెరంబదూర్ నుంచి ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి నాటికి ఢిల్లీకి చేరుకునేలా చేపట్టే రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు HYDకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచన మేరకు యాత్రకు గాంధీ భవన్లో స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కుమార్రావ్, నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ ఉన్నారు.
సికింద్రాబాద్ కార్ఖానా ట్రాఫిక్ PS పక్కనే మెయిన్ రోడ్డుపై భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత ఏర్పడి ఏడాది దాటిందని, ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయలేదని, ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి గుంతను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చిన బైక్ నడిపే వ్యక్తి కారును ఢీకొట్టి గాయపడ్డాడు. మీ ప్రాంతంలో ఇలాంటి గుంతలు ఉంటే కామెంట్ చేయండి.
HYDలో ఉన్న బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించారు. ఇవాళ 20 మంది ఆ దేశీయులను పోలీసులు గుర్తించారు. 20 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. బీఎస్ఎఫ్ అధికారులకు పోలీసులు వారిని అప్పగించారు. ఇటీవల వ్యభిచార గృహాలలో బంగ్లాదేశ్ యువతులను గుర్తించిన విషయం తెలిసిందే. వారిని విచారించిన పోలీసులు వారి వివరాలను వెలికితీసి బార్డర్లో అప్పగించారు.
భారీ వర్షాలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 24 గంటలు అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా 10 వేల మంది విద్యుత్ సిబ్బంది షిఫ్ట్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ నిఘా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జునసాగర్, జూరాల, కడెం ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష కొనసాగుతోంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమాతో పాటు పలు రకాల సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్టు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ను www.braouonline.in సంప్రదించాలని సూచించారు.
పోలీస్ వస్తుండంటే దొంగ పారిపోయినట్లు ఉంది ఈ కథ. కీసరలో బుధవారం ఒకేసారి మెడికల్ షాపులు మూతబడ్డాయి. స్ట్రైక్ ఏమైనా చేస్తున్నారా? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి జనం షాకయ్యారు. మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నాడని షాపులు మూసేయడంతో ముక్కున వేలేసుకున్నారు. నిబంధనలు పాటిస్తోన్న షాపులే లేవా? అని ఆలోచనలో పడ్డారు. మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
SHARE IT
SR నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఈనెల 6న పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ముగ్గురు ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్లను బుధవారం నాంపల్లి కోర్టు 12 జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని వెల్లడించారు. వారికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2,100 జరిమానా విధించారని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించారు. బుధవారం నాంపల్లిలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని,మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలను వివరిస్తూ, నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్పురలో విద్యార్థులతో కలిసి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని నిర్వహించారు. గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ జె.అచ్యుతాదేవి, నంద గోపాల్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.